NLG: నార్కట్పల్లి శివారులోని కామినేని ఫ్లైఓవర్ వద్ద సోమవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేపట్టగా, TG07T4554, TS07UH4554 నంబర్లు గల లారీల్లో హైదరాబాద్కు ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించామని ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు. లారీలను, డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.
జగిత్యాల జిల్లా నెట్బాల్ జట్టు ఈనెల 20 నుంచి 23 వరకు మహబూబ్నగర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభ చాటింది. ఈ పోటీలలో క్రీడాకారులు అద్భుతమైన ఆట తీరుతో జిల్లా గౌరవాన్ని నిలబెట్టారు. రాష్ట్రస్థాయిలో పాల్గొనడం గొప్ప అనుభవంగా ఉందని క్రీడాకారులు అన్నారు. జిల్లా క్రీడా అభిమానులు, అధికారులు జట్టును అభినందించారు.
SKLM: జిల్లా కేంద్రంలో అతిసార వ్యాధి కేసులు నమోదు కావడంతో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వ్యాధి ప్రభావంపై సమీక్షించిన అనంతరం బాధితులకు తక్షణమే మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వ్యాధి వ్యాప్తి మూలాలను గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రకాశం: ప్రజల ఆర్థిక భద్రతను కాపాడడమే లక్ష్యంగా గిద్దలూరు లోని ఏటీఎం కేంద్రాల్లో సీఐ సురేష్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా సీసీ కెమెరాల పనితీరు, అలారం వ్యవస్థలు, రాత్రి వేళల్లో లైటింగ్ , సెక్యూరిటీ గార్డుల లభ్యతను తనిఖీ చేశారు. ఏటీఎం మిషన్లకు స్కిమ్మింగ్ పరికరాలు అమర్చడం వంటి మోసాలను అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు.
BDK: బూర్గంపాడు(మం) సారపాక గాంధీనగర్లో నిర్మాణంలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ పదేళ్లుగా అసంపూర్తిగా ఉండగా, దీనిపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందించారు. మిగిలిన పనులకు నిధులు మంజూరు చేసి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
GDWL: పోలీస్ స్టేషన్కు వచ్చేది కేవలం న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చట్టప్రకారం అండగా నిలబడండి అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో ఆయన నేరుగా 10 ఫిర్యాదులను స్వీకరించారు. భూవివాదాలు, మోసాల వల్ల ఆవేదనతో వచ్చిన బాధితుల ముందే సంబంధిత అధికారులకు అప్పచెప్పారు.
BHNG: బీజేపీ రాష్ట్ర నాయకులపై జరుగుతున్న అక్రమ అరెస్టులను ఖండిస్తూ జిల్లా కేంద్రం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊటుకోరి అశోక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాలని, రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
TG: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్లో సాయి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సాయి తన పైన చేతబడి చేశాడని నిందితుడు బాలు హత్య చేసినట్లు సమాచారం. అతణ్ని హత్య చేసిన తర్వాత నిందితుడు రోడ్డుపైనే నిల్చున్నాడు.
KNR: శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన ముదిగంటి విజయలక్ష్మి అకౌంట్లో, అదే గ్రామానికి చెందిన సీఏ కొత్త లక్ష్మి అక్రమంగా సీఎంఆర్ రిలీఫ్ చెక్కు ద్వారా డబ్బులు వేయించిందని బాధితురాలు ఆరోపించారు. ఈ క్రమంలో తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసిన అధికారిపై, నిధుల అక్రమాలకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
AP: రాజమండ్రి జిల్లా చౌడేశ్వరినగర్కు ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ చేరుకుని మెడికల్ క్యాంప్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి చెందగా.. 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 126 కుటుంబాలకు వ్యాపారి పాలు పోశాడు. ఇప్పటికే పాలు, పెరుగు, రక్త నమూనాలు సేకరించాము. ఈ ఘటనపై CM చంద్రబాబు సమీక్ష జరిపారు’ అని తెలిపారు.
PDPL: జిల్లాలో ఈనెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇవాళ సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. 22 కేంద్రాలలో 10,367 మంది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థిని పరీక్ష కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.
VSP: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే SCC పబ్లిక్ పరీక్షలను పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 133 పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
VSP: సింహాచలం ఆలయ పరిధిలోని గంగాధర మార్గంలో వేంచేసియున్న త్రిపురాంతకేశ్వరి సమేత త్రిపురాంతక స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో వెంకట్రావు దంపతులు పాల్గొని స్వస్తివాచనం, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజలతో ఐదు రోజుల మహోత్సవాలకు అంకురార్పణ చేశారు.
TPT: సత్యవేడు మండలం అమాసరెడ్డి కండ్రిగ సమీపంలో అడిషనల్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలోని బృందం తనిఖీలు నిర్వహించింది. అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 1500 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేటకు చెందిన మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
RR: వార్డు అభివృద్ధి విషయంలో నిరంతరం ప్రజల వెంట ఉంటానని షాద్నగర్ పట్టణ ఆరవ వార్డు కౌన్సిలర్ రాజు నాయక్ అన్నారు. బాబా నగర్ కాలనీలోని పార్క్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పార్కును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.