హీరో గోపీచంద్తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో ‘గోలీమార్’ మూవీ వచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నారట. ‘గోలీమార్’ చుట్టూ కొత్త కథను నడపొచ్చని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి.
హీరో గోపీచంద్తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో ‘గోలీమార్’ మూవీ వచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నారట. ‘గోలీమార్’ చుట్టూ కొత్త కథను నడపొచ్చని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి.
TG: భూదాన్ భూముల కుంభకోణం కేసులో ఈడీ అధికారులు నలుగురుకి నోటీసులిచ్చారు. నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశారు. వారితో పాటు మరో ఇద్దరికి నోటీసులు పంపారు. ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే IAS అమోయ్ను ఈడీ పలుమార్లు విచారించింది.
ఇస్తాంబుల్ విమానాశ్రయంలో 400 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. తుర్కీయే నుంచి ఢిల్లీ, ముంబైకి రావాల్సిన రెండు ఇండిగో విమానాలు ముందస్తు సమాచారం లేకుండా రద్దవడంతో ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆహారం, వసతులు లేక ఇబ్బందిపడినట్లు ప్రయాణికులు ఎక్స్లో పోస్ట్లు చేస్తున్నారు.
NLG: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53.93 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644.48 అడుగులుగా ఉంది. మూసీ ప్రాజెక్టు పూర్తి నీటిమట్ట సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.33 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారి మధు తెలిపారు.
HYD: కిషన్బాగ్ డివిజన్ పరిధిలో వీధి దీపాల సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఎంఎం పహాడ్ నుంచి పాకీజా హోటల్కు వెళ్లే మార్గంలో పది రోజులుగా అభివృద్ధి దీపాలు వెలగట్లేదు. దీంతో ఆ మార్గంలో వెళ్లాలంటే భయంగా మారింది. వీధి దీపాలు లేక రాత్రిపూట చిన్నపాటి ప్రమాదాలు కూడా జరిగాయని స్థానికులు తెలిపారు. వ్యాపారాలు చేసుకునే వారికి సైతం ఇబ్బందిగా మారింది.
అనంతపురం: గుత్తి ఆర్ఎస్లో శుక్రవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అనుమానితుల ఇళ్లలో తనిఖీలను నిర్వహించామన్నారు. నాటు సారా, కర్ణాటక మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తే చర్యలు తప్పవని కాలనీవాసులు హెచ్చరించారు. గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని సూచించారు.
NLG: నల్గొండ జిల్లా DRDA, SERP ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు తయారు చేస్తున్న తేనె, మిల్లెట్స్, వివిధ రకాల పచ్చళ్లు, పూసలతో తయారు చేస్తున్న ఉత్పత్తులు అభినందనీయమని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో గురువారం మహిళా సంఘాల ఉత్పత్తులను ఆమె పరిశీలించారు.
W.G: రైతు భరోసా, ఉచిత పంటల భీమా, ధాన్యం కొనుగోలులో అక్రమాలు తదితర అంశాలపై వైసీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా భీమవరం కలెక్టరేట్ ఎదుట శుక్రవారం చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి తణుకు నియోజవర్గం నుంచి వైసీపీ నేతలు, రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ మేరకు వైసీపీ శ్రేణులు వాహనాల్లో తరలి వెళ్లారు.
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్రమంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలవనున్నారు. అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు. అనంతరం అధిష్టానం పెద్దలను సీఎం కలిసే అవకాశం ఉంది.
HYD: ఎస్ఆర్నగర్ పరిధిలోని శ్రీనివాసకాలనీ ఈస్ట్ కమాన్ వద్ద డ్రైనేజీ, సీవరేజ్ లైన్స్ పొంగిపొర్లుతున్నాయి. దీంతో రోడ్లపై మురుగునీరు నిలిచి ఇబ్బందిగా మారుతుంది. స్థానిక వ్యాపారులకు దుర్వాసన వచ్చి ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్లిన సిబ్బంది మాత్రం స్పందించడం లేదని వాపోయారు. ఇకనైనా స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
కామారెడ్డి: జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సింధూశర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14న అదాలత్ ఉంటుందని, కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.
ప్రకాశం: మార్టూరు మండలంలో గురువారం విద్యుత్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 63 కేసులు నమోదు చేసి 3,18,000 అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. విద్యుత్ EE మస్తాన్ రావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. మార్టూరు డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.సురేంద్ర బాబు, అద్దంకి డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.దామోదరరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో గెలిచిన యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 18 ఏళ్లకే అరుదైన ఘనత సాధించిన అతనికి రాజమౌళి, ఎన్టీఆర్, చిరంజీవి, కమల్ హాసన్ కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెట్టారు. ‘ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్గా చరిత్ర సృష్టించావు. ప్రపంచవేదికపై దేశం గర్వపడేలా చేశావు’ అంటూ రాసుకొచ్చారు.
ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పశ్చిమ విహార్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్ సహా పలు పాఠశాలలకు ఆగంతకులు ఈ-మెయిల్స్ పంపించారు. అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు అధికారులు తనిఖీలు చేపట్టగా.. పేలుడు పదార్థాలు లభించలేదు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.