అనంతపురం నియోజకవర్గం 19వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. మార్చి 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ తుల్జాపూర్ స్వప్న, క్లస్టర్ ఇంఛార్జ్ శ్రీనివాస్ ఆచారి, సచివాలయం సిబ్బంది కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.