SKLM: మున్సిపల్ కార్మికులకు పెంచిన మస్టర్ పాయింట్లను తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గతంలో ఉన్న మూడు మస్టర్ పాయింట్ల స్థానంలో 5 మస్టర్ పాయింట్లుగా పెంచడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
JGL: వెల్గటూర్ మండలం జగదేవ్పేట -చర్లపల్లి ప్రధాన రహదారి గుంతలు పడి నరకప్రాయంగా మారింది. రహదారిపై అడుగడుగునా పెద్ద పెద్ద గుంతలు, రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలు పెరిగి ఇబ్బందిగా మారిందని ప్రజలు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుపై గుంతలు పూడ్చి, రోడ్డుకి ఇరువైపులా పొదలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర శుద్ధ త్రయోదశి సందర్భంగా హనుమద్ వ్రతం కార్యక్రమం సామూహికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పూజలు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కడప: వేముల పోలీస్ స్టేషన్ వద్ద మీడియా ప్రతినిధులను పరామర్శించడానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం: నగరంలో శుక్రవారం జరుగుతున్న రైతు పోరాటానికి మద్దతుగా వైసీపీ శ్రేణులు పామిడి నుంచి భారీగా తరలి వెళ్లారు. పామిడితో పాటు మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలివెళ్లారు. జై జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ వాహనాల్లో బయలుదేరారు.
బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీలపై దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా పార్లమెంట్లో విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అక్కడి మైనారిటీల భద్రతకు చర్యలు తీసకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
చిత్తూరు: బి. కొత్తకోట పట్టణానికి చెందిన టీడీపీ నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కో-కన్వీనర్ కుడుము శ్రీనివాసులు సోదరుడు ఉదయ్ కుమార్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. ఉదయ్ కుమార్ మృతికి పలువురు కూటమి నాయకులు, స్థానిక ప్రజలు సంతాపం తెలియజేసారు. ఉదయ్ కుమార్ ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటన్నారు.
కాకినాడ: మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు కాకినాడలో శుక్రవారం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రైతాంగ సమస్యలకు వ్యతిరేకంగా పోరుబాట చేపట్టినట్లు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, ముద్రగడ పద్మనాభం, దవులూరి దొరబాబు, తదితరు నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ధర్నాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిత్తూరు: అప్పుల బాధ తాళలేక రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ములకలచెరువు మండలంలో జరిగింది. ఎస్సై నరసింహుడు కథనం మేరకు.. ములకలచెరువు మండలం చీకిచెట్టుపల్లికి చెందిన బైరెడ్డి టమాట పంట సాగులో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో చేసిన రూ. 6 లక్షల అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి లోనై పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మర్దానీ 3’. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఈ సినిమాను అభిరాజ్ మినావాలా తెరకెక్కిస్తున్నారు. ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
AP: విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలని సీఎం సూచించారు. పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులతో సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడారు. కాగా, ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రంలో...
ADB: మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆదివాసి తుడుందెబ్బ రాష్ట్ర కన్వీనర్ గోడం గణేష్ అన్నారు. పట్టణంలోని కొమరం భీం కాలనీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు మోహన్ బాబు వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ఆయనే ఖర్చులు భరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
VZM: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు విజయనగరంలో వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ జరిగింది. జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు స్థానిక మున్సిపల్ కంటోన్మెంట్ నుంచి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లారు.
ATP: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ పుట్టపర్తిలోని కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా పోలీసులు కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. శ్రీ సత్యసాయి జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.
AP: సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్కు పోలీసు కస్టడీ విధించారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన్ని కస్టడీకి తీసుకోనున్నారు. ఈ మేరకు గుంటూరు జైలులో ఉన్న అతని వద్దకు ఒంగోలు పోలీసులు వెళ్లారు. జీజీహెచ్లో విజయ్ పాల్కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం విజయ్ పాల్ను ఒంగోలుకు తీసుకెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన్ని విచారించనున్నారు.