• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మస్తాన్ రావు, సతీష్‌లను కలిసిన ఎమ్మెల్యేలు

ప్రకాశం: అమరావతిలోని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎంపికై నామినేషన్లు వేస్తున్న సందర్భంగా మంగళవారం బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌లను ఒంగోలు, గిద్దలూరు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ముత్తుముల అశోక్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో రాష్ట్ర తరపున తమ వాణిని గట్టిగా వినిపించాలని కోరారు.

December 10, 2024 / 02:05 PM IST

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి కలెక్టర్‌కు వినతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌ను బీజేపీ రాష్ట్ర నేత తాండ్ర వినోద్ రావు కోరారు. ఎయిర్ పోర్ట్ ఏర్పాటు పనులు, సింగభూపాలెం చెరువు కరకట్టను పర్యటక కేంద్రంగా అభివృద్ధి, మణుగూరులో నవోదయ విద్యాలయం ఏర్పాటు, ఏజెన్సీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కోరారు.

December 10, 2024 / 02:05 PM IST

ఆదిలాబాద్‌లో ఈ నెల 12న వాహనాల వేలం

ADB: ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల వివిధ కేసుల్లో పట్టుబడిన 13 బైక్లు, ఒక కారును ఈ నెల 12న వేలం వేస్తున్నట్లు సీఐ తెలిపారు. అదిలాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎక్సైజ్ అధికారి హేమశ్రీ ఆధ్వర్యంలో వేలంపాట ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ప్రభుత్వంచే నిర్దేశించబడిన ధరావతు సొమ్మును చెల్లించి బహిరంగ వేలంపాటలో పాల్గొనవచ్చన్నారు.

December 10, 2024 / 02:04 PM IST

దుత్తలూరులో అర్జీల స్వీకరణ

NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ యనమల నాగరాజు సూచించారు. దుత్తలూరు మండలం మందాలనాయుడుపల్లిలో రెవెన్యూ సదస్సు మంగళవారం నిర్వహించారు. పలు రకాల సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

December 10, 2024 / 02:03 PM IST

అంగన్వాడీ కేంద్రం తనిఖీ

ATP: తాడిపత్రిలో అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాపరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్లో రికార్డులను పరిశీలించారు. గర్భవతులు, బాలింతలకు సక్రమంగా పౌష్టిక ఆహారం అందిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ డా.బీఎన్ శ్రీదేవి, సీడీపీవో, ఇతర సిబ్బంది ఆయన వెంట పాల్గొన్నారు.

December 10, 2024 / 02:02 PM IST

ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన

ATP: గుత్తి ఆర్ఎస్‌లోని రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో మంగళవారం గుంతకల్ పద్మావతి ఆయుర్వేద హాస్పిటల్, రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డీజిల్ షెడ్ ఎండీఎంఈ సుంకన్న వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రోగులను పరీక్షించి ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు.

December 10, 2024 / 02:00 PM IST

బాపట్ల చేరుకున్న సిసోడియకు ఘన స్వాగతం

BPT: మంగళవారం బాపట్ల చేరుకున్న రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జిల్లాకు చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఘన స్వాగతం పలికారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం వారు జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని రెవెన్యూ శాఖపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

December 10, 2024 / 02:00 PM IST

ప్రధాని మోదీకి ధన్యవాదాలు: ఆర్.కృష్ణయ్య

తన సేవలు గుర్తించి బీజేపీ అవకాశం ఇచ్చిందని బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. బీజేపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తాను పార్టీలు మారటం లేదని.. పార్టీలే తన దగ్గరకు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు బీసీలకు ఏం చేయాలన్నా బీజేపీతోనే సాధ్యమని.. బీసీల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తానని చెప...

December 10, 2024 / 01:59 PM IST

వైద్య, విద్య కోసం భూదానం ఆదర్శనీయం: ఎంపీడీవో

KMR: మద్నూర్ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రికి, జూనియర్ కళాశాల, గురుకుల బాలుర పాఠశాల కోసం ఇనాని కుటుంబ సభ్యులు భూదానం చేయడం గొప్ప విషయమని ఎంపీడీవో రాణి అన్నారు. మంగళవారం పాత బస్టాండ్ వద్ద సేఠ్ రాం ప్రసాద్ ఇనాని జయంతి వేడుకలో పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు. గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్, ఇనాని కుటుంబ సభ్యులు ఉన్నారు.

December 10, 2024 / 01:58 PM IST

విజయవాడలో అక్రమ నిర్మాణాలు తొలగింపు

కృష్ణా: విజయవాడలోని గుణదల ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం తొలగించారు. నగరపాలక సంస్థ కమిషనర్ దాన్య ఆదేశాల మేరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారి వసీం బేగ్ హెచ్చరించారు. 

December 10, 2024 / 01:58 PM IST

తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడం సరికాదు: ఎమ్మెల్యే

SRD: తెలంగాణ తల్లి విగ్రహరూపరేఖలను ప్రభుత్వం మార్చడం సరికాదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హత్నూరలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని రూపొందించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

December 10, 2024 / 01:58 PM IST

ఆదిలాబాద్‌లో ముగిసిన కుటుంబ సర్వే డేటా ఎంట్రీ

ADB: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియ ఆదిలాబాద్ జిల్లాలో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా వంద శాతం కుటుంబాల వివరాలను ఆపరేటర్లు సమగ్ర సర్వే వెబ్‌సైట్లలో నమోదు చేశారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 2,25,257 కుటుంబాలున్నట్లుగా హౌస్ లిస్టింగ్ సర్వేలో అధికారులు గుర్తించారు.

December 10, 2024 / 01:58 PM IST

కళాశాల ఎదుట మహిళా ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ఎదుట మంగళవారం ఉష అనే మహిళ ధర్నా చేపట్టింది. తనను వాచ్‌మెన్ విధుల నుండి ఆ కారణంగా తొలగించారని డబ్బులకు ఆశపడి వేరే మహిళను తీసుకున్నారని ఆరోపిస్తూ.. తనకు న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగిస్తానని తెలిపింది.

December 10, 2024 / 01:55 PM IST

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అమోఘ స్పందన

నంద్యాల: జిల్లాలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉప్పెనలా సాగుతుంది. 38వ వార్డు ఇంఛార్జ్ దేరెడ్డి శివ నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ నగర్, నందమూరి నగర్ ప్రజలకు టీడీపీ సభ్యత్వం నమోదును చేయిస్తున్నారు. దేరెడ్డి మాట్లాడుతూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సభ్యత్వ నమోదు ప్రజల నుంచి అమోఘ స్పందన లభిస్తుంది.

December 10, 2024 / 01:52 PM IST

బల్లిపాడు ఇసుక ర్యాంపు వద్ద జేసీబీ సీజ్

W.G: తాళ్లపూడి మండలం బల్లిపాడు ఇసుక రాంప్ వద్ద సీడీంగ్ నిమిత్తం అక్రమంగా ఏర్పాటు చేసిన జేసీబీని కొవ్వూరు ఆర్డీవో సుస్మిత మంగళవారం సీజ్ చేశారు. ఈ ర్యాంపును ఆర్డీవో సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ర్యాంపుల వద్ద ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 10, 2024 / 01:51 PM IST