• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పులి కోసం గాలింపు

BDK: గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం ప్రాంతాల్లో పులి జాడ కోసం అటవీ అధికారులు వెతుకున్నారు. ములుగు జిల్లాలో చలి క్రమంగా పెరుగుతుండడంతో ఇటు వచ్చినట్లు తాడ్వాయి అటవీ అధికారులు చెబుతున్నారు. గురువారం కరకగూడెం మీదుగా గుండాల వైపుకు పెద్దపులి ప్రయాణం సాగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 

December 13, 2024 / 08:30 AM IST

చిన్నంబావి ఎస్సైగా జగన్మోహన్ బాధ్యతలు

WNP: చిన్నంబావి మండలం నూతన ఎస్సైగా జగన్మోహన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు శాంతి భద్రత కృషికి సహకరించాలని కోరారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజలు నూతన చట్టాలపై అవగాహన పెంచుకొని, వాటికనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.

December 13, 2024 / 08:30 AM IST

ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి రాజగోపాల్ మృతి

W.G: ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి అయినపర్తి రాజగోపాల్ (66) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన రాజగోపాల్ ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. రాజగోపాల్ కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

December 13, 2024 / 08:29 AM IST

‘పోతురాజు కాలువ అవినీతిపై విచారణ జరిపించాలి’

ప్రకాశం: ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువ ఆధునికీకరణ అవినీతిపై విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గౌస్ డిమాండ్ చేశారు. స్థానిక 60 అడుగులరోడ్డులో పోతురాజు కాలువ రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త మధ్యలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ నగర ప్రజలు ముంపు బారినుంచి రక్షించాలని కోరారు.

December 13, 2024 / 08:27 AM IST

అలాంటి దేశాలతో వ్యాపారం చేయను: ట్రంప్‌

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా వలసదారులు దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారని వెల్లడించారు. వారిని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించే దేశాలతో వ్యాపారం చేయనని తెలిపారు. ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానని పునరుద్ఘాటించారు.

December 13, 2024 / 08:26 AM IST

’20రోజులలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాలి’

NRML: జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షా 92 వేల 233 ఇళ్లకు దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం సాయంత్రం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను నియమించి రాబోయే 20 రోజులలో పూర్తిస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

December 13, 2024 / 08:22 AM IST

‘చంద్రబాబు అంటే ఒక బ్రాండ్’

ELR: సీఎం చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అని మంత్రి కొలుసు పార్థసారథి గురువారం ట్వీట్ చేశారు. జగన్ పాలనతో ధ్వంసమైన ఏపీ ముఖచిత్రాన్ని 6 నెలల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మార్చిందని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర పునఃనిర్మాణం పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని ఆయన ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు.

December 13, 2024 / 08:20 AM IST

‘నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు’

NRML: ఈ నెల 15న నిర్వహించే గ్రూప్ -2 పరీక్షకు నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పరీక్ష జరుగుతుందని పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనలను అభ్యర్థులు పాటించాలని పేర్కొన్నారు.

December 13, 2024 / 08:19 AM IST

బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం

కృష్ణా: గుడివాడ పట్టణ పరిధిలో ఈనెల 7వ తేదీన బాలిక కిడ్నాప్ గురైన విషయం విధితమే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి బాలికను సురక్షితంగా గుడివాడకు తీసుకువచ్చారు. బాలిక తల్లిదండ్రులు నిందితుడైన రాహుల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాహుల్‌పై కిడ్నాప్, రేప్, ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

December 13, 2024 / 08:19 AM IST

బైక్ కొనలేదని తాళాలు మింగిన యువకుడు

గుంటూరు: జీజీజీహెచ్‌లో ఓ యువకుడి కడుపులో నుంచి వైద్యులు నాలుగు తాళాలు బయటకు తీసిన సంగతి తెలిసిందే. అయితే బైక్ కొనివ్వలేదనే కారణంతోనే యువకుడు తాళాలు మింగినట్లు తెలిసింది. నరసరావుపేటకు చెందిన దేవర భవానీ ప్రసాద్(28) బండి కొనివ్వలేదని మనస్తాపంతో తాళాలు మింగేసినట్లు కుటుంబీకులు తెలిపారు.

December 13, 2024 / 08:17 AM IST

దారుణం: భార్య, బిడ్డను చంపిన వ్యక్తి

TG: కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను ఓ వ్యక్తి కడతేర్చిన ఘటన హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో చోటు చేసుకుంది. సిరాజ్ అనే వ్యక్తి తన భార్యను గొంతుకోసి, కుమారుడి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చూసిన సిరాజ్ పెద్ద కుమారుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే దీనికి కారణమని భావిస్తున్నట్ల...

December 13, 2024 / 08:17 AM IST

నందిగంలో గ్రామ సచివాలయ ఉద్యోగి మృతి

SKLM: నందిగం మండలం కాపుతెంబూరు గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న తుంగాన చైతన్య(32) అనే వ్యక్తి గురువారం విశాఖలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మూడు రోజుల క్రితం బైకు అదుపుతప్పి కింద పడిపోవడంతో గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం విశాఖ తరలించగా అక్కడ మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

December 13, 2024 / 08:15 AM IST

ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహణ

PDPL: నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 17న మంగళవారం ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో సమీకృత జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

December 13, 2024 / 08:13 AM IST

ఈ నెల 17న జాబ్ మేళా

PDPL: నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 17న మంగళవారం ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో సమీకృత జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

December 13, 2024 / 08:13 AM IST

హైదరాబాద్‌లోనే అత్యధిక ప్రమాదాలు

HYD: దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో గత రెండేళ్లలో హైదరాబాద్‌లోనే అత్యధిక కారు ప్రమాదాలు జరిగినట్లు ప్రముఖ వాహన బీమా సంస్థ అకో ‘యాక్సిడెంట్ ఇండెక్స్-2024′ పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఢిల్లీ, పుణె, బెంగళూరు, కోల్కతా, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ నగరాలు ఉన్నాయని పేర్కొంది.

December 13, 2024 / 08:11 AM IST