BHPL: రేగొండ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో సర్పంచ్ పదవులకు భారీ పోటీ నమోదైంది. మొత్తం 167 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా రూపిరెడ్డిపల్లి, దమ్మన్నపేట, జూబ్లీనగర్లో 13 చొప్పున, రేగొండలో 12 దాఖలు కాగా, అత్యల్పంగా రేపాకలో 3, కొత్తపల్లి బీలో 4 నమోదయ్యాయి. మిగతా గ్రామాల్లో 5 నుంచి 10 వరకు నామినేషన్లు వేశారు.
JGL: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు రాగానే, వేగవంతంగా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్. లత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, గొల్లపల్లి మండలంలో సూర్య రైస్ మిల్లును, వెల్గటూర్ మండలంలో శ్రీనిధి, కృష్ణ రైస్ మిల్లులను నిన్న ఆమె ఆకస్మికంగా సందర్శించారు. వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు.
విశాఖ కేజీహెచ్లో రూ.కోట్లు ఖర్చుపెట్టి ఫైర్ ఫైటింగ్ లైన్ సిస్టం ఏర్పాటు చేసినప్పటికీ నిరూపయోగంగా మారింది. కేజీహెచ్ అంతా గతంలోనే ఫైర్ ఫైటింగ్ అవసరాలు నిమిత్తం మంచినీటి పైప్లైన్ ఎక్కడకక్కడ వాల్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. అయితే అవేవీ ఇప్పుడు పని చేయకుండా మూలకు చేరాయి. ప్రధాన వాల్స్ దగ్గర పనిముట్లు కూడా చోరీకి గురయ్యాయి. పర్యవేక్షణ లేకపోవడం వల్లే కేజీహెచ్లో సమస్యలు చుట్టుముడుతున్...
ATP: అనంతపురం నగరంలోని రాంనగర్ 80 ఫీట్ రోడ్డులో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ, కలశార్చన కార్యక్రమం జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో అనంతపురం MLA దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.
నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ పదవికి క్రేజ్ పెరిగింది. గ్రామాల్లో చక్రం తిప్పే ముఖ్య నాయకులు అంతా ఇప్పుడు ఉప సర్పంచి పదవిపైన దృష్టి కేంద్రీకరించారు. రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో పాటు మహిళలకు 50 శాతం సర్పంచి స్థానాలు రిజర్వు కావడంతో చాలామంది బడా బాబులకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.
SRCL: చందుర్తి మండలంలో 19 సర్పంచ్ స్థానాలకు 113 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల దాఖలకు గడువు ముగిసే సమయానికి 113 నామినేషన్లు అందాయని, మొత్తం 174 వార్డులకు గాను 397 నామినేషన్లు వచ్చాయని వారు ప్రకటించారు. ఇప్పటివరకు ఏ ఒక్క గ్రామం కూడా ఏకగ్రీవం కాకపోవడం విశేషంగా మారింది.
NZB: సాలూరు మండలం జాడి జమాల్పూర్కు చెందిన మల్లవరపు శౌరి నిహారిక సర్పంచిగా పోటీ చేస్తున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ పూర్తి చేసిన ఆమె గ్రామ అభివృద్ధికి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాను గెలిస్తే గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు.
కరీంనగర్ గోదాంగడ్డలోని, సీడబ్ల్యూసీ గోడౌన్స్ ఎదురుగా ఉన్న రోడ్డుపై పగిలిన వాటర్ పైపైను మున్సిపల్ సిబ్బంది మరమ్మతులు చేశారు. అయితే, తవ్విన చోట పూడికను పూడ్చకుండా వదిలేయడంతో రహదారి ప్రమాదకరంగా మారింది. దీనివల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, అధికారులు వెంటనే పూడికను పూడ్చాలని కోరుతున్నారు.
NTR: మిర్చి నష్టాలతో పత్తి సాగు చేసిన రైతులు ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేక ఆందోళన చెందుతున్నారు. ఎంత శ్రమించిన పంటకు ధర రాక నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా, సీసీఐ అధికారుల నిబంధనలు కఠినంగా ఉండటం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. పత్తిని సీసీఐ కేంద్రానికి తరలించేందుకే రూ.5 వేలకు పైగా ఖర్చవుతోందని రైతులు లబోదిబోమంటన్నారు.
JGL: కొండగట్టు దిగువ ప్రాంతంలోని అభయాంజనేయ స్వామి విగ్రహం సమీపంలో అగ్నిప్రమాదం వల్ల పలు షాపులు దగ్ధమైన ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరాతీశారు. ఆయన వెంటనే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ కేంద్రమంత్రికి వివరించారు.
సత్యసాయి: మడకశిర మండలం భక్తరపల్లి వద్ద హరే సముద్రం చెరువుకు వస్తున్న కృష్ణా జలాల కాలువను టీటీడీ పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పరిశీలించారు. చెరువులోకి వస్తున్న నీటి ప్రవాహం, కాలువ పరిస్థితి గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు అందించడంలో ఈ జలాల ప్రాముఖ్యతను వివరించారు.
PPM: స్వచ్చతపై మన వైఖరి మారాలని చెత్త వేయకుండా ఉంటేనే పట్టణానికి నెంబర్ వన్ ర్యాంక్ దక్కుతుందని కలెక్టర్ ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. జిల్లాను స్వచ్ఛ పార్వతిపురగా తీర్చిదిద్దేందుకు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా శనివారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ‘మనవీధి, మన బాధ్యత’ అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూవీ ‘మోగ్లీ’. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. HYDలోని AMB సినిమాస్లో రేపు ఉదయం 10 గంటలకు ఇది విడుదల కానుంది. ఇక అటవీ నేపథ్యంలో సాగే ప్రేమకథతో సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సాక్షి మడోల్కర్ కథానాయికగా నటించింది.
భూపాలపల్లి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గణపురం, కొత్తపల్లి గోరి, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 సర్పంచ్, 712 వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్లను ఆదివారం క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు పరిశీలన జరిపి, చెల్లుబాటు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.
BDK: జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు పోవాలని మంత్రి సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తోట దేవి ప్రసన్న శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెకు శాలువతో సన్మానించారు.