• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

T20 WCలో చరిత్ర సృష్టించిన బుమ్రా

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో బుమ్రా మూడు వికెట్లతో చెలరేగి అరుదైన రికార్డు సృష్టించాడు. T20 WC చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా (33) అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అశ్విన్ (32) పేరిట ఉండగా, బుమ్రా దానిని అధిగమించాడు. మరోవైపు, ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ (32) కూడా రెండో స్థానంలో నిలిచాడు.

February 22, 2026 / 09:02 PM IST

మంచి మనసు చాటుకున్న మంత్రి సవిత

సత్యసాయి: రొద్దం మండలం కోగిర గ్రామానికి చెందిన ప్రశాంతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి సవిత తక్షణమే స్పందించారు. బాధితురాలి వైద్య ఖర్చుల నిమిత్తం ఆదివారం రూ. 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా కల్పించారు.

February 22, 2026 / 09:00 PM IST

ముగిసిన రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు

SDPT: చిన్నకోడూర్ మండలం చంద్లపూర్ రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై రెండు రోజుల పాటు సాగిన ‘సీఎం కప్’ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటనర్సయ్య పాల్గొని విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. నైపుణ్యం గల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 09:00 PM IST

అమ్మాయిలకు బ్యాడ్ బాయ్స్ ఎందుకు ఇష్టం..?

సైకాలజీ ప్రకారం బ్యాడ్ బాయ్స్ అతి ఆత్మవిశ్వాసంతో వారికి నచ్చినట్టు ఉంటారు. ఇది కొంతమంది అమ్మాయిలకు బలమైన వ్యక్తిత్వంలా కనిపిస్తాయి. బ్యాడ్ బాయ్స్‌తో ఉండటం అమ్మాయిలకు ఊహించని అనుభవంగా ఉంటుంది. అమ్మాయిల ప్రవర్తనలో అనిశ్చితి, రిస్క్, థ్రిల్ ఉంటాయి. కానీ ఈ ఆకర్షణ శాశ్వతంగా ఉండదని.. జీవిత అనుభవాలు పెరిగే కొద్దీ అమ్మాయిలు భద్రత, గౌరవం కోరుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

February 22, 2026 / 09:00 PM IST

పలు లాడ్జీలను తనిఖీ చేసిన సీఐ

VZM: బొబ్బిలి గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధి రామభద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలు లాడ్జీలను సీఐ ఎస్.శ్రీనివాస్, సిబ్బందితో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని నిర్వాహకులను హెచ్చరించారు. ఖచ్చితమైన ఆధారాలు తీసుకొని ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద వస్తువులు ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు.

February 22, 2026 / 08:59 PM IST

పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ

ASR: పీఎం ఉష పథకంలో భాగంగా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు పుట్టగొడుగుల పెంపకంపై 15 రోజుల పాటు ఇచ్చిన శిక్షణ ఆదివారంతో ముగిసిందని ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి తెలిపారు. సీఎంఎస్ లేబొరేటరీస్, పీఎం ఉష కోఆర్డినేటర్ డాక్టర్ టీఎన్ రసూల్ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారన్నారు. మొదటి బ్యాచ్ గా 30 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామన్నారు.

February 22, 2026 / 08:58 PM IST

‘గ్రామస్థాయిలో సేవాలాల్ జయంతి నిర్వహించాలి’

BDK: ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం బంజారా సర్పంచ్లతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఈనెల 28న నియోజకవర్గంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయిలో కూడా జయంతిని నిర్వహించాలని కోరారు.

February 22, 2026 / 08:58 PM IST

వరల్డ్ కప్ ట్రోఫీతో సుందర్ పిచాయ్

అహ్మదాబాద్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో కలిసి ఆయన T20 ప్రపంచకప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న పిచాయ్.. ఈ విధంగా క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

February 22, 2026 / 08:58 PM IST

వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: అధికారులు

BHPL: రేగొండ మండలంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, సబ్సిడీలకు అర్హత పొందుతారని పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా సంబంధిత AEO వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 08:55 PM IST

ప్రశాంతంగా గురుకులాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్

ADB: ఇంద్రవెల్లి మండలం పాటగూడలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకులాల కామన్ ఎంట్రన్స్ టెస్టు ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ పరీక్షకు విద్యార్థులు 219 మంది విద్యార్థులు హాజరైనట్లు.. 21 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.

February 22, 2026 / 08:55 PM IST

ఇర్రిపాక జంక్షన్లో తప్పిన పెను ప్రమాదం

KKD: జగ్గంపేట మండలం ఇర్రిపాక – మర్రిపాక రోడ్డు జంక్షన్లో ఆదివారం సాయంత్రం ధాన్యం లోడుతో వెళ్తున్న ఐసర్ వ్యాన్ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. భారీ గోతులే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

February 22, 2026 / 08:53 PM IST

‘దళిత జాతి శ్రేయస్సు కోసం కృషి’

కరీంనగర్ పట్టణ కేంద్రంలోని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మహేందర్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గ్రామ స్థాయిలో బలోపేతం,నిర్మాణం, నిమ్నవర్గాల అభివృద్ధి కోసం పలు అంశాల గురించి చర్చించారు. రాబోయే రోజుల్లో దళితజాతి శ్రేయస్సు కోసం కార్యక్రమాలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

February 22, 2026 / 08:51 PM IST

రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే..!

గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి అద్భుత ఔషదంగా పనిచేస్తుంది. ఇది BP నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ అనే పదార్థం గుండె ధమనులలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా లేదా వేయించి తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

February 22, 2026 / 08:50 PM IST

BREAKING: భారత్ టార్గెట్ ఎంతంటే..?

టీమిండియాతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా 187/7 పరుగులు చేసింది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ SAను బ్రెవిస్(45), మిల్లర్(63) ఆదుకున్నారు. స్టబ్స్ 44 పరుగులు చేశాడు. ఒక దశలో 12 ఓవర్లలో 117/4 పరుగులతో భారీ స్కోరు చేసేలా కనిపించినా, డెత్ ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అడ్డుకున్నారు. బుమ్రా 3, అర్ష్‌దీప్ 2 వికెట్లు పడగొట్టారు. టార్గెట్: 188

February 22, 2026 / 08:49 PM IST

CM రేవంత్‌కు అరుదైన ఆహ్వానం

TG: CM రేవంత్ రెడ్డి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా హార్వర్డ్ కెనడీ స్కూల్ నుంచి ఆయనకు అధికారిక లేఖ వచ్చింది. మార్చి 27న హార్వర్డ్ క్యాంపస్‌లో నిర్వహించే AI పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని అందులో పేర్కొన్నారు. దీంతో భారత్ నుంచి ఆహ్వానం పొందిన ఏకైక సీఎంగా రేవంత్ నిలిచారు.

February 22, 2026 / 08:48 PM IST