• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎల్లమ్మ దేవాలయంలో మున్సిపల్ ఛైర్మన్ ప్రత్యేక పూజలు

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతాపూర్‌లో ఎల్లమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. కౌన్సిలర్లు ప్రశాంత్, అశోక్, నాయకులు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 11:06 AM IST

కో-ఆప్షన్ పదవుల కోసం ఆశావహుల నిరీక్షణ

మంచిర్యాల జిల్లాలో కో-ఆప్షన్ పదవుల కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. గతంలో పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశిస్తున్నారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్‌లు, మేయర్, ఛైర్మన్‌లుగా బాధ్యతలు చేపట్టారు. ఇక కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక మిగలగా, ఆశావహులు MLA ల ఆశీర్వాదం కోసం వేచిచూస్తున్నారు.

February 23, 2026 / 11:05 AM IST

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

PDPL: ముత్తారం మండలం ఒడేడు గ్రామంలో దొంగలు హల్‌చల్ చేశారు. ఆదివారం కజ్జం రమణయ్య బంధువుల ప్రథమ వర్ధంతి కోసం ఆదిలాబాద్ వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని రూ.10వేల నగదు అపహరించారు. గతంలోనూ ఆయన ఇంట్లో చోరీ జరగడం గమనార్హం. బాధితుడి ఫిర్యాదు మేరకు ముత్తారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 23, 2026 / 11:05 AM IST

నవోదయ విద్యాలయానికి రంగం సిద్ధం

BDK: అశ్వాపురం మండలం, భీముని గుండం కొత్తూరులో జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించగా, సుమారు రూ. 80 కోట్లతో NBCC నిర్మాణం చేపట్టనుంది. ఈ విద్యాలయం ద్వారా జిల్లా విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది.

February 23, 2026 / 11:03 AM IST

హిందూ యువతకి పెళ్లి చేసిన ముస్లిం కుటుంబం..!

CTR: మానవత్వానికి కులమతాల అవసరం లేదని నిరూపించిన సంఘటన వీకోట మండలం చౌడేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. అబ్దుల్ బాషా, షబీనా దంపతులు తల్లిదండ్రులు లేని హేమలత అనే ఓ హిందూ చిన్నారిని పెంచి పెద్ద చేశారు. తమ స్తోమత మేరకు చదువు సైతం చెప్పించారు. ఓ మంచి హిందూ సంబంధం చూసి హిందూ పద్ధతిలో వివాహం జరిపించారు.

February 23, 2026 / 11:02 AM IST

నిరుద్యోగులకు లోకేష్ GOOD NEWS

AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. జాబ్ క్యాలెండర్‌లోనే డీఎస్సీ పోస్టుల వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు. ఉన్నత విద్యలో ఇంజినీరింగ్ సహా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా కీలకమన్నారు. క్లస్టర్ బేస్ట్ అప్రోచ్ ఆధారంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు అనుబంధంగా వచ్చే ఏడాదిలోగా పనులు చేస్తామని వెల్లడించారు.

February 23, 2026 / 11:02 AM IST

ప్రజా సంక్షేమమే లక్ష్యం: MLA గూడెం

SRD: పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం 54 మంది లబ్ధిదారులకు రూ.24.43 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సంక్షేమం.. ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

February 23, 2026 / 11:01 AM IST

పులుల సంచారంపై అవగాహన కల్పించాలి: MLA

SRCL: జిల్లాలో పులుల సంచారంపై అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సూచించారు. చందుర్తి మండల కేంద్రం నుండి మోత్కరాపేట వెళ్లే మార్గంలో పులులు సంచరిస్తుండడంతో ఆ ప్రాంతాన్ని సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ సందర్శించారు. అటవీశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో భయందోలనలపై అవగాహన కల్పించాలన్నారు.

February 23, 2026 / 11:01 AM IST

మెరుగైన వైద్య సేవలు అందించాలి: మంత్రి

RR: అత్తాపూర్‌లో నూతనంగా నిర్మించిన ధన్వంతరి ఆసుపత్రిని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సామాన్యులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు.

February 23, 2026 / 11:01 AM IST

జిల్లాకు రానున్న మాజీ మంత్రి

ADB: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించడానికి పట్టణానికి రానున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న తెలియజేశారు.

February 23, 2026 / 11:01 AM IST

‘పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు’

VZM: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కె.ఎల్. పురంలోని శ్రీ లక్ష్మీగణపతి జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించారు.

February 23, 2026 / 11:00 AM IST

పెట్రోల్ దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

KKD: తునిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీరామ థియేటర్ సెంటర్లో బుధవారం జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సైకిల్ మెకానిక్ నానాజీ సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ మెకానిక్, సైకిల్ మెకానిక్ మధ్య జరిగిన ఘర్షణ ఆగ్రహానికి లోనైన బైక్ మెకానిక్, నానాజీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

February 23, 2026 / 11:00 AM IST

‘తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు’

NRML: నిర్మల్‌లో ఆదివారం జరిగిన సాధారణ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని ASP సాయికిరణ్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై ఒక కేసు, కారును ధ్వంసం చేసిన వ్యక్తిపై మరో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు నేటి ప్రకటనలో హెచ్చరించారు.

February 23, 2026 / 11:00 AM IST

ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు

కృష్ణా: గుడివాడలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలకు అనుగుణంగా కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అధికారులు చర్యలు చేపట్టారు.

February 23, 2026 / 11:00 AM IST

గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా

ATP: గుత్తి ICDS కార్యాలయం ఎదురుగా సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది CITU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు రమేష్ మాట్లాడుతూ.. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 11:00 AM IST