• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘బంగ్లాదేశ్‌లో పరిస్థితులను బైడెన్‌ నిశితంగా పరిశీలిస్తున్నారు’

బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే బంగ్లాలో తాజా పరిస్థితులపై వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ప్రజలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్‌ నాయకులకు స్పష్టం చేశామని వైట్‌హౌస్‌ ప్రతినిధి జాన్‌ కర్బీ తెలిపారు. పరిస్థితులు మెరుగుపరిచేందుకు తాత్కలిక ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వెల్లడించారు. బంగ్లాలో పరిస్...

December 13, 2024 / 09:04 AM IST

సీఎం మీటింగ్‌లో పాల్గొన్న నెల్లూరు కలెక్టర్, ఎస్పీ

NLR: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ముగింపు ప్రసంగంలో 10 సూత్రాలను అమలు చేయడంలో ప్రతి ఒక్క కలెక్టర్ ప్రణాళిక చేసుకోవాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు కలెక్టర్ ఓ ఆనంద్, ఎస్పీ జి కృష్ణ కాంత్ హాజరయ్యారు. అనంతరం అడ్మినిస్ట్రేషన్ లా అండ్ ఆర్డర్‌పై ముఖ్యమంత్రి సమీక్షించారు. స్పీడ్ అఫ్ డూయింగ్ పెరగాలని, మార్పు అనేది కచ్చితంగా కనపడాలన్నారు.

December 13, 2024 / 09:03 AM IST

ఆదివారంన శిరిడి సాయిబాబా ఆలయంలో మహా అన్నదానం

PPM: పార్వతీపురం బైపాస్ రోడ్‌లో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో దత్త జయంతి సందర్భంగా ఆదివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 5 గంటల నుండి కాగడ హారతి, సుప్రభాత సేవ, పాలాభిషేకం,సాయి సమూహిత వ్రతాలు జరుగుతాయని అయన తెలిపారు.

December 13, 2024 / 09:02 AM IST

కులగణన కింద రూ.4.09 కోట్ల నిధులు విడుదల

SRD: కులగణన సర్వేకు సంబంధించిన బడ్జెట్ సంగారెడ్డి జిల్లాకు రూ.4,09,46,000 లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా అధికారులు తెలిపారు. ఈ బడ్జెట్‌ను కులగణన సర్వే చేసిన ఎన్యుమరేటర్లకు ఒక్కొకరికి రూ.10,000, సూపర్ వైజర్లకు ఒక్కొకరికి రూ.12,000 చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

December 13, 2024 / 08:59 AM IST

16న ఉద్యోగ మేళా

ప్రకాశం: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 16వ తేదీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సైమన్ విక్టర్ తెలిపారు. ఉద్యోగ మేళాలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఫైనాన్సియల్ ఇనూజియన్ కంపెనీల ప్రతినిధులు హాజరువుతారని అన్నారు.

December 13, 2024 / 08:58 AM IST

మీడియాకు మోహన్ బాబు క్షమాపణలు

మోహన్ బాబు ఇటీవల మీడియాపై దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆయన ప్రవర్తనపై జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తాజాగా ఓ లేఖను విడుదల చేశారు. తన కుటుంబ గొడవ మీడియా ప్రతినిధులను ఆవేదనకు గురిచేసినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. గాయపడ్డ జర్నలిస్టుకు, మీడియా సంస్థకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు.

December 13, 2024 / 08:55 AM IST

జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు చిట్యాల విద్యార్థి ఎంపిక

NLG: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో రాము స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఎస్.కె నాగర్వల్లి గత నెలలో జరిగిన నారాయణఖేడ్‌లో నిర్వహించిన షూటింగ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 27,28,29 తేదీన వెస్ట్ బెంగాల్‌లో జరగబోయే జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొననున్నారు.

December 13, 2024 / 08:49 AM IST

19న నారా భువనేశ్వరి కుప్పం పర్యటన

చిత్తూరు: సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 19వ తేదీన కుప్పంలో పర్యటించనున్నారు. 19 నుంచి 4 రోజులపాటు కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఆమె పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించనున్నారు.

December 13, 2024 / 08:49 AM IST

గుప్త నిధుల కోసం తవ్వకాల కలకలం

WGL: రాయపర్తి మండలం వేంకటేశ్వరపల్లిలో స్వయం వక్త శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ శివారులో గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు శుక్రవారం తవ్వకాలు చేపట్టారు. ప్రధాన ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న పురాతన శివాలయం శివారులో సుమారు 8 అడుగుల లోతు మట్టిని తవ్వారు. స్థానికులు విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం చేరవేశారు.

December 13, 2024 / 08:48 AM IST

కపిల్ దేవ్ ఆఫర్‌ను అంగీకరిస్తున్నా: వినోద్ కాంబ్లీ

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపారు. కేవలం తనకు బీసీసీఐ అందించే రూ. 30 వేల పెన్షన్ డబ్బులపైనే ఆధారపడుతున్నానని పేర్కొన్నారు. ‘కపిల్ దేవ్ ఆఫర్‌ను అంగీకరిస్తున్నా.. రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని వెల్లడించారు. కాగా ఇటీవల కపిల్ దేవ్ తాను కాంబ్లీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. కానీ అతడు రిహాబిలేషన్ సెంటర్&zw...

December 13, 2024 / 08:48 AM IST

15 నుంచి కాలభైరవ నవరాత్రి ఉత్సవాలు

SKLM: ఈ నెల 15 నుంచి కాలభైరవ నవరాత్రి ఉత్సవాలు శ్రీకాకుళం నగరంలోని బలగ నాగావళి నదీ తీరాన బాలాత్రిపుర కాల భైరవ పీఠం ఉంది. ఈ నెల 15 నుంచి కాలభైరవ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు గణేష్ గురూజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15న దత్త జయంతిని పురస్కరించుకుని దత్తాత్రేయునికి అభిషేకాలు, అర్చనలు జరుగుతాయన్నారు.

December 13, 2024 / 08:47 AM IST

‘డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి’

VSP: అక్కిరెడ్డిపాలెం డ్రైనేజీ మీదుగా పోర్ట్ అథారిటీ నిర్మించనున్న గిడ్డంగుల వల్ల డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బ తినకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని 68వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం పోర్ట్ ట్రస్ట్ ఇంజినీరింగ్ అధికారి వేణు ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ముందుగా పక్కా డ్రైన్స్ నిర్మాణం చేపట్టాలని కోరారు.

December 13, 2024 / 08:44 AM IST

ఇసుక రీచ్‌లు పరిశీలించిన అధికారులు

తూ.గో: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పంపిణీలో భాగంగా మైనింగ్ అధికారులు రెండు రోజులు పాటు ఆత్రేయపురం మండల పరిధిలోని పలు ఇసుక రీచ్‌లను పరిశీలించారు. కలెక్టర్, జిల్లా మైనింగ్ అధికారి వంశీధర్ రెడ్డి ఆదేశాలు మేరకు మైనింగ్ అధికారులు రీచ్‌లను పరిశీలించారు. గురువారం సాయంత్రం మండల పరిధిలోని అంకంపాలెం, మెర్లపాలెం, ఇసుక రీచ్‌లలో ఇసుక లభ్యత గురించి పరిశీలించారు.

December 13, 2024 / 08:42 AM IST

నల్గొండలో సైన్స్ ఎగ్జిబిషన్

నల్లగొండలో ఈనెల 19, 20వ తేదీల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని డాన్ బోస్కో హైస్కూల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన 113 ప్రాజెక్టులతో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.

December 13, 2024 / 08:42 AM IST

మూడు రోజులు పత్తి కొనుగోలు నిలిపివేత

ADB: జైనూర్ మండల కేంద్రంలోని జిన్నింగ్  మిల్లులో పత్తి నిల్వలు అధికంగా ఉండడంతో నేటి నుంచి 15 వరకు సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇర్ఫాన్ హైమద్ ఖాన్ తెలిపారు. తిరిగి పత్తి కొనుగోలు సీసీఐ ద్వారా ఈనెల 16 నుంచి పునఃప్రారంభిస్తామని రైతులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

December 13, 2024 / 08:40 AM IST