KRNL: ఆదోనిలోని సరస్వతి శశి మందిర్ స్కూల్లో ఇవాళ నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. టీడీపీ యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.