NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ముద్విన్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆదివారం మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో BRS లో చేరారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన నర్సింహ, మహేష్, శ్రీశైలం, మల్లయ్య తదితరులకు హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
SKLM: లావేరులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నడుపూరి ఏసురత్నానికి చెందిన పూరిళ్లు దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో బీరువా, పలు సామాగ్రి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
KMR: భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఓటర్ లిస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి. 12 వార్డుల్లో మొత్తం 2,897 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,381 మంది పురుషులు, 1,516 మంది మహిళలు ఉన్నారు. సర్పంచ్ స్థానాన్ని జనరల్కు కేటాయించారు. ఇక్కడ 135 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఆశావాహులు మహిళలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మహిళా ఓటర్లే నిర్ణయాత్మకం కానున్నారు.
E.G: రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మండపేట బైపాస్ రోడ్డు ఎదురుగా మెహర్ బాబా ఆశ్రమం దగ్గరలో భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలలో ఆదివారం పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి విగ్రహావిష్కరణ చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. మహనీయులు మన మధ్య లేకపోయినా, వారి ఆశయాలు, జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయన్నారు.
ATP: తప్పు చేస్తే టీడీపీ వారితో సహా ఎవరైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి (జైలుకు) వెళ్లక తప్పదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. పోలీసులు ఎవరి నియంత్రణలో లేరని, శాంతిభద్రతలకు భంగం కలిగించిన ఎవరిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద 34 మందికి రూ. 23.08 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
HYD: ప్రేమించిన యువతికి వివాహం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజినీరింగ్ విద్యార్థి అభిలాష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూరారం PS పరిధిలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన అభిలాష్, ప్రేమించిన అమ్మాయికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. దీన్ని తట్టుకోలేక అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
NDL: కోయిలకుంట్ల మండలంలోని సౌదరదిన్నె గ్రామంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు టీడీపీ యువ నాయకుడు గడ్డం అమర్నాథరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొంటారు. మండలంలోని అధికారులు టిడిపి నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.
GDWL: జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల (TSUWJ) జిల్లా నాలుగవ మహాసభ ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సంతోష్,ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ మహాసభకు సీనియర్ జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు పెద్ద ఎత్తున వచ్చారు.
CTR: పుంగనూరు మండలంలో విషాద ఘటన జరిగింది. మోదుపల్లికి చెందిన అమర్నాథ్ కుమార్తె ప్రణీత(6) శనివారం రాత్రి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ATP: గుంతకల్లు మండలం వెంకటం పల్లి గ్రామంలో జరిగే రైతన్న సేవలో మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
BDK: DR మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు త్వరలో రానున్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో జరిగే అన్ని ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష సమావేశంలో ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పివో రాహుల్, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, పాయం పాల్గొన్నారు.
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ పేరెపు కాంబోలో ‘కోహినూర్’ సినిమా రావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ మీద వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. మరో మూడు నెలల్లో ఇది సెట్స్ మీదకు వెళ్లనుందట. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమా 1000 ఏళ్ల క్రితం భారత్ కోల్పోయిన కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడంపై తెరకెక్కనుంది.
VKB: పరిగి మండల కేంద్రంలో ఏఎంసీ ఛైర్మన్ పరశురాంరెడ్డి నివాసంలో గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కన్నుల పండువగా జరిగింది. అయ్యప్ప 18 మెట్లను పూలమాలలతో అలంకరించి, గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మొగింది. మండలంలోని అయ్యప్ప స్వాములు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
HYD: ORR పరిధిలోని అన్ని ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్న ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో విస్తరణ చేస్తే బాగుంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వాహనదారులకు సులువుగా ఉంటుందని పేర్కొన్నారు. మెట్రో విస్తరణతో వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
WGL: నెక్కొండ మండలం సూరిపల్లిలో ఇవాళ BRS గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో రానున్న GP ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసే నాయకుడిని ఎంపిక చేయాలని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.