• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ధర్నాకు తరలి వెళ్లిన వైసీపీ నాయకులు

ELR: అన్నదాతకు అండగా వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరులో జరిగిన ధర్నాకు ఉంగుటూరు మండల వైసీపీ నాయకులు తరలి వెళ్లారు. మండల ఎంపీటీసీ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు ధర్నాలో మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయి లక్ష్మి, విజయలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

December 13, 2024 / 12:27 PM IST

‘బైండ్ల కులాన్ని ఎస్సీ-ఏలో చేర్చాలి’

KMM: బైండ్ల సామాజిక వర్గాన్ని ఎస్సీ-ఏ జాబితాలో చేర్చించాలని బైండ్ల భవనీయ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీమ్ అక్తర్‌ను ఖమ్మం కలక్టరేట్‌లో శుక్రవారం కలిసి వినతి పత్రం అందించారు. కమిషన్ ముందు జమిడిక వాయిద్యాలతో కళాప్రదర్శన చేశారు. బైండ్ల కులాన్ని సామాజికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయంగా వెనకబడిన కులంగా గుర్తించాలన్నారు.

December 13, 2024 / 12:25 PM IST

సీఎంతో కలసి పోస్టర్ ఆవిష్కరించిన

MHBD: ఈ నెల 14 నుంచి హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ మెగా టోర్నీ ‘సంతోష్ ట్రోఫీ’ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దానికి సంబంధించిన పోస్టర్లను దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు కాంగ్రెస్ ముఖ్య ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. వారిలో మహబూబాబాద్ ఎంపీ బాలరాం నాయక్ ఉన్నారు.

December 13, 2024 / 12:25 PM IST

మండలాల వారీగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ASR: జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం పెదబయలు మండలంలో 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంచంగిపుట్టులో 12.4, అనంతగిరి, డుంబ్రిగుడ, గూడెం కొత్తవీధి మండలాల్లో 12.9, పాడేరు 13.2, హుకుంపేట 13.5, చింతపల్లి 13.9, కొయ్యూరు మండలంలో 16.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు.

December 13, 2024 / 12:25 PM IST

లోక్ అదాలత్‌ను వినియోగించుకొండి

ELR: ఈనెల 14వ తేదీన జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు స్థానిక సివిల్ జడ్జి కిషోర్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. చెక్కు బౌన్స్ కేసులు, నాటుసారా, ఎక్సైజ్, లిక్కర్ ఇతర కేసులు రాజీ చేసుకోవచ్చునని తెలిపారు. రాజీయే రాజమార్గమన్నారు.

December 13, 2024 / 12:23 PM IST

మోడల్ నమూనా నిర్మాణ పనులకు పొంగులేటి శంకుస్థాపన

KMM: కూసుమంచి మండల తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇంటి మోడల్ నమూనా నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి శంకుస్థాపన చేశారు. పేదవాడి ఇంటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఆయన వెంట కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉన్నారు.

December 13, 2024 / 12:20 PM IST

ద్విచక్ర వాహనం అదుపుతప్పి RMP డాక్టర్ మృతి

BDK: 9వ మైలు తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో RMP వైద్యుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. కిష్టారానికి చెందిన లక్ష్మణ్ గురువారం రాత్రి ఇల్లందు నుంచి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో RMP తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 13, 2024 / 12:20 PM IST

జలమయమైన సూళ్లూరుపేట మెయిన్ రోడ్

NLR: బంగాళాఖాతాలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండురోజులుగా భారీగా వర్షాలు కురవడం తెలిసిందే. సూళ్లూరుపేట బైపాస్ నుంచి బజారుకి వెళ్లే మార్గంలో మోకాలలోతు వర్షపునీరు రోడ్లపైనే ఆగడంతో ఆటోలు, ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు ఆ నీటిని క్లియర్ చేయాలనీ కోరారు.

December 13, 2024 / 12:20 PM IST

చందూర్‌లో బోధన్ RTO హెచ్చరిక

NZB: చందూర్ మండల కేంద్రంలో నేడు బోధన్ RTO శ్రీనివాస్ వాహనదారులకు, ట్రాక్టర్ యజమానులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ రోడ్లపై ట్రాక్టర్ కేజీవీల్స్‌కు పట్టీలు లేకుండా నడపరాదని, నిబంధనలు అతిక్రమించి నడిపినట్లయితే రూ.30వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రోడ్లను కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. 

December 13, 2024 / 12:19 PM IST

రోడ్డుప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

GDL: ఐజ పట్టణంలో శుక్రవారం కొత్త బస్టాండ్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్ లైన్ మెన్ కృష్ణయ్య గాయాలపాలయ్యాడు. కృష్ణయ్య ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఆర్టీసీ బస్సు వెనక టైరు ఆయనపైకి ఎక్కింది. దీంతో కాలు నుజ్జు నుజ్జు అయింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

December 13, 2024 / 12:17 PM IST

ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ‘వేరే లెవల్‌ ఆఫీస్‌’

ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’లో కామెడీ ఎంటర్‌టైనర్‌ వెబ్ సిరీస్ ‘వేరే లెవెల్ ఆఫీస్’ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 50 ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ అందుబాటులో ఉంది.  మరో ఎపిసోడ్ ఇవాళ రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. కాగా ఈ సిరీస్ ఎపిసోడ్స్ ప్రతి గురువారం, శుక్రవారం రాత్రి 7 గంటలకు రిలీజ్ అవుతాయి.

December 13, 2024 / 12:17 PM IST

స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం

AP: సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. ‘పది సూత్రాలు ఒక విజన్‌’ పేరిట దీన్ని రూపొందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీనికి శ్రీకారం చుట్టారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితం అంటూ విజన్ డాక్యుమెంట్‌పై సీఎం సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కూటమి నేతలు హాజరయ్యారు.

December 13, 2024 / 12:16 PM IST

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం

NLG: త్రిపురారం మండలంలో కేంద్ర పశుగణాభివృద్ధి సంస్థ & పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చెన్నై పాలెం గ్రామంలో గోపాలమిత్ర పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 42 గేదెలు, 25 దూడలకు పలు రకాల వ్యాధులను గుర్తించి వాటికి సంబంధించిన మందులను ఇవ్వడం జరిగిందని మండల పశు వైద్యాధికారి CH. నాగేందర్ తెలిపారు. రాహుల్, శివారెడ్డి, అశోక్, రైతులు పాల్గొన్నారు.

December 13, 2024 / 12:14 PM IST

అధికార పార్టీ నాయకుడి ముందస్తు అరెస్ట్

KMR: మంత్రుల పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీల నాయకులను ముందస్తు అరెస్ట్‌లు చేయడం చూస్తుంటాం.. కానీ జుక్కల్‌లో అధికార పార్టీ నాయకుడినే ముందస్తు అరెస్ట్‌ చేసిన ఘటన జుక్కల్‌ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. శుక్రవారం నిజాంసాగర్‌ నీటి విడుదల నిమిత్తం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

December 13, 2024 / 12:12 PM IST

మియాపూర్‌లో వివాహిత సూసైడ్

RR: భర్త వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన నాగలక్ష్మికి మనోజ్ అనే వ్యక్తితో ఇటీవల వివాహమైంది. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో నాగలక్ష్మి బుధవారం ఆన్‌లైన్‌లో విషం తెప్పించుకొని తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది.

December 13, 2024 / 12:12 PM IST