NZB: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఆమె బంధువులు, స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన అతడు చికిత్స పొందుతూ మృతిచెందగా శుక్రవారం ఉదయం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
కృష్ణా: ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత ప్రకారం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, ఒక రోజులో ఏళ్ల తరబడి తిష్ట వేసుకున్న సమస్యల పరిష్కరించడం సాధ్యం కాదని, ప్రజలు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. చంద్రన్న గ్రామం కాలనీలో ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
NZB: నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమంలో బాన్సువాడ, బోధన్, జుక్కల్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, సుదర్శన్రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు ట్రంప్తో తమ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ట్రంప్నకు అమెజాన్ భారీ విరాళం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రమాణ స్వీకార నిధికి రూ.8 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు సమాచారం.
NGL: గ్రామ పంచాయతీ బిల్డిండ్ నిర్మించాలని త్రిపురారం మండలం మాటూరులో ధర్నా చేపట్టారు. పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరిందని వారు చెప్పారు. పంచాయతీ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో కొత్త బిల్డింగ్ నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా దివంగత షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. గతంలో ఎంపీగా పనిచేసిన సందీప్.. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజవర్గంలో మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో తలపడనున్నారు. ఈ స్థానంలో కేజ్రీవాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ న...
JGL: కోరుట్ల పట్టణంలోని ఆర్పీలను ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్ట్లకు భయపడేది లేదని, తమకు వేతనం రావాలని ఆందోళన చేపట్టారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మాడవేణి నరేశ్ ఆర్పీలను పరామర్శించిన, అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
MDK: చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో హిందీ టీజీటీ పోస్ట్ ఖాళీగా ఉందని దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ చంద్రకళ కోరారు. హెచ్పీటీ అర్హత ఉండి టెట్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈనెల 16 తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని, ఈనెల 17V డెమో క్లాస్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
TG: సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో మాడిగి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లారీలో తరలిస్తున్న డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.50 కోట్లు ఉండవచ్చని అధికారుల అంచనా. ఆ డ్రగ్స్ని ఏపీలోని ఓడరేవు నుంచి ముంబై త...
MDK: సంగారెడ్డి జైలులో అస్వస్థతకు గురైన లగచర్ల రైతు హీర్యానాయక్కు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో జైలర్ సంజీవరెడ్డిను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్పై విచారణకు ఆదేశించారు.
WGL: హసన్పర్తి బాలికల జూనియర్ గురుకుల కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కళాశాలలో మత ప్రచారం చేస్తున్నారని కొంతమంది వ్యక్తులు వేడుకలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కళాశాలలో ప్రతి సంవత్సరం అన్ని మతాలకు సంబంధించిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఇందుమతి తెలిపారు. ఈ ఘటనలో ఫర్నిచర్ ధ్వంసం అయిందన్నారు.
PPM: పట్టణంలోని వైకేయం కాలనీ వద్ద ఉన్నట్టుండి ఒక్కసారిగా కొండ చిలువ హల్ చల్ చేసింది. అది 7 అడుగుల పొడవు ఉంది. దానిని చూసిన జనాలు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశం నుంచి కొండచిలువ వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
కృష్ణ: విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ని పోలీసులు అడ్డుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. తామేమి ధర్నాలకు వెళ్లడం లేదని వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్నామని అవినాశ్ పోలీసులకు తెలిపారు.
SDPT: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యక్తిగత కార్యదర్శిగా మర్కూక్ మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డిని నియమించారు. మర్కుక్ మండల వ్యవసాయ అధికారిగా రైతులకు సేవలందించిన నాగేందర్ రెడ్డిని పలువురు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. జగదేవపూర్ మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వసంతరావు మర్కుక్ మండల ఏఓగా నాడు బాధ్యతలు స్వీకరించారని ఏడి అనిల్ కుమార్ తెలిపారు.
2001లో పార్లమెంటు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల క్రితం జరిగిన ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. ఈ ఘటన జరిగి 23 ఏళ్లు పూర్తయిన వేళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా తదితరులు నివాళులర్పించారు.