సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో అనధికార వ్యక్తులు ఉండకుండా చర్యలు తీసుకున్నారు. సీఐలు, ఎస్సైల పర్యవేక్షణలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు రాకుండా తనిఖీలు చేపట్టారు. తొలిరోజు ప్రథమ సంవత్సరం మొదటి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
ATP: గుత్తి కోటలో కొలువైన శ్రీ భూనీలా సమేత నరసింహస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. దేవాలయ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
ADB: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై దాడిని ఖండిస్తూ జైనథ్ బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. బస్టాండ్ ఆవరణలో గంటపాటు ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
MDCL: కీసర అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 211వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని అధ్యక్షుడు కర్రె గణేశ్ ప్రధాన కార్యదర్శి మంచాల సంజీవ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ గౌడ సంఘం నాయకుడు వనందాస్ లక్ష్మి నారాయణ గౌడ్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కీసర గ్రామశాఖ అధ్యక్షుడు తుడుం బాలరాజ్ పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాసంగి పంట సాగు చేస్తున్న రైతులు రైతు భరోసా పథకం నిధులు ఇంకా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట వేసే సమయంలో ఎరువులు, విత్తనాలు, కూలీలు, ఇతర ఖర్చులకు ఉపయోగపడేలా రూపొందించిన ఈ పథకం ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి త్వరగా రైతుబంధు ఇవ్వాలని కోరారు.
SRD: కోహీర్ మండలంలోని గురుజువాడ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని కాంప్లెక్స్ హెచ్ఎం ప్రభు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యా యులు బోధనాభ్యసన సామగ్రిని విరివిగా వినియోగించి విద్యార్థులకు సులభరీతిలో అర్థమయ్యే లా విద్యా బోధన చేయాలని సూచించారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగించే విధంగా బోధించాలన్నారు.
NTR: నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నండ్రు బాబు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులు ఎం పవన్ కుమార్పై విక్రమ్ సింహ అనే సీఐ దాడి చేయటం పట్ల తీవ్రంగా ఖండించారు. తక్షణం సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోని, సస్పెండ్ చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలన్నారు.
KMM: బీసీలు అంటే ఎందుకంట చిన్నచూపు ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పి ఇలాంటి దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని రజక సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు జూపల్లి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లాలో బీసీ చాకలి కులానికి సంబంధించిన పేద కుటుంబం పై దాడిని ఖండించారు.
W.G: ఉండి మండలం, పాముల పర్రులోని రొయ్యల చెరువుల్లో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలపడంతో లక్షలాది రూపాయల విలువైన రొయ్యలు మృతి చెందాయి. ఈ ఘటనతో రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రామ సర్పంచ్ భర్త కేశన బలుసుల మాస్టర్ 12 ఎకరాలు, కేశన యాదగిరి 5 ఎకరాల చెరువులో రొయ్యలు మృత్యువాత పడ్డాయి. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
KMM: పెనుబల్లి మండలం రామచంద్రరావు బజార్ గ్రామంలో నంద్యాల కృష్ణవేణి గోపిలకు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దయానంద్ హాజరయ్యారు. పేదవారికి ఇల్లు అందించడం ముఖ్య లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి కృషి చేస్తున్నారని వారు తెలిపారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేవాదుల ఫండ్ రైజింగ్ కోసమే రేవంత్ వచ్చారని, కేరళ ఎన్నికలకు ఫండ్ పంపడం కోసం దేవాదుల పనులను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. సీఎం మైండ్ గేమ్ ఆడుతున్నారని, కేరళ ఎన్నికలకు రూ.వెయ్యి కోట్లు పంపడానికే ఈ డ్రామా అన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే.. మీ అవినీతిపై విచారణ ఉంటుందన్నారు.
SKLM: తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన మహానేత మాజీ కేంద్రమంత్రి ఎర్రం నాయుడు అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
PDPL: ముర్మూర్ కొమరన్న జాతరకు హాజరుకావాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ను జాతర ఆహ్వాన కమిటీ కార్యనిర్వాహకుడు గోపు ఐలయ్య కోరారు. సోమవారం ఎన్టీపీసీ అతిథి గృహంలో ఆయనను కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 27 నుంచి మార్చి 3 వరకు మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, కల్యాణోత్సవం జరుగుతుందన్నారు.
NGKL : నాగర్ కర్నూల్ మండల పరిధిలోని కుమ్మెర జాతరలో కులోన్మాదానికి బలైన చిన్నారి ఘటనను నిరసిస్తూ సోమవారం లింగాల మండలం అంబటిపల్లిలో MRPS, రజక సంఘం నాయకులు కుమ్మెర కు బయల్దేరారు. నిందితులను శిక్షించాలని MRPS నేత బంగారయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో MRPS కార్యకర్తలు పాల్గొన్నారు.