MDK: ఉపాధిహామీ పథకం పనులపై కల్హేర్లో నేడు ఉ. 10 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రమేష్బాబు పేర్కొన్నారు. పనులు, నిధుల ఖర్చుపై గ్రామ పంచాయతీల్లో సామాజిక తనిఖీ జరిగిందని చెప్పారు. డీఆర్పీలు సామాజిక తనిఖీ నివేదికను బహిర్గతం చేస్తారని తెలిపారు. ప్రజాప్రతి నిధులు, కూలీలు హాజరు కావాలని కోరారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమాపై బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా రివ్యూ ఇచ్చారు. మూవీ అద్భుతంగా ఉందని, అల్లు అర్జున్ ప్రదర్శన మరో స్థాయిలో ఉందని తెలిపారు. భార్యాభర్తల మధ్య సన్నివేశాలను ‘పుష్ప 2’లో చక్కగా చూపించారని, ఇలాంటి సీన్స్ బాలీవుడ్లో తెరకెక్కించాల్సి వస్తే కావాల్సినంత అశ్లీలత పెడతారని వెల్లడించారు. దక్షిణాది చిత్రాలను చూసి బాలీవుడ్ ఎంతో నేర్...
KMM: పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లో జరిగే ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆర్పీలను శుక్రవారం మధిర పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వెళుతున్న తమను అదుపులోకి తీసుకోవడం సరికాదని ఆర్పీలు మాధవి, కృష్ణవేణి అన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కి బాంబు బెదిరింపు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతూ.. ఈ-మెయిల్ పంపినట్లు ముంబైలోని ఆర్బీఐ కార్యాలయం వెల్లడించింది. బ్యాంకును పేల్చివేస్తామంటూ రష్యన్ భాషలో మెయిల్ వచ్చినట్లు చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
MHBD: సీసీ రోడ్ల సైడ్ డ్రైనేజీలను నిర్మించాలని సీపీఎం పార్టీ 6వ వార్డు ఇన్ఛార్జ్ రజాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 6 వార్డు పరిధిలోని మాన్సింగ్ తండా, భజన తండాను పార్టీ ఆధ్వర్యంలో సందర్శించారు. సైడ్ డ్రైనేజీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సర్వే బృందం పాల్గొన్నారు.
SKLM: పాలకొండ మండలంలోని యరకరాయపురములో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రైతులు కొరికాన బావాజి నాయుడు, చింతగొంటి అప్పలనాయుడుల 5 ఎకరాల వరి చేను కుప్పలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు సిబ్బందితో వెళ్లి మంటలను అదుపు చేశారు.
NLR: భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో చిట్టమూరు మండలం గుణపాడు వద్ద ఉన్న స్వర్ణముఖి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బ్రిడ్జిపై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోలను నిలిపివేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు.
NLR: పొదలకూరు మండలంలో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల నుంచి తేలికపాటి వర్షం పడుతుంది. మండలంలోని పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షం రాకతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. పనులకు వెళ్లే కూలీలు అవస్థలు పడుతున్నారు.
BDK: చర్ల ప్రభుత్వం మంజూరు చేసిన 108 వాహనాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు అన్నారు. సత్యనారాయణపురం పీహెచ్సీలో 108ను ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ వాహనాన్ని మంజూరు చేసిందన్నారు.
KMM: వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ కింద విధంగా ఉన్నట్లు మార్కెట్ కమిటీ సభ్యులు ప్రకటించారు. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.16,700లు, కొత్త మిర్చి ధర రూ.15,849లు పలికింది. క్వింటా పత్తి ధర రూ.7,200లు జెండా పాట పలకగా.. నిన్నటితో పోల్చితే కొత్త మిర్చి ధర రూ.252లు తగ్గగా అటు ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
KMM: వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ కింద విధంగా ఉన్నట్లు మార్కెట్ కమిటీ సభ్యులు ప్రకటించారు. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.16,700లు, కొత్త మిర్చి ధర రూ.15,849లు పలికింది. క్వింటా పత్తి ధర రూ.7,200లు జెండా పాట పలకగా.. నిన్నటితో పోల్చితే కొత్త మిర్చి ధర రూ.252లు తగ్గగా అటు ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
NZB: ఈనెల 14న కౌలాస్ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో కామారెడ్డి జిల్లా బాయ్స్ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీల ఎంపికలు జరుగుతాయని పీడీ సతీష్ రెడ్డి తెలిపారు. 01.01.2010 తర్వాత జన్మించిన వారి ఉండాలి. జనన ధ్రువీకరణ పత్రంతో పోటీలో ఎంపికకు క్రీడాకారుల హాజరుకావాలని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
WGL: వరంగల్ 20వ డివిజన్ పరిధిలోని పద్మనగర్ స్మశానవాటిక వద్ద చెత్త విపరీతంగా పేరుకుపోయి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని డివిజన్ కార్పొరేటర్ నరేంద్రకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కార్పొరేటర్ ఈరోజు మున్సిపల్ సిబ్బందితో చెత్త తొలగించే కార్యక్రమం చేపట్టారు.
TG: సంగారెడ్డిలోని మల్కాపూర్ చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో యుద్ధట్యాంకర్లను రూపొందించారు. ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించిన అనంతరం యుద్ధ ట్యాంకర్లను సైన్యానికి అప్పగిస్తారు. కాగా.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏటా సైన్యానికి యుద్ధ ట్యాంకర్లను అందేజేస్తాను.
ASF: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ తిర్యాని మండల అధ్యక్షులు చిత్తూరు సాగర్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన కళ్యాణ అరుణకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 50వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన అందజేశారు. నిరుపేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు.