తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి తుపాకులు, బాంబు పేలుళ్లతో దద్ధరిల్లుతోంంది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దు దాటి చొరబడకుండా ఛత్తీస్గఢ్ పోలీసులు, ఇటు తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు సమన్వయంతో జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి.
SDPT: తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని BJP నాయకులు మండిపడ్డారు. నియోజకవర్గంలో అరెస్టైన ఆశా వర్కర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో ఉంచిన వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.
SKLM: యువ రచయితలను ప్రోత్సాహించటం ఆనందదాయకమని, డా.బీ ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా గ్రంథాలయంలో యువ రచయితల వేదిక అధ్యక్షులు తంగి ఎర్రమ్మ, కార్యదర్శి పొట్నూరి మాలతిల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. కవి సమ్మేళనంలో పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో గేదెల, వాసవి, తదితరులు పాల్గొన్నారు.
NDL: చిన్నదేవలాపురం గ్రామంలో నిన్న రాత్రి జరిగిన ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో షేక్ మాభూసా కుటుంబానికి చెందిన పశువుల పాక పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న బండి ఆత్మకూరు టీడీపీ మండల అధ్యక్షులు ముమ్మడి నాగ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతాపూర్లో ఎల్లమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. కౌన్సిలర్లు ప్రశాంత్, అశోక్, నాయకులు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలో కో-ఆప్షన్ పదవుల కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. గతంలో పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశిస్తున్నారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు, మేయర్, ఛైర్మన్లుగా బాధ్యతలు చేపట్టారు. ఇక కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక మిగలగా, ఆశావహులు MLA ల ఆశీర్వాదం కోసం వేచిచూస్తున్నారు.
PDPL: ముత్తారం మండలం ఒడేడు గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. ఆదివారం కజ్జం రమణయ్య బంధువుల ప్రథమ వర్ధంతి కోసం ఆదిలాబాద్ వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని రూ.10వేల నగదు అపహరించారు. గతంలోనూ ఆయన ఇంట్లో చోరీ జరగడం గమనార్హం. బాధితుడి ఫిర్యాదు మేరకు ముత్తారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BDK: అశ్వాపురం మండలం, భీముని గుండం కొత్తూరులో జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించగా, సుమారు రూ. 80 కోట్లతో NBCC నిర్మాణం చేపట్టనుంది. ఈ విద్యాలయం ద్వారా జిల్లా విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది.
CTR: మానవత్వానికి కులమతాల అవసరం లేదని నిరూపించిన సంఘటన వీకోట మండలం చౌడేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. అబ్దుల్ బాషా, షబీనా దంపతులు తల్లిదండ్రులు లేని హేమలత అనే ఓ హిందూ చిన్నారిని పెంచి పెద్ద చేశారు. తమ స్తోమత మేరకు చదువు సైతం చెప్పించారు. ఓ మంచి హిందూ సంబంధం చూసి హిందూ పద్ధతిలో వివాహం జరిపించారు.
AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. జాబ్ క్యాలెండర్లోనే డీఎస్సీ పోస్టుల వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు. ఉన్నత విద్యలో ఇంజినీరింగ్ సహా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా కీలకమన్నారు. క్లస్టర్ బేస్ట్ అప్రోచ్ ఆధారంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు అనుబంధంగా వచ్చే ఏడాదిలోగా పనులు చేస్తామని వెల్లడించారు.
SRD: పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం 54 మంది లబ్ధిదారులకు రూ.24.43 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సంక్షేమం.. ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
SRCL: జిల్లాలో పులుల సంచారంపై అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సూచించారు. చందుర్తి మండల కేంద్రం నుండి మోత్కరాపేట వెళ్లే మార్గంలో పులులు సంచరిస్తుండడంతో ఆ ప్రాంతాన్ని సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ సందర్శించారు. అటవీశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో భయందోలనలపై అవగాహన కల్పించాలన్నారు.
RR: అత్తాపూర్లో నూతనంగా నిర్మించిన ధన్వంతరి ఆసుపత్రిని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సామాన్యులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు.
ADB: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించడానికి పట్టణానికి రానున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న తెలియజేశారు.
VZM: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కె.ఎల్. పురంలోని శ్రీ లక్ష్మీగణపతి జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించారు.