సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో లారీలో తరలిస్తున్న డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ రూ.50 కోట్లు విలువ ఉంటుందని సమాచారం. వీటిని ఏపీలోని ఓడరేవు నుంచి ముంబయి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
NZB: భారతీయ జనతా పార్టీ బిచ్కుంద మండల శాఖ ఆధ్వర్యంలో మిషన్ కల్లాలి గ్రామ బూత్ అధ్యక్షుడిగా పట్టేవారు బాలును ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని బీజేవైఎం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి విష్ణు తెలిపారు. ఈ ఎన్నిక బీజేపీ మండలాధ్యక్షుడు మల్లికార్జున దేశాయి ఆధ్వర్యంలో జరిగిందన్నారు. బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందులో నాయకులు సంతోష, శివకుమార్ ఉన్నారు.
ప్రకాశం: జిల్లాలో సర్టిఫికెట్ కోర్సు ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పరీక్ష ఈ నెల 16నుంచి 21వ తేదీ వరకు గుంటూరు, కడపలో జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. పరీక్షలను పజడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
తూ.గో: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారిని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వాదం అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.
PPM: రహదారి ఆక్రమిస్తే చర్యలు తప్పవని పట్టణ సీఐ మురళీధర్ హెచ్చరించారు. శుక్రవారం ఈ మేరకు పట్టణంలోని రహదారి ఆక్రమణలను తొలగించారు. అయన మాట్లాడుతూ ప్రధాన రహదారిలో, కాలువలలో ఆక్రమణలు జరగడం వలన ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అన్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆక్రమణలు తొలగించేందుకు పట్టణ ప్రజల సహకరించాలన్నారు.
KDP: రైతు సమస్యల పట్ల కడపలో చేపట్టనున్న అన్నదాత పోరుబాట నిరసన కార్యక్రమానికి శుక్రవారం ఎర్రగుంట నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు తరలి వెళ్లారు. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల మండల పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అన్నదాత పోరు బాట కార్యక్రమానికి వెళ్లారు.
NZB: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఆమె బంధువులు, స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన అతడు చికిత్స పొందుతూ మృతిచెందగా శుక్రవారం ఉదయం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
కృష్ణా: ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత ప్రకారం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, ఒక రోజులో ఏళ్ల తరబడి తిష్ట వేసుకున్న సమస్యల పరిష్కరించడం సాధ్యం కాదని, ప్రజలు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. చంద్రన్న గ్రామం కాలనీలో ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
NZB: నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమంలో బాన్సువాడ, బోధన్, జుక్కల్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, సుదర్శన్రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు ట్రంప్తో తమ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ట్రంప్నకు అమెజాన్ భారీ విరాళం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రమాణ స్వీకార నిధికి రూ.8 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు సమాచారం.
NGL: గ్రామ పంచాయతీ బిల్డిండ్ నిర్మించాలని త్రిపురారం మండలం మాటూరులో ధర్నా చేపట్టారు. పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరిందని వారు చెప్పారు. పంచాయతీ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో కొత్త బిల్డింగ్ నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా దివంగత షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. గతంలో ఎంపీగా పనిచేసిన సందీప్.. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజవర్గంలో మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో తలపడనున్నారు. ఈ స్థానంలో కేజ్రీవాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ న...
JGL: కోరుట్ల పట్టణంలోని ఆర్పీలను ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్ట్లకు భయపడేది లేదని, తమకు వేతనం రావాలని ఆందోళన చేపట్టారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మాడవేణి నరేశ్ ఆర్పీలను పరామర్శించిన, అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
MDK: చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో హిందీ టీజీటీ పోస్ట్ ఖాళీగా ఉందని దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ చంద్రకళ కోరారు. హెచ్పీటీ అర్హత ఉండి టెట్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈనెల 16 తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని, ఈనెల 17V డెమో క్లాస్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
TG: సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో మాడిగి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లారీలో తరలిస్తున్న డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.50 కోట్లు ఉండవచ్చని అధికారుల అంచనా. ఆ డ్రగ్స్ని ఏపీలోని ఓడరేవు నుంచి ముంబై త...