AP: విశాఖలో జరిగిన CII సమ్మిట్ తర్వాత ప్రపంచమే మనవైపు చూస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ‘విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో YCP నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గత ఐదేళ్లు ఉక్కు పరిశ్రమ కోసం YCP నేతలు ఏం చేశారు? కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాతే విశాఖ ఉక్కు కోసం కేంద్రప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చాం’ అని తెలిపారు.
BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అయ్యప్ప స్వాములకు సువర్ణావకాశం కల్పించింది. డిసెంబర్ 1న ఉదయం మాలధారణ స్వాములతో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పాల్గొనే భక్తులకు ఉచిత గర్భాలయ దర్శనం, ప్రసాదం సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఈవో వెంకట్రావు ఇవాళ ఆవిష్కరించారు.
TG: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పరిపాలన విభాగంలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 32 మంది IPSలను బదిలీ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం కలెక్టర్ల బదిలీలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాగా, మరో రెండు రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.
WNP: గత ప్రభుత్వం విద్యాశాఖను భ్రష్టు పట్టించిందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. కొత్తకోటలోని జడ్పీ హైస్కూల్లో శనివారం విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యాశాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నమన్నారు. స్టూడెంట్స్కు అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆన్నారు.
NGKL: జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమంపై శనివారం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దిశానిర్దేశం చేశారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా నిర్వహించాలని జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
NZB: మొక్కజొన్న డబ్బులను వెంటనే చెల్లించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆర్మూర్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మొక్కజొన్న మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ఇప్పటికే సుమారు నెలరోజులు గడిచిపోయినా రైతుల ఖాతాల్లో మొక్కజొన్న డబ్బులు వేయకపోవడం విచారకరమన్నారు.
ATP: గుంతకల్లు-హిందూపురం-గుంతకల్లు మధ్య తిరిగే ప్యాసింజర్ రైళ్లను ఒకరోజు దారి మళ్లించి నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీఆర్వో శ్రీధర్ శనివారం తెలిపారు. పాత కొత్తచెరువు స్టేషన్లో జరుగుతున్న మరమ్మతుల కారణంగా నవంబర్ 26న ఒక్కరోజు హిందూపురం వెళ్లే ప్యాసింజర్ రైలు గుళ్య పాలెం, వెంకటాంపల్లి మీదుగా ప్రయాణిస్తుంది. ఈ మార్పును ప్రయాణికులు గమనించాలని కోరారు.
KMM: బోనకల్ మండల కేంద్రంలో శనివారం ఇందిరమ్మ మహిళా డైరీ గ్రౌండ్ బ్రేకింగ్, గ్రౌండ్ లెవెలింగ్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అలాగే మధిర నియోజకవర్గానికి చెందిన ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు. మహిళలను ఆర్థికంగా ఎదగాలని ప్రోత్సాహం కాంగ్రెస్ పార్టీ అందజేస్తుందని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
NLR: కావలి మండలం ముసునూరులోని మందాడి చెరువు నీటిలో సుమారు 35-45 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహం లభ్యమయింది. దీనిపై గ్రామ వీఆర్వో P. శ్రీనివాసులు కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కావలి రూరల్ ఎస్సై బాజిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
MNCL: పీడీఎస్యూ చెన్నూర్ ఏరియా నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నట్లు జిల్లా ఉపాధ్యక్షుడు పి. సికిందర్ తెలిపారు. అధ్యక్షుడిగా టి. రాహుల్, ప్రధాన కార్యదర్శిగా కె.సాయితేజ, ఉపాధ్యక్షుడిగా జి.రామ్, సహాయ కార్యదర్శిగా కేవీ చారి, కోశాధికారిగా దుర్గాప్రసాద్, సభ్యులుగా అవినాష్, ముకేశ్, సౌమ్య, సింధూజ, సాహిత్య ఎన్నికైనట్లు పేర్కొన్నారు.
GDL: ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ డీసీఎం టైరు పగలడంతో ప్రమాదవశాత్తు శనివారం బోల్తా పడింది. మహారాష్ట్ర నుంచి తాడిపత్రికి వెళ్తున్న ఈ డీసీఎం రైలింగ్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. లారీలో ఉన్న డ్రైవర్ అష్రఫ్, మరో డ్రైవర్ ఖాదర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
TG: ఐబొమ్మ రవిని స్వయంగా సీపీ సజ్జనార్ విచారిస్తున్నారు. ఇందులో కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. కాగా రవిపై ఫారినర్స్ యాక్ట్ కేసు జోడించారు. రవి ప్రస్తుతం కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరుడు. రికార్డుల ప్రకారం భారత పౌరుడు కాదు. అందుకే ఈ కేసు పెట్టారు.
VKB: కొడంగల్ పోస్ట్ ఆఫీసులో ఆధార్ సేవలు ప్రారంభం అయ్యాయి. తపాల కేంద్రాల్లో ఆధార్ నమోదు, అప్డేట్ వంటి సేవలను అందించడం ద్వారా ప్రజలకు సమయం, ఖర్చు రెండు ఆదా అవుతాయని MBNR డివిజన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పేరు, పుట్టిన తేదీ, చిరునామాలో తప్పులు ఉంటే PAN CARD, SSC మెమో, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.
PDPL: ఓదెల మండలానికి చెందిన క్యాతం అనుశ్రీ – సంతోష్ దంపతులు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 5 లక్షల సహాయంతో తమ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. వారి కొత్త గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
కృష్ణా: పెనమలూరులోని గ్రీన్ స్కూల్లో విద్యా మహోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివి, క్రమ శిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన అభినందించారు.