ఫోర్బ్స్ 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ మహిళల జాబితాను విడుదల చేసింది. ప్రపంచంలో శక్తివంతమైన మహిళల్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు చోటు దక్కింది. జాబితాలో రోష్నీ నాదర్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షాల పేర్లు కూడా ఉండటం విశేషం. కాగా.. యూరోపియన్ కమిషన్కు నాయకత్వం వహించిన మొదటి మహిళ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ జాబితాలో తొ...
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగి 23ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఉభయసభలు నివాళులు అర్పించాయి. అనంతరం లోక్సభ స్పీకర్ జీరో అవర్ను ప్రారంభించారు. తర్వాత రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ చర్చను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు.
కడప: వేంపల్లి పట్టణంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి ఎన్నికల విషయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా నోటీసులు అందజేశారు.
కృష్ణ: సివిల్ సప్లయ్ గోదాంలో బియ్యం అవకతవకలపై పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైన సంగతి విదితమే. తప్పు చేస్తే ఎంతటి వారినైనా కర్మ వదిలి పెట్టదని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాసులు విమర్శించారు. ఇదిలా ఉండగా పేర్ని వ్యక్తిగత సహాయకునిపై కేసు నమోదు కావడం ఒకటైతే, పేర్ని సతీమణి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
అల్లూరి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మీద అనుచిత వ్యాక్యలు చేసిన విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ మెంబర్ అయిన కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి భేషరతుగా క్షమాపన చెప్పాలని అరకులోయ మండల సచివాలయ సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు అరకులోయ మండల పరిషత్ సమావేశ మందరం వద్ద నల్ల బ్యాడ్జిలతో నిరసన చేపట్టారు. నిరసనలో సచివాలయ ఉద్యోగులు దొర మత్స్యరాజు, కొర్రా రాంబాబు తదితరులున్నారు.
NLR: పాత నేరస్తుడు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. నెల్లూరు డైకాస్ రోడ్డు ఎన్బీటీ కాలనీకి చెందిన కరిముల్లా ఆటో పెయింట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి ఆయన గ్రీన్ పార్క్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఉండగా,అదే ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు యాసిర్ అక్కడకు వచ్చి కత్తితో కరిముల్లాపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడి పరారయ్యాడు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారిని శుక్రవారం పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏలూరు కలెక్టరేట్లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వినతిపత్రం అందించటం కోసం వెళ్తూ మార్గ మధ్యలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు.
AKP: 74వ వార్డులో శుక్రవారం ప్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు వాడరాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, జోనల్ కమిషనర్ శేషాద్రి పాల్గొన్నారు.
WGL: హనుమకొండలో నిర్మించిన కాలోజీ కళాక్షేత్రానికి పగుళ్లు వస్తున్నాయని సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ నాయకులకు అధికారం కోల్పోయి ఏం మాట్లాడాలో తెలియక తాము చేసే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు పుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. కాళోజీ కళాక్షేత్రం పనులలో తమ తప్పిదం ఏమీ లేదని పేర్కొన్నారు.
NRPT: పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో భౌతిక శాస్త్రం బోధించుటకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జీ ప్రిన్సిపల్ సునీత శుక్రవారం తెలిపారు. బీఈడీ, సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు స్థానికత కలిగిన మహిళలు ఈనెల 15లోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ‘జైలర్’ భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జైలర్ 2’ రాబోతుంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓ పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్ర ఊర మాస్ ఉంటుందని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
PPM : ప్రతి కొనుగోలు కేంద్రాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మార్కెటింగ్ అధికారి గంగాధర్ రావుఅన్నారు. శుక్రవారం అయన మాట్లాడుతూ దళారులు మాటలు విని మోసపోవద్దని, రైతులకు హితవు పలికారు. నేరుగా రైతు లు ప్రత్తి కేంద్రంలకు వచ్చి విక్రయించాలని రైతులను కోరారు.
సాధారణంగా వయసు పెరిగే కొద్ది ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడతాయి. వాటివల్ల చర్మం యవ్వనత్వాన్ని కోల్పోతుంది. అలా జరగకుండా ఉండేందుకు పలు చిట్కాలను సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ డైట్లో పండ్లు, పప్పు ధాన్యాలు, తాజా కూరగాయలు, ప్రోటీన్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకుని తగినంత నిద్రపోవాలి. మేకప్కి దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేయాలి.
W.G: జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం రైతన్నలకు అండగా అంటూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి జిల్లా నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాలకొల్లు వైసీపీ కార్యాలయం నుండి ఇన్ఛార్జ్ గుడాల గోపి ఆధ్వర్యంలో భారీగా వైసీపీ నేతలు తరలి వెళ్లారు. అలాగే రైతుల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందించనున్నట్లు పేర్కొన్నారు.
ADB: బజార్ హత్నూర్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు గాండ్ల శ్రీనివాస్ బజార్ హత్నూర్ బీఆర్ఎస్ నాయకులు చట్ల తరుణ్ ఆధ్వర్యంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి పని చేయాలనే ఉదేశ్యంతో పార్టీలో చేరానని అన్నారు.