ఇరాన్తో యుద్ధంపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పదవీకాలంలో ఇరాన్తో యుద్ధం జరిగే అవకాశం వస్తుందా అన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ.. ‘ఏదైనా జరగొచ్చు’ అని అన్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్ రష్యాపై క్షిపణులతో విరుచుకుపడటం అత్యంత ప్రమాదకరమైన విషయంగా భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
నెల్లూరు: ముత్తుకూరులోని మత్స్య కళాశాలలో శుక్రవారం ఉదయం ఆక్వాపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు అసోసియేట్ డీన్ బాలసుబ్రమణియన్ తెలిపారు. అవేర్నెస్ కమ్ ఫీల్డ్ డెమాన్స్ట్రషన్ ప్రోగ్రామ్ ఆన్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా సిస్టమ్స్ అనే అంశంపై సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.
చిత్తూరు: జీవితంపై విరక్తి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిట్టూరుకు చెందిన దామోదర నాయుడు (50) అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో జీవితంపై విరక్తి చెందాడు. దీంతో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KNL: కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం గుంతకల్ డివిజన్లో 243 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డోన్ బ్రాంచ్ ఛైర్మన్ షేక్ షబ్బీర్ హుస్సేన్, సెక్రటరీ వెంకటేశ్వర్లు కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రైల్వే స్టేషన్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేస్తూ సంబరాలు చేశారు.
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా గుకేష్ నిలిచాడు. ఈ నేపథ్యంలో ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల నగదు బహుమతిని గుకేష్ అందుకున్నాడు. రన్నరప్ లిరెన్ రూ.9.75 కోట్లు సొంతం చేసుకున్నాడు. మొత్తం ప్రైజ్ మనీ రూ.21.17 కోట్లు కాగా, ఒక గేమ్ గెలిచిన ప్లేయర్కి రూ.1.69 కోట్లు అందిస్తారు. గుకేష్ గెలిచిన 3 గేమ్స్కు రూ.5.07 కోట్లు, లిరెన్ 2 గేమ్స్కు రూ.3.38కోట్లు ఇచ్చారు. మిగిలిన మ...
ప్రకాశం: విమాన ప్రయాణం, సేవలు, విమానాశ్రయాల అభివృద్ధి, డేటా భద్రత తదితర అంశాలపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గురువారం పార్లమెంట్ లో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర సహాయక మంత్రి మురళీధర్ మొహాల్ సమాధానమిస్తూ డీజీయాత్ర యాప్ ద్వారా పత్రాల అవసరం లేకుండా చెక్ పోస్టులు, తనిఖీ కేంద్రాల వద్ద త్వరగా ప్రయాణికుల గుర్తింపు సేవలు .విశాఖపట్నం, విజయవాడలో ఉన్నాయన్నారు.
MHBD: చిన్నగూడూరు పోలీస్ స్టేషన్లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ అసెంబ్లీ ప్రసంగాన్ని వక్రీకరించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నేడు ఫిర్యాదు చేశారు. డోర్నకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చాగంటి సందీప్ ఆధ్వర్యంలో ఫిర్యాదును పోలీసులు అందజేశారు.
కృష్ణ: పెడన పురపాలక సంఘంలో టీడీపీ తరఫున ఏకైక కౌన్సిలర్గా ఎన్నికైన 14వ వార్డు కౌన్సిలర్ అనుముల నాగమల్లేశ్వరి (54) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం సాయంత్రం తన నివాసంలో మృతి చెందారు. నాగమల్లేశ్వరి మృతి పట్ల పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచి గుకేష్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుకేష్కు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ‘గుకేష్ యావత్ భారతదేశం గర్వపడేలా చేసారు. కేవలం 18 ఏళ్ల వయస్సులో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించడం ఒక అద్భుతమైన విజయం. మీ విజయం దృఢ సంకల్పంతో ఏదైనా సాధ్యమని మాకు గుర్తు చేస్తుంది. అభినంద...
ప్రకాశం: యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారి పర్యటన వివరాలు, ఉదయం 9:30 గంటల నుండి యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 12 గంటలకు వైష్ణవి ఫంక్షన్ హాల్లో వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు అని కార్యాలయం సిబ్బంది తెలిపారు.
BDK: గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం ప్రాంతాల్లో పులి జాడ కోసం అటవీ అధికారులు వెతుకున్నారు. ములుగు జిల్లాలో చలి క్రమంగా పెరుగుతుండడంతో ఇటు వచ్చినట్లు తాడ్వాయి అటవీ అధికారులు చెబుతున్నారు. గురువారం కరకగూడెం మీదుగా గుండాల వైపుకు పెద్దపులి ప్రయాణం సాగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
WNP: చిన్నంబావి మండలం నూతన ఎస్సైగా జగన్మోహన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు శాంతి భద్రత కృషికి సహకరించాలని కోరారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజలు నూతన చట్టాలపై అవగాహన పెంచుకొని, వాటికనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
W.G: ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి అయినపర్తి రాజగోపాల్ (66) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన రాజగోపాల్ ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. రాజగోపాల్ కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ప్రకాశం: ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువ ఆధునికీకరణ అవినీతిపై విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గౌస్ డిమాండ్ చేశారు. స్థానిక 60 అడుగులరోడ్డులో పోతురాజు కాలువ రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త మధ్యలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ నగర ప్రజలు ముంపు బారినుంచి రక్షించాలని కోరారు.
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా వలసదారులు దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారని వెల్లడించారు. వారిని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించే దేశాలతో వ్యాపారం చేయనని తెలిపారు. ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానని పునరుద్ఘాటించారు.