TG: రాష్ట్ర ఉద్యమకారులకు సంబంధించి ‘అభయహస్తం’ పథకం అమలుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం.. 8 వారాల్లోగా ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇళ్ల స్థలం, నెలకు రూ.25,000 పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపిస్తూ పలువురు ఉద్యమకారులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.