కృష్ణా: మచిలీపట్నంలోని ఆర్కే ప్యారడైజ్లో జనసేన ఉద్యమి దిశా నిర్దేశం కార్యక్రమం శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతం కోసం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే విధానాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLR: సోమశిలకు చెందిన వేలమూరి శ్రీరామ్కు కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. అతి ఉత్కృష్ట సేవా పథకంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫర్ ది ఔట్ స్టాండింగ్ ఇన్ ఇంటలిజెన్స్ ఇన్-2025 పురస్కారాన్ని అందుకోనున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా జోనల్ ఇన్ స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కానిస్టేబుల్గా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు.
PLD: పెదకూరపాడు నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఒకటవ తేదీ ఆదివారం కావడంతో శనివారం ఉదయం నుంచి అధికారులు నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు చేరుకొని వారికి పింఛన్లు అందించారు. పింఛను చేతికి రావడంతో అవ్వ తాతల ముఖంలో ఆనందాన్ని చూసామని స్థానిక నేతలు అన్నారు.
అనంతపురం నియోజకవర్గం 19వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. మార్చి 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ తుల్జాపూర్ స్వప్న, క్లస్టర్ ఇంఛార్జ్ శ్రీనివాస్ ఆచారి, సచివాలయం సిబ్బంది కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
KKD: బాలికల రక్షణే మనందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ పోలీసు కన్వెన్షన్ హాల్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో “డిస్ట్రిక్ట్ లెవెల్ వర్క్ షాప్ ఆన్ లెజిస్లేషన్ ఆఫ్ పోక్సో (POCSO), బాల్య వివాహాల నిర్మూలన అక్రమ రవాణాపై అవగాహన కల్పించారు. బాలికలు, మహిళా భద్రతపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు.
VZM: బొబ్బిలి ఇంఛార్జి డీఎస్పీగా ఎస్.రాఘవులుకు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఆయన చీపురుపల్లి డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ అదనంగా బొబ్బిలి డీఎస్పీగా కొనసాగుతారు. ఇప్పటివరకు బొబ్బిలి డీఎస్పీగా విధులు నిర్వహించిన భవ్యారెడ్డి హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర DGP కార్యాలయానికి బదిలీ చేశారు.
ADB: ఉట్నూర్ ఐటీడీఏ నూతన డిప్యూటీ డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన గోడం చందన్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మట్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఐటీడీఏ పరిధిలోని ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరిస్తూ నాణ్యమైన విద్యాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
అన్నమయ్య: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలోని హరిజనవాడలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న సిద్ధవటం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అన్నమయ్య: మదనపల్లి పట్టణంలో బిటి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘవ రెడ్డి చేతులమీదుగా విశాలాంధ్ర సంచారక పుస్తకాలయం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ గతిని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, మానవ సమాజంలో విప్లవాత్మక మార్పులను తెచ్చింది పుస్తకమేనని, నేటి యువతకు పుస్తక పఠనం చాలా అవసరమని ఆయన అన్నారు.
KRNL: పెద్దకడబూరు మం. జాలవాడి గ్రామంలో ఆపరేషన్ వజ్ర పహార్లో భాగంగా ఇవాళ కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. DSP భార్గవి పర్యవేక్షణలో CI మంజునాథ్, SI నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాలు, ఇళ్లు, పంట పొలాల్లో గంజాయి, నాటుసారా, మద్యం, గుట్కాలపై సోదాలు చేపట్టారు. 4 గురు సీఐలు, 4 గురు ఎస్సైలు సహా 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.
MDCL: ఘట్కేసర్, పోచారం, నాగారం మున్సిపాలిటీల పరిధిలో దాదాపు సంవత్సరం క్రితం రూ. 50 కోట్ల రోడ్డు, డ్రైనేజీ, పబ్లిక్ హాల్స్ నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికీ ఆ పనులు శంకుస్థాపనలతోనే ఆగిపోయాయి. జీహెచ్ఎంసీలో కలిసిపోయినప్పటికీ అభివృద్ధి అడుగు ముందుకు పడటం లేదని స్థానిక ప్రజలు అంటున్నారు.
WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి బండ్ పై శనివారం సాయంత్రం మోడల్ రాకెట్ ప్రయోగం చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఖగోళ ఘటనల్లో అరుదైన ప్లానెట్ పరేడ్ జరగనుంది. బృహస్పతి, శుక్రుడు, బుధుడు, శని, యురేనస్ వంటి ప్రధాన గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో అద్భుతంగా కనిపిస్తాయని విద్యార్థులు తెలిపారు.
MHBD: జిల్లాలోని పోలీస్ ఇంట్లో దొంగలు పడ్డారు. SI ఉమా తెలిపిన వివరాల మేరకు.. డోర్నకల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లో చొరబడి రూ.40,000 నగదు, వెండి వస్తువులను దొంగలించారు. ఘటనా స్థలాన్ని సీఐ చంద్రమౌళి క్లూస్ టీంతో పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
GNTR: ఖాజీపాలెంలోని ఎస్టీ కాలనీలో శుక్రవారం రాత్రి ఎస్సై మర్రి వెంకట శివకుమార్ యాదవ్ ‘పల్లె నిద్ర’ నిర్వహించారు. ఎస్పీ, సీఐల ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో, ఆయన గ్రామస్తులకు శాంతిభద్రతల ప్రాముఖ్యతను వివరించారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు మరియు అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మకు తన మెంటార్ యువరాజ్ సింగ్ చెప్పు చూపించాడు. అయితే జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఆ తర్వాత అభిషేక్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. ‘కృతజ్ఞతతో ఉన్నాను. లక్ష్యంపై దృష్టి పెట్టాను. ముందుకు సాగుతున్నాను’ అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్కు యువరాజ్ సింగ్ ఓ చెప్పు ఎమోజీని కామెంట్గా పెట్టాడు.