• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

కామారెడ్డి: జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సింధూశర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14న అదాలత్ ఉంటుందని, కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.

December 13, 2024 / 09:30 AM IST

మార్టూరు మండలంలో విద్యుత్ తనిఖీలు

ప్రకాశం: మార్టూరు మండలంలో గురువారం విద్యుత్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 63 కేసులు నమోదు చేసి 3,18,000 అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. విద్యుత్ EE మస్తాన్ రావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. మార్టూరు డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.సురేంద్ర బాబు, అద్దంకి డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.దామోదరరాజు తదితరులు పాల్గొన్నారు.

December 13, 2024 / 09:26 AM IST

గుకేష్‌పై సినీ ప్రముఖుల ప్రశంసలు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 18 ఏళ్లకే అరుదైన ఘనత సాధించిన అతనికి రాజమౌళి, ఎన్టీఆర్, చిరంజీవి, కమల్ హాసన్ కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెట్టారు. ‘ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించావు. ప్రపంచవేదికపై దేశం గర్వపడేలా చేశావు’ అంటూ రాసుకొచ్చారు.

December 13, 2024 / 09:26 AM IST

మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పశ్చిమ విహార్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్ సహా పలు పాఠశాలలకు ఆగంతకులు ఈ-మెయిల్స్ పంపించారు. అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు అధికారులు తనిఖీలు చేపట్టగా.. పేలుడు పదార్థాలు లభించలేదు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

December 13, 2024 / 09:25 AM IST

వరంగల్ భద్రకాళి అమ్మవారికి పూజలు

WGL: భద్రకాళి అమ్మవారికి అర్చకులు ఈరోజు అభిషేకం నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

December 13, 2024 / 09:22 AM IST

దారి దోపిడీ చేసే ముఠా అరెస్ట్

ప్రకాశం: కత్తితో బెదిరించి దారి దోపిడీలు చేసే ముఠాను అరెస్టు చేసినట్లు ఉలవపాడు SI అంకమ్మ శుక్రవారం తెలిపారు. కందుకూరు CIతో కలిసి గురువారం నేషనల్ హైవేపై రాజుపాలెం జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడిందన్నారు. బైక్‌పై వెళ్తున్న రమేశ్, దివ్య తేజ అనే ఇద్దరి వద్ద కత్తి దొరకగా విచారణలో వారు దారి దోపిడీలు చేసే ముఠా అని తేలిందని అన్నారు.

December 13, 2024 / 09:22 AM IST

జొమాటోకు రూ.803 కోట్ల నోటీసు

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి GST డిమాండ్ నోటీసులు వచ్చాయి. జొమాటో వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందని నోటీసుల్లో పేర్కొన్నట్లు కంపెనీ తెలిపింది. రూ.803.4కోట్లు చెల్లించాలని ఆదేశించినట్లు చెప్పింది. డెలివరీ ఛార్జీలపై బకాయిలు.. దానికి వడ్డీ, పెనాల్టీ కింద ఈ మొత్తం చెల్లించాల్సి ఉంది. అయితే దీనిపై అధికారుల వద్దకు అప్పీలుకు వెళ్లనున్నట్లు జొమాటో వెల్లడ...

December 13, 2024 / 09:21 AM IST

జొమాటోకు రూ.803 కోట్ల నోటీసులు

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి GST డిమాండ్ నోటీసులు వచ్చాయి. జొమాటో వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందని నోటీసుల్లో పేర్కొన్నట్లు కంపెనీ తెలిపింది. రూ.803.4కోట్లు చెల్లించాలని ఆదేశించినట్లు చెప్పింది. డెలివరీ ఛార్జీలపై బకాయిలు.. దానికి వడ్డీ, పెనాల్టీ కింద ఈ మొత్తం చెల్లించాల్సి ఉంది. అయితే దీనిపై అధికారుల వద్దకు అప్పీలుకు వెళ్లనున్నట్లు జొమాటో వెల్లడ...

December 13, 2024 / 09:21 AM IST

‘వజ్రవాహనం అల్లర్ల సమయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది’

MNCL: వజ్రవాహనం ప్రధానంగా అల్లర్లు జరిగే సమయంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని CP శ్రీనివాస్ అన్నారు. నూతన సాయిధ దళ AR కానిస్టేబుల్లకు పోలీస్ విధులలో భాగంగా అల్లర్ల సమయంలో ఉపయోగించే పోలీస్ వజ్ర వాహనం గురించి అవగాహన కల్పించారు. అల్లర్లు జరిగే సమయంలో స్మోక్, స్టన్ గ్రైనేడ్(భారీ శబ్దంతో కూడిన) సెల్స్ ఏవిధంగా ఫైర్ చేయాలనే స్వయంగా ఫైర్ చేసి వివరించారు.

December 13, 2024 / 09:20 AM IST

గుమ్మడి విత్తనాలతో ప్రయోజనాలు

1. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.2. మధుమేహం, గుండె సమస్యలను తగ్గిస్తాయి.3. నాడీ వ్యవస్థ తీరును మెరుగుపరుస్తాయి.4. చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.5. నిద్రలేమి సమస్యలకు చెక్ పెడుతుంది.6. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.7. కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా చేస్తాయి.

December 13, 2024 / 09:17 AM IST

డబ్బుల విషయంలో మధ్య వర్తిత్వం.. సూసైడ్

BDK: డబ్బులు ఇప్పించిన విషయంలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన పినపాక మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణయ్ ఓ వ్యక్తికి అప్పు ఇప్పించాడు. ఆ వ్యక్తి తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో ఒత్తిడికి గురైన ప్రణయ్ రెండు రోజుల క్రితం పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు.

December 13, 2024 / 09:16 AM IST

మైదుకూరు షాదిఖానాలో మాయమైన టేకు చెట్లు

కడప: జిల్లా మైదుకూరు షాదిఖానాలో 13 టేకు చెట్లు నరికివేత సంఘటన జరిగింది. ఎవరు నరికారు, ఎవరు తీసుకెళ్లారో, లేదా అమ్ముకున్నారా అన్నా అనుమానం స్థానికు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. షాదీ ఖానా నిర్వాహకులు పనేనా లేక మరెవరైనా తీసుకెళ్లారా అన్న కోణంలో విచారించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు విన్నవించారు.

December 13, 2024 / 09:14 AM IST

సోంపేటలో అక్రమ మద్యం అమ్మకం ఇద్దరి అరెస్టు

SKLM: సోంపేటలోని అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపులపై ఎస్సై లవరాజు ఆధ్వర్యంలో గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. పెద్దపల్లి, మొగలికొత్తూరు వీధిలో మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరి నుంచి 18 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు.

December 13, 2024 / 09:14 AM IST

జనవరి నుంచి కోటిపల్లి- నరసాపురం రైల్వేలైన్ పనులు

కోనసీమ: జిల్లా ప్రజలకు కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ ఎన్నో ఏళ్లనాటి కల. ఈ రైల్వేలైన్ పూర్తికావడానికి 13 కి.మీ. అప్పగించకపోవడంతో పనులు ఆగాయని R&B ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతి లాల్ దండే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఆ భూముల్లో వరికోతలు మొదలయ్యాయని, జనవరి నుంచి రైల్వే అధికారులు పెన్ మార్కింగ్ వేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

December 13, 2024 / 09:13 AM IST

పూర్తయిన వరిధాన్యం కొనుగోళ్లు

KNL: గొల్లపల్లి మండల వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. 95 శాతం కొనుగోళ్లు చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పలువురు రైతులు నారు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే 20 రోజుల్లో వరి నాట్లు ప్రారంభం కానున్నాయి. మండల వ్యాప్తంగా వచ్చే సీజన్ లోనూ మళ్లీ వరిని ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు.

December 13, 2024 / 09:13 AM IST