ATP: అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ సరిపూటి రమణను ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ.. టీడీపీ కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్తున్న కారణంగా సరిపూటి రమణకు సత్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ ఆదినారాయణ పాల్గొన్నారు.
ASR: పెదబయలు మండలం కిముడుపల్లి గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ రూ.3లక్షల తక్షణ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. కొర్రా లక్ష్మి, పెద్ద కుమారుడు సంతోష్, కూతురు అంజలి విద్యుత్ ప్రమాదంలో సోమవారం మృతి చెందిన ఘటన విధితమే. ఈమేరకు జాయింట్ కలెక్టర్ అభిషేక్, ఐటీడీఏ పీవో వి.అభిషేక్ చేతుల మీదుగా అందజేశారు.
SRPT: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం నుంచి కోడూరు-కొమ్మాల మధ్య జరుగుతున్న రోడ్డు పనులు మంగళవారం ఎమ్మెల్యే సామేలు పర్యవేక్షించారు. రోడ్డుకి ఇరువైపులా నిర్మించిన బ్రిడ్జిలను పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో కూడిన రోడ్డు వేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిషేక్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.
ATP: భూసమస్యలతో పాటు ప్రజలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని యాడికి తహశీల్దార్ ప్రతాప్ రెడ్డి అన్నారు. యాడికి మండలం నగరూరు గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధికారి వీర్రాజు మాట్లాడారు. కేవలం భూ సమస్యలే కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
ASR: ఈనెల 13వ తేదీ నుండి జనవరి 10వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని పాడేరు మండల తహసీల్దార్ వంజంగి త్రినాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పాడేరు మండలంలో 26పంచాయతీల సచివాలయం పరిధిలో ఉదయం 9.30గంటల నుండి సాయంత్రం 5గంటలకు వరకు సదస్సులు నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ సదస్సులో రైతుల నుండి వినతులు స్వీకరించి భూమి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
ప్రకాశం: అమరావతిలోని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎంపికై నామినేషన్లు వేస్తున్న సందర్భంగా మంగళవారం బీద మస్తాన్రావు, సానా సతీష్లను ఒంగోలు, గిద్దలూరు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ముత్తుముల అశోక్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో రాష్ట్ర తరపున తమ వాణిని గట్టిగా వినిపించాలని కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ను బీజేపీ రాష్ట్ర నేత తాండ్ర వినోద్ రావు కోరారు. ఎయిర్ పోర్ట్ ఏర్పాటు పనులు, సింగభూపాలెం చెరువు కరకట్టను పర్యటక కేంద్రంగా అభివృద్ధి, మణుగూరులో నవోదయ విద్యాలయం ఏర్పాటు, ఏజెన్సీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కోరారు.
ADB: ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల వివిధ కేసుల్లో పట్టుబడిన 13 బైక్లు, ఒక కారును ఈ నెల 12న వేలం వేస్తున్నట్లు సీఐ తెలిపారు. అదిలాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎక్సైజ్ అధికారి హేమశ్రీ ఆధ్వర్యంలో వేలంపాట ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ప్రభుత్వంచే నిర్దేశించబడిన ధరావతు సొమ్మును చెల్లించి బహిరంగ వేలంపాటలో పాల్గొనవచ్చన్నారు.
NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ యనమల నాగరాజు సూచించారు. దుత్తలూరు మండలం మందాలనాయుడుపల్లిలో రెవెన్యూ సదస్సు మంగళవారం నిర్వహించారు. పలు రకాల సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
ATP: తాడిపత్రిలో అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాపరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్లో రికార్డులను పరిశీలించారు. గర్భవతులు, బాలింతలకు సక్రమంగా పౌష్టిక ఆహారం అందిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ డా.బీఎన్ శ్రీదేవి, సీడీపీవో, ఇతర సిబ్బంది ఆయన వెంట పాల్గొన్నారు.
ATP: గుత్తి ఆర్ఎస్లోని రైల్వే ఇన్స్టిట్యూట్లో మంగళవారం గుంతకల్ పద్మావతి ఆయుర్వేద హాస్పిటల్, రైల్వే ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డీజిల్ షెడ్ ఎండీఎంఈ సుంకన్న వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రోగులను పరీక్షించి ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు.
BPT: మంగళవారం బాపట్ల చేరుకున్న రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జిల్లాకు చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఘన స్వాగతం పలికారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం వారు జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని రెవెన్యూ శాఖపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
తన సేవలు గుర్తించి బీజేపీ అవకాశం ఇచ్చిందని బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. బీజేపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తాను పార్టీలు మారటం లేదని.. పార్టీలే తన దగ్గరకు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు బీసీలకు ఏం చేయాలన్నా బీజేపీతోనే సాధ్యమని.. బీసీల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తానని చెప...
KMR: మద్నూర్ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రికి, జూనియర్ కళాశాల, గురుకుల బాలుర పాఠశాల కోసం ఇనాని కుటుంబ సభ్యులు భూదానం చేయడం గొప్ప విషయమని ఎంపీడీవో రాణి అన్నారు. మంగళవారం పాత బస్టాండ్ వద్ద సేఠ్ రాం ప్రసాద్ ఇనాని జయంతి వేడుకలో పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు. గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్, ఇనాని కుటుంబ సభ్యులు ఉన్నారు.
కృష్ణా: విజయవాడలోని గుణదల ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం తొలగించారు. నగరపాలక సంస్థ కమిషనర్ దాన్య ఆదేశాల మేరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారి వసీం బేగ్ హెచ్చరించారు.