• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గ్రహణం కారణంగా ఆలయం మూసివేత

NTR: తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచిప్రోలులో స్వస్తిశ్రీ చంద్రమాన విరోధి నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మంగళవారం మార్చి 3న కేతు గ్రహ సంచార చంద్రగ్రహణం సా.3.19కు ప్రారంభమై, సా.5.03కు మధ్యకాలం, సా.6.46కు సమాప్తి చెందుతుంది. గ్రహణం కారణంగా ఉదయం 7.30 వరకు బాలభోగం, మహా నివేదనలు నిర్వహించి, తదుపరి ఆలయ కార్యక్రమాలు నిలిపివేయబడతాయని తెలిపారు.

February 23, 2026 / 02:00 PM IST

గిగ్ వర్కర్ల కోసం కొత్త సంక్షేమ బిల్లు

TG: రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్ల సంక్షేమ బిల్లును సర్కార్ ప్రవేశపెట్టనుంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మంది కార్మికులకు సామాజిక భద్రత, చట్టపరమైన హక్కులు లభించనున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ, గిగ్ వర్కర్ల జీవితాల్లో భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

February 23, 2026 / 01:56 PM IST

పెద్దకడబూరులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

KRNL: పెద్దకడబూరులోని బీసీ, ఎస్సీ కాలనీల్లో MPP నిధులు రూ.15 లక్షలతో 2 సీసీ రోడ్ల నిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. MPP శ్రీవిద్య, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీ సుజాత కలిసి భూమి పూజ నిర్వహించారు. పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం ఈ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

February 23, 2026 / 01:55 PM IST

గుమ్మడిదల మున్సిపాలిటీ తొలి సమావేశం

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ తొలి మున్సిపల్ పాలకవర్గం సమావేశాన్నీ సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సభ్యులు నిర్ణయించారు. మున్సిపల్ పారిశుద్ధ్య నిర్వహణ అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో MLA గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. .

February 23, 2026 / 01:52 PM IST

రేపటి నుంచి జగన్‌ పులివెందుల పర్యటన

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రేపటి నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పులివెందులలోనే ఉండి ప్రజదర్బార్‌ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎల్లుండి వేంపల్లి మండలం నందిపల్లిలో జరిగే నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ప్రజాదర్బార్‌కు హాజరవుతారు.

February 23, 2026 / 01:48 PM IST

కంటి వైద్య శిబిరంతో గ్రామీణులకు మెరుగైన చూపు: ఎంపీ వేమిరెడ్డి

నెల్లూరు: కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని మర్చిపోకూడదనే ఆశయంతో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన శాంతా బయోటెక్నిక్స్‌ ఫౌండర్‌ వర ప్రసాద్‌రెడ్డి ఎందరికో ఆదర్శప్రాయులని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టిపి గూడూరు మండలం ఇస్కపాలెంలో శాంత-వసంత ట్రస్తు, శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు.

February 23, 2026 / 01:47 PM IST

త్వరలో తిరుమలలో కొత్త చట్టం!

AP: సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తీసుకొచ్చే ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. ప్రత్యేక చట్టం ద్వారా తప్పుచేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ఈ క్రమంలో స్వర్ణ దేవాలయం చట్టం వెంటనే అధ్యయనం చేయాలని సీఎం ఆధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 01:46 PM IST

ప్రజా వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్

KRNL: కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 23, 2026 / 01:45 PM IST

స్వయం ఉపాధి ద్వారా మహిళలకు ఆర్థిక బలం

JN: పాలకుర్తి మండలం దుబ్బా తండాగ్రామానికి చెందిన భూక్య వెన్నలాకు సంచార చేపల విక్రయ వాహనాన్ని సోమవారం అందజేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వయం ఉపాధి పథకాలు గ్రామీణ మహిళలకు ఆర్థిక బలం అందిస్తున్నాయని, మహిళలు వాటి ద్వారా కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపించగలరని తెలిపారు.

February 23, 2026 / 01:43 PM IST

పాఠశాలకు ఆట వస్తువుల వితరణ

NLG: విద్యార్థుల ఉల్లాసం కోసం ఏపూర్ 1వ వార్డు సభ్యులు వెంకటేశం తమ ఉదారతను చాటుకున్నారు. ప్రాథమిక పాఠశాలకు ఆయన ఆట వస్తువులను సమకూర్చారు. వీటిని సర్పంచ్ పాలెం మహేష్ చేతుల మీదుగా సోమవారం విద్యార్థులకు అందజేశారు. పాఠశాల సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు హెచ్‌ఎం అంజయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

February 23, 2026 / 01:41 PM IST

బాఫ్టా 2026: ఉత్తమ నటుడు రాబర్ట్ అరమాయో ఎవరు?

ఏడేళ్ల వయసులోనే నటనను ప్రారంభించిన రాబర్ట్ అరమాయో 2026 బాఫ్టా అవార్డుల్లో ఉత్తమ నటుడుగా నిలిచారు. ఐ స్వేర్ చిత్రంలోని నటనకు గాను లియోనార్డో డికాప్రియోను ఓడించి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి ప్రముఖ సిరీస్‌లలో నటించిన ఆయన, అమెరికాలో ప్రత్యేక నటనా శిక్షణ పొంది తన ప్రతిభను చాటుకున్నారు.

February 23, 2026 / 01:41 PM IST

జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం: కరుణాకర్

BHPL: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ వద్ద SSA ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నూతన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులకు సోమవారం శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరంలో BHPL జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు.

February 23, 2026 / 01:41 PM IST

సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం: MLA

JN: నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లింగాల గణపురం మండలంలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

February 23, 2026 / 01:39 PM IST

శాసనమండలి సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు

కాకినాడ: డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు రెండు రోజుల క్రితం శాసనమండలి నుంచి ఒంటరిగా వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. కాగా ఆయన సోమవారం మండలికి విచ్చేశారు. సభలో పాల్గొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో ఆయన సమావేశమైనట్లు సమాచారం.

February 23, 2026 / 01:38 PM IST

కాంగ్రెస్ పథకాలను ప్రతి మహిళకు చేరవేయాలి: ఛైర్మన్

MLG: జిల్లాలోని అన్ని మండలాలకు మహిళా కాంగ్రెస్ ఇంఛార్జీలను ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగమణి నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా కాంగ్రెస్ ఇంఛార్జీలు తమ మండలంలోని ప్రతి గ్రామంలో పర్యటించి కాంగ్రెస్ పథకాలను ప్రతి మహిళకు చేరవేయాలని, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు.

February 23, 2026 / 01:38 PM IST