ELR: రైతులకు అండగా ఏలూరు జిల్లాలో వైసీపీ నేతలు పోరుబాట కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని స్థానిక పవర్పేట వైఎస్ఆర్ విగ్రహనికి జిల్లా నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
MHBD: కురివి వీరభద్ర స్వామి ఆలయాన్ని మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ సుధాకర్ ఈరోజు సందర్శించారు. ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా వీరభద్రస్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు ఇచ్చారు.
ఖమ్మం: మున్సిపల్ ఉద్యోగులు మనసు పెట్టి పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. నగారన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ ఉద్యోగులు మనసుపెట్టి విధులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయని అధికారులు ఇంటికి వెళ్లాల్సి వస్తోందని మంత్రి తుమ్మల హెచ్చరించారు.
KRNL: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కర్నూలులో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు ఎద్దుల బండ్లతో తరలివచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
AP: స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ‘స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ అద్భుతం. ఈరోజు ఏపీ భవిష్యత్కు దిశానిర్దేశం చేసిన రోజు. పరిపాలన అంటే ప్రజాభావం కూల్చివేయడం కాదు. ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి సీఎం చంద్రబాబు’ అని అన్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నేతల...
ELR: అన్నదాతకు అండగా వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరులో జరిగిన ధర్నాకు ఉంగుటూరు మండల వైసీపీ నాయకులు తరలి వెళ్లారు. మండల ఎంపీటీసీ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు ధర్నాలో మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయి లక్ష్మి, విజయలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KMM: బైండ్ల సామాజిక వర్గాన్ని ఎస్సీ-ఏ జాబితాలో చేర్చించాలని బైండ్ల భవనీయ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీమ్ అక్తర్ను ఖమ్మం కలక్టరేట్లో శుక్రవారం కలిసి వినతి పత్రం అందించారు. కమిషన్ ముందు జమిడిక వాయిద్యాలతో కళాప్రదర్శన చేశారు. బైండ్ల కులాన్ని సామాజికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయంగా వెనకబడిన కులంగా గుర్తించాలన్నారు.
MHBD: ఈ నెల 14 నుంచి హైదరాబాద్లో ఫుట్బాల్ మెగా టోర్నీ ‘సంతోష్ ట్రోఫీ’ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దానికి సంబంధించిన పోస్టర్లను దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు కాంగ్రెస్ ముఖ్య ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. వారిలో మహబూబాబాద్ ఎంపీ బాలరాం నాయక్ ఉన్నారు.
ASR: జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం పెదబయలు మండలంలో 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంచంగిపుట్టులో 12.4, అనంతగిరి, డుంబ్రిగుడ, గూడెం కొత్తవీధి మండలాల్లో 12.9, పాడేరు 13.2, హుకుంపేట 13.5, చింతపల్లి 13.9, కొయ్యూరు మండలంలో 16.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు.
ELR: ఈనెల 14వ తేదీన జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు స్థానిక సివిల్ జడ్జి కిషోర్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. చెక్కు బౌన్స్ కేసులు, నాటుసారా, ఎక్సైజ్, లిక్కర్ ఇతర కేసులు రాజీ చేసుకోవచ్చునని తెలిపారు. రాజీయే రాజమార్గమన్నారు.
KMM: కూసుమంచి మండల తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇంటి మోడల్ నమూనా నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి శంకుస్థాపన చేశారు. పేదవాడి ఇంటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఆయన వెంట కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉన్నారు.
BDK: 9వ మైలు తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో RMP వైద్యుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. కిష్టారానికి చెందిన లక్ష్మణ్ గురువారం రాత్రి ఇల్లందు నుంచి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో RMP తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: బంగాళాఖాతాలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండురోజులుగా భారీగా వర్షాలు కురవడం తెలిసిందే. సూళ్లూరుపేట బైపాస్ నుంచి బజారుకి వెళ్లే మార్గంలో మోకాలలోతు వర్షపునీరు రోడ్లపైనే ఆగడంతో ఆటోలు, ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు ఆ నీటిని క్లియర్ చేయాలనీ కోరారు.
NZB: చందూర్ మండల కేంద్రంలో నేడు బోధన్ RTO శ్రీనివాస్ వాహనదారులకు, ట్రాక్టర్ యజమానులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ రోడ్లపై ట్రాక్టర్ కేజీవీల్స్కు పట్టీలు లేకుండా నడపరాదని, నిబంధనలు అతిక్రమించి నడిపినట్లయితే రూ.30వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రోడ్లను కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు.
GDL: ఐజ పట్టణంలో శుక్రవారం కొత్త బస్టాండ్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్ లైన్ మెన్ కృష్ణయ్య గాయాలపాలయ్యాడు. కృష్ణయ్య ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఆర్టీసీ బస్సు వెనక టైరు ఆయనపైకి ఎక్కింది. దీంతో కాలు నుజ్జు నుజ్జు అయింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.