• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘చంద్రబాబు రాజ్యసభ స్థానాలను అమ్ముకున్నారు’

AP: చంద్రబాబు ఒకే కుటుంబానికి పెద్దపీట వేస్తున్నారని మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. బీసీలకు రాజ్యసభ స్థానాలను అమ్ముకున్నారని ఆరోపించారు. బీద మస్తాన్‌రావు రాజీనామా చేసి తిరిగి రాజ్యసభ సీటు కొనుకున్నారని చెప్పారు. సానా సతీష్ అనే క్రిమినల్‌కి రాజ్యసభ స్థానం ఇచ్చారని వ్యాఖ్యానించారు. సతీష్‌పై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయని తెలిపారు.

December 10, 2024 / 02:54 PM IST

మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు

నంద్యాల: మొదటిసారిగా నంద్యాల జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్‌కు జిల్లా ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్‌కు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, అందరూ పూలతో స్వాగతం పలికారు. జిల్లాలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు.

December 10, 2024 / 02:54 PM IST

‘భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం’

KDP: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం సంబేపల్లి మండలం పీఎన్ కాలనీలో జరిగే రెవిన్యూ సదస్సులకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘మీ భూమి-మీ హక్కు’ డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.

December 10, 2024 / 02:53 PM IST

వనపర్తి జిల్లాలో 2,366 పోలింగ్ కేంద్రాలు

WNP: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మొత్తం 260 గ్రామపంచాయతీలకు గాను 2,366 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.

December 10, 2024 / 02:52 PM IST

ఉచిత పశువైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ నిర్వహించిన “ఉచిత పశువైద్య శిబిరమం” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శిబిరంలో పశువుల ఆరోగ్య పరీక్షలు, వ్యాధి నివారణ కోసం అవసరమైన వైద్య సేవలు మరియు సూచనలు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మరియు పశువుల యజమానులకు కలిగే ప్రయోజనాలను వివరించారు.

December 10, 2024 / 02:50 PM IST

తేజ సజ్జా సినిమాలో సీనియర్ హీరోయిన్

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబోలో ‘మిరాయ్’ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

December 10, 2024 / 02:50 PM IST

పాలస్తీనా సంఘీభావ సభను విజయవంతం చేయండి

AKP: ఈ నెల 12న గుంటూరులో జరిగే పాలస్తీనా సంఘీభావ సభను విజయవంతం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంస్థ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు ఎన్.భాస్కర్ కోరారు. మంగళవారం చోడవరం ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్ వద్ద ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ యుద్ధాన్ని ఆపాలని అనేక దేశాలు ప్రతిపాదించిన ఖాతరు చేయడం లేదన్నారు.

December 10, 2024 / 02:49 PM IST

‘వైసీపీ భూబకాసురులు వేల ఎకరాలు కబ్జా చేశారు’

AP: వైసీపీ భూబకాసురులు వేల ఎకరాలు కబ్జా చేశారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ప్రభుత్వ భూముల నుంచి దేవాదయ, అసైన్డ్ భూముల వరకు అన్నీ కొట్టేశారని అన్నారు. కుటమి ప్రభుత్వానికి వచ్చిన వాటిలో 68 వేల ఫిర్యాదులు భూకబ్జాలపైనే ఉన్నాయని తెలిపారు. కాకినాడ పోర్టు భూములను బెదిరింపులతో రూ.12 కోట్లకే కొట్టేశారని పేర్కొన్నారు.

December 10, 2024 / 02:46 PM IST

ఘనంగా ముగిసిన బేస్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు

JGL: జగిత్యాల జిల్లాలో నాలుగవ తెలంగాణ సీనియర్ ఉమెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. డిసెంబర్ ఏడవ తేదీ నుండి జరిగిన రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలలో 18 జిల్లాలు పాల్గొన్నాయి. ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎస్ దిలీప్ సెక్రటరీ స్పోర్ట్స్ కౌన్సిల్ జేఎన్టీయూ హైదరాబాద్ గోపాల్ పాల్గొన్నారు.

December 10, 2024 / 02:45 PM IST

‘సీఎం కప్ 2024 క్రీడా పోటీలను ప్రారంభించిన శ్యామల దేవి’

ADB: పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సీఎం కప్ 2024 క్రీడా పోటీలను అదనపు కలెక్టర్ శ్యామల దేవి మంగళవారం ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని పేర్కొన్నారు.

December 10, 2024 / 02:45 PM IST

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?: బొత్స

AP: రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రైతు భరోసా రూ.20 వేలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని స్పష్టం చేశారు. అయితే ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. దళారులు రైతులను దోచుకు తింటున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం ఆగదని చెప్పారు.

December 10, 2024 / 02:45 PM IST

అక్క కోసం తమ్ముడి వినూత్న ప్రదర్శన

AP: అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన అక్కను బ్రతికించుకునేందుకు ఓ తమ్ముడు వినూత్న రీతిలో ప్రదర్శన చేస్తున్నాడు. కడపకు చెందిన వెంకటేష్ అనే యువకుడి సోదరి SLE అనే అరుదైన వ్యాధి భారీన పడింది. దీంతో తనను కాపాడుకునేందుకు వెంకటేష్ టెడ్డీబీయర్ వేశంలో పవన్ కళ్యాణ్ ఫొటోను పట్టుకొని తన సోదరికి ఆర్థికంగా సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

December 10, 2024 / 02:43 PM IST

బుచ్చిబాబుని సత్కరించిన మాజీ ఛైర్మన్

VZM: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేశారు. ఈసందర్బంగా రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జాతీయ అధ్యక్షులు జంధ్యాల బుచ్చిబాబు వారికి ఘనంగా స్వాగతం తెలిపారు. ఈ మేరకు RBS జాతీయ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన బుచ్చిబాబుని వాళ్ళు దుస్సాలువాతో సత్కరించి అభినందించారు.

December 10, 2024 / 02:42 PM IST

మహాకుంభమేళా ఏర్పాట్లను పరిశీలించనున్న ప్రధాని

ఈ నెల 13న ప్రధాని మోదీ యూపీలోని ప్రయాగ్ రాజ్‌కు వెళ్లనున్నారు. మహాకుంభమేళా జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రయాగ్ రాజ్‌లో పర్యటించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సుందరీకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, ప్రధాని ప్రయాగ్ రాజ్‌లో సమీక్ష నిర్వహించనున్నారు.

December 10, 2024 / 02:41 PM IST

‘రేవంత్ రెడ్డిది ప్రజాకంటక పాలన’

NZB: రాష్ట్రంలో ప్రజా కంటకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మాజీ MLA నల్లమడుగు సురేందర్ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపు రేఖలను మార్చడాన్ని నాకు నిరసనగా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మంగళవారం గత తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాన్ని మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

December 10, 2024 / 02:41 PM IST