• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బాసర RGUKTకి స్కిల్ డెవలప్‌మెంట్ లీడర్ షిప్ అవార్డు

NRML: బాసర RGUKT కళాశాలకు ‘స్కిల్ డెవలప్‌మెంట్ లీడర్ షిప్ అవార్డు-2025’ లభించింది. విద్యార్థుల ఉద్యోగ నియామకాలలో అంతర్జాతీయ, ప్రభుత్వ ఉద్యోగాలలో భాగస్వామ్యం, పరిశోధన, సాంకేతికత, యువ నాయకత్వం వంటి అంశాలలో గణనీయమైన పురోగతి సాధించినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల కళాశాల ఉద్యోగులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

November 28, 2025 / 08:43 PM IST

‘రక్తదానంతో ఇతరుల ప్రాణాలు కాపాడొచ్చు’

ప్రకాశం: ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు మార్కాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 60 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి, గర్భిణీ స్త్రీలకు రక్తదానం చేయడం వల్ల వారి ప్రాణాలు నిలబడతాయని డా. కిరణ్ అన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

November 28, 2025 / 08:41 PM IST

గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని కరపత్రాలు ఆవిష్కరణ

VZM: నవంబర్ 30న మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని, చేపడుతున్న గురజాడ గౌరవ యాత్ర, రాష్ట్ర స్థాయి సాహితీ గోష్టి కార్యక్రమాలపై శుక్రవారం గురజాడ గృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్బంగా జనవిజ్ఞానవేదిక జిల్లా అధ్యక్షులు డా. MVN వెంకటరావు ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో చీకటి దివాకర్, రాజగోపాల్, నిర్మల పాల్గొన్నారు.

November 28, 2025 / 08:40 PM IST

రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

W.G: గణపవరం మండలం జల్లి కొమ్మరలో రైతు సేవా కేంద్రంను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోలు, గోనె సంచులు సంబంధించిన రిజిస్టరును, ట్రక్ షీట్‌లను పరిశీలించారు. ట్రక్ షీట్ వెనుక భాగంలో తేమశాతం నమోదు చేయాలని ఆదేశించారు. దిత్వా తుఫాన్ ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

November 28, 2025 / 08:40 PM IST

ముంబై ఇండియన్స్ జట్టులోకి కీసర అమ్మాయి

మేడ్చల్ జిల్లాకు చెందిన నల్ల రామకృష్ణా రెడ్డి, రాణి కుమార్తె కీర్తన రెడ్డి ముంబై ఇండియన్స్ ఉమెన్స్ క్రికెట్ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. సాధారణ కుటుంబంలో జన్మించిన కీర్తన WPL- 2026కు సెలక్ట్ అవ్వడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో TG స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి, గ్రామస్థులు కీర్తన రెడ్డికి అభినందనలు తెలిపారు.

November 28, 2025 / 08:39 PM IST

కరెంట్ పోల్‌ను ఢీ కొట్టిన డీసీఎం

HYD: జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. ఓ డీసీఎం వెహికల్ రివర్స్ వస్తూ ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనతో రోడ్ నం.51 నుంచి 52 వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

November 28, 2025 / 08:38 PM IST

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

VSP: చోడవరం ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్ దాటుతుండగా, అనకాపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వైన్ షాప్‌లో పనిచేస్తున్న ఆలీ కాలు నుజ్జయి తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

November 28, 2025 / 08:38 PM IST

ప్రతి శివారు భూమికి నీరు ఇవ్వాల్సిందే : కేంద్రమంత్రి

SKLM: ప్రతి శివారు భూమికి నీరు ఇవ్వాల్సిందే అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ అధికారులతో కలిసి విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్‌‌లో ఉన్న పాత, కొత్త సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

November 28, 2025 / 08:37 PM IST

ప్రతి శివారు భూమికి నీరు ఇవ్వాల్సిందే: కేంద్రమంత్రి

SKLM: ప్రతి శివారు భూమికి నీరు ఇవ్వాల్సిందే అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ అధికారులతో కలిసి విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్‌‌లో ఉన్న పాత, కొత్త సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

November 28, 2025 / 08:37 PM IST

సీఎంఆర్ ధాన్యం సకాలంలో సమర్పించాలి: అదనపు కలెక్టర్

వనపర్తి జిల్లాలో డిఫాల్టర్ జాబితాలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్న సీఎంఆర్‌తో పాటు పెనాల్టీ చెల్లిస్తే కొత్త ధాన్యం పొందవచ్చని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సూచించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ తన చాంబర్లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ రూపంలో బియ్యం సకాలంలో సమర్పించాలన్నారు.

November 28, 2025 / 08:36 PM IST

HYDలో గ్లోబల్ సమ్మిట్.. హాజరయ్యే ప్రముఖులు వీరే

హైదరాబాద్‌లో వచ్చే నెల 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు దేశవిదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, ఆనంద్ మహీంద్రా, UAE రాయల్ ఫ్యామిలీ సభ్యులు, అంతర్జాతీయ టెక్ కంపెనీల CEOలు, పెట్టుబడిదారులు అలాగే స్టార్టప్ ఫౌండర్లు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

November 28, 2025 / 08:36 PM IST

ఎన్నికలపోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ఈ ప్రక్రియ జరిగింది. కలెక్టర్ ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు.

November 28, 2025 / 08:36 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ

కృష్ణా: మచిలీపట్నంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 8 మంది బాధితులకు ఎంపీ వల్లభనేని బాలశౌరి రూ.4.29 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ అమలు కాని వారికి, సీఎం సహాయనిధి ద్వారా ప్రజలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

November 28, 2025 / 08:36 PM IST

‘విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించాలి’

VKB: విద్యార్థులకు చదవడం, రాయడం రావాలని MEO వెంకట్ అన్నారు. దోమమండలం చేర్ల తండా MPPS పాఠశాలలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి విద్యార్థులతో పాఠాలు చదివించి రాయించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా భోదించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదిలోకి ఉపాధ్యా యులు సెల్ఫోన్ తీసుకుపోవద్దని సూచించారు.

November 28, 2025 / 08:33 PM IST

విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వాలు: మాజీ ఎమ్మెల్యే

KMR: విద్యా రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆరోపించారు. శుక్రవారం కామారెడ్డిలో జరిగిన PDSU మహాసభలలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యా రంగ సమస్యలపై పీడీఎస్‌యూ నిరంతర పోరాటం చేయడం ఎంతో అభినందనీయమన్నారు.

November 28, 2025 / 08:32 PM IST