NRML: జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షా 92 వేల 233 ఇళ్లకు దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం సాయంత్రం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ను నియమించి రాబోయే 20 రోజులలో పూర్తిస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ELR: సీఎం చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అని మంత్రి కొలుసు పార్థసారథి గురువారం ట్వీట్ చేశారు. జగన్ పాలనతో ధ్వంసమైన ఏపీ ముఖచిత్రాన్ని 6 నెలల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మార్చిందని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర పునఃనిర్మాణం పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని ఆయన ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
NRML: ఈ నెల 15న నిర్వహించే గ్రూప్ -2 పరీక్షకు నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పరీక్ష జరుగుతుందని పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనలను అభ్యర్థులు పాటించాలని పేర్కొన్నారు.
కృష్ణా: గుడివాడ పట్టణ పరిధిలో ఈనెల 7వ తేదీన బాలిక కిడ్నాప్ గురైన విషయం విధితమే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి బాలికను సురక్షితంగా గుడివాడకు తీసుకువచ్చారు. బాలిక తల్లిదండ్రులు నిందితుడైన రాహుల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాహుల్పై కిడ్నాప్, రేప్, ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గుంటూరు: జీజీజీహెచ్లో ఓ యువకుడి కడుపులో నుంచి వైద్యులు నాలుగు తాళాలు బయటకు తీసిన సంగతి తెలిసిందే. అయితే బైక్ కొనివ్వలేదనే కారణంతోనే యువకుడు తాళాలు మింగినట్లు తెలిసింది. నరసరావుపేటకు చెందిన దేవర భవానీ ప్రసాద్(28) బండి కొనివ్వలేదని మనస్తాపంతో తాళాలు మింగేసినట్లు కుటుంబీకులు తెలిపారు.
TG: కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను ఓ వ్యక్తి కడతేర్చిన ఘటన హైదరాబాద్లోని బేగంబజార్లో చోటు చేసుకుంది. సిరాజ్ అనే వ్యక్తి తన భార్యను గొంతుకోసి, కుమారుడి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చూసిన సిరాజ్ పెద్ద కుమారుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే దీనికి కారణమని భావిస్తున్నట్ల...
SKLM: నందిగం మండలం కాపుతెంబూరు గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న తుంగాన చైతన్య(32) అనే వ్యక్తి గురువారం విశాఖలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మూడు రోజుల క్రితం బైకు అదుపుతప్పి కింద పడిపోవడంతో గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం విశాఖ తరలించగా అక్కడ మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
PDPL: నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 17న మంగళవారం ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో సమీకృత జిల్లా కలెక్టరేట్కు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
PDPL: నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 17న మంగళవారం ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో సమీకృత జిల్లా కలెక్టరేట్కు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
HYD: దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో గత రెండేళ్లలో హైదరాబాద్లోనే అత్యధిక కారు ప్రమాదాలు జరిగినట్లు ప్రముఖ వాహన బీమా సంస్థ అకో ‘యాక్సిడెంట్ ఇండెక్స్-2024′ పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఢిల్లీ, పుణె, బెంగళూరు, కోల్కతా, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ నగరాలు ఉన్నాయని పేర్కొంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న ఇది విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. 2:40 గంటల నిడివితో ఇది విడుదల కానున్నట్లు సమాచారం. ఇక దర్శకుడు శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
MNCL: కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి ప్రణయ్ ట్రిపుల్ జంప్లో కాంస్య పతకం సాధించాడు. డిసెంబర్ 7,8,9,19,11 తేదీల్లో భువనేశ్వర్లో జరిగిన 39వ జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024 పోటీల్లో ట్రిపుల్ జంప్(15.6Mtrs)లో అత్యంత ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి కాంస్య పతకం సాధించాడు.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో ఇవాళ, రేపు రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఈ నెల 16,17వ తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చించనున్నారు. రాజ్యాంగ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా పార్లమెంట్లోని ఉభయసభల్లో 2 రోజులపాటు ప్రత్యేక చర్చలు జరపాలని నిర్ణయించారు.
AP: వైసీపీ పార్టీ చీఫ్, మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఇవాళ్టి నుంచి వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే రైతులతో కలిసి వైసీపీ నేతలు కలెక్టరేట్లకు ర్యాలీగా తరలి వెళ్లి వినతి పత్రాలను అందజేయనున్నారు. ధాన్యం కొనుగోలు, రూ.20 వేలు పెట్టుబడి సాయం తదితర సమస్యలపైన వైసీపీ ప్రభుత్వం పోరాడుతుందని మాజీ సీఎం ఇటీవల అనౌన్స్ చేసిన విషయం...
KNL: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎమ్మార్వో మధుసూదన్ రెడ్డి ఆదేశించారు. గురువారం సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో గల మహాత్మ జ్యోతిబాపూలే హై స్కూల్, కళాశాలను ప్రత్యేకంగా సందర్శించారు. నిబంధన ప్రకారం ప్రభుత్వం అందించే ప్రతి పదార్థాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు.