NZB: బోధన్ మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడంలో కమిషనర్ చేసిన కృషిని కలెక్టర్ ప్రశంసించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నఅధికారుల సమన్వయం, క్రమశిక్షణతో కూడిన చర్యలు, ప్రజల సహకారం వల్ల ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు.