• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రైతు సమస్యలు పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు

SKLM: రైతు సమస్యలు పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం బొబ్బిలిపేట గ్రామంలో ఎమ్మార్వో రాంబాబు ఆదేశాలు మేరకు రెవెన్యూ సదస్సు నిర్వహించమన్నారు. రైతుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

December 10, 2024 / 05:38 PM IST

‘ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వినతి’

GNTR: ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులుకు ఉపాధ్యాయులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. టీచర్లపై యాప్‌ల భారాన్ని తగ్గించాలన్నారు. పని వేళల పెంపు సరికాదన్నారు. మండల విద్యాశాఖ అధికారులు సెలవు సైతం ఇవ్వడం లేదని తెలిపారు

December 10, 2024 / 05:36 PM IST

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

BPT: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ దిశగా ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. భట్టిప్రోలు ఆర్యవైశ్య కల్యాణ మండపం నందు మంగళవారం మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సీఎం ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు.

December 10, 2024 / 05:35 PM IST

మానవ హక్కుల చట్టం ద్వారా అభివృద్ధి

ELR: ఏలూరు సత్రంపాడులోని జూనియర్ కళాశాల నందు మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ.. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం స్థాపించబడిందన్నారు. మానవ అభివృద్ధికి ఈ చట్టం ఒక మైలురాయ వంటిదని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ప్రధానమన్నారు.

December 10, 2024 / 05:33 PM IST

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

VZM: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్బంగా విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి టివి రాజేష్ కుమార్, 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.అప్పలస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

December 10, 2024 / 05:33 PM IST

మనోజ్ నా ఇంటికి రావద్దు: మోహన్ బాబు

TG: నటుడు మోహన్ బాబుకు చెందిన హైదరాబాద్‌లోని ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. మనోజ్ సామగ్రిని తరలించేందుకు వాహనాలు సిద్ధంగా ఉంచారు. మూడు వాహనాల్లో సామగ్రిని తరలించనున్నారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మనోజ్ తన ఇంటికి రావద్దని మోహన్ బాబు అన్నట్లు తెలుస్తుంది.

December 10, 2024 / 05:33 PM IST

నూతన అబ్బులెన్స్ జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

SRPT: తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిరుమలగిరి, నాగారం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం మండలాలకు 108 నూతన వాహనాలను మంగళవారం ఎమ్మెల్యే సామేలు జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల డాక్టర్లు, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

December 10, 2024 / 05:32 PM IST

ఉద్యోగులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి: జిల్లా కలెక్టర్

కామారెడ్డి: ఉద్యోగులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని IDOCలో ట్రెజరీ కార్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా ఉద్యోగులు రక్తదానం చేయాలని సూచించారు. అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, టీజీవో కార్యదర్శి సాయి రెడ్డి పాల్గొన్నారు.

December 10, 2024 / 05:31 PM IST

డ్రగ్స్ స్వాధీనం.. అదుపులో నిందితుడు

TG: హైదరాబాద్‌లో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి 600 గ్రాముల డ్రగ్స్‌ను మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడికి డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 10, 2024 / 05:30 PM IST

పెండింగ్ ధరణి దరఖాస్తులు పూర్తి చేయండి

NRPT: పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులు వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బెన్ శాలం తహసీల్దార్‌లను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో జిల్లాలోని తహసీల్దార్‌లతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైతే క్షేత్ర స్థాయికి వెళ్లి విచారణ జరపాలని సూచించారు.

December 10, 2024 / 05:30 PM IST

‘కర్నూలు మండల అభివృద్ధి కోసం పోరాడదాం’

కర్నూలు: అభివృద్ధి కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డీ.గౌస్ దేశాయ్ అన్నారు. సీపీఎం కర్నూల్ మండలం మూడో మహాసభలు గొందిపర్లలోని వసంత నగర్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలు రైల్వే వ్యాగన్ పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నిర్మాణ పనులు ప్రారంభించి 10 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదన్నారు.

December 10, 2024 / 05:29 PM IST

నంద్యాల-నందిపల్లె రైల్వే స్టేషన్ల మధ్య వ్యక్తి మృతి

నంద్యాల-నందిపల్లె రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వివరాలు తెలియ రాలేదన్నారు. మృతుడు పసుపు, తెల్లని రంగు ఫుల్ హాండ్స్ టీ షర్టు, ఎరుపు, పసుపు కలర్ షార్ట్ ధరించినట్లు చెప్పారు.

December 10, 2024 / 05:28 PM IST

అనాథ పిల్లల పాఠశాలకు రూ.10 లక్షల విరాళం

NDL: ఓర్వకల్లు ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ పిల్లల పాఠశాలకు మంగళవారం తానా ఫౌండేషన్ సహకారంతో రూ. 10 లక్షల సహకారాన్ని నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గౌరు వెంకట్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయ భారతి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర రెడ్డి, తానా సభ్యులు రవి, తదితరులు పాల్గొన్నారు.

December 10, 2024 / 05:27 PM IST

‘తెలంగాణ పై దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోండి’

HYD: తెలంగాణపై సోషిల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

December 10, 2024 / 05:26 PM IST

తొలగించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన అధికారులు

ATP: గుంతకల్లు పట్టణంలోని ప్రధాన సర్కిల్లో ఈనెల 12న జరిగే హనుమత్ వ్రత్ ఉత్సవాల సందర్భంగా దీక్షాపరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపాలిటీ అధికారులు ఈనెల 8న తొలగించారు. దీంతో దీక్షాపరులు మున్సిపాలిటీ అధికారులతో వాగ్వివాదానికి దిగి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అధికారులు తొలగించిన ఫ్లెక్సీల స్థానంలో మంగళవారం నూతన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

December 10, 2024 / 05:26 PM IST