W.G: భీమవరం జిల్లా టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ.. గత 5 సంవత్సరాల్లో తిరుమల లడ్డూలు కల్తీ జరగలేదని వైసీపీ నాయకులు అనడం లేదని అన్నారు. పూర్తిస్థాయిలో కల్తీ జరిగిందని అన్నారు. మాజీ సీఎం గుడికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ కూడా ఇవ్వరని విమర్శించారు.
NRPT: బీసీల ఐక్యతకు కమ్యూనిటీ భవనాలు ఎంతో కీలకమని రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి మత్స్య యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఆదివారం మక్తల్ సిద్ధాంతిలో నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ల అభ్యున్నతి కోసం సర్కారు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
KRNL: ప్రభుత్వం తరఫున ఏజీపీగా నియమించడంతో నిబద్ధతతో ప్రజలు, ప్రభుత్వానికి సేవలు అందించాలని MLA బీవీ జయనాగేశ్వరరెడ్డి సూచించారు. ఏజీపీగా ఎంపికైన రషీదుల్లా, న్యాయవాదులు ఆదివారం MLA బీవీని సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వృత్తి పట్ల అంకితభావంతో పని చేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైనప్పుడుల్లా సేవలు అందించి మన్ననలు పొందాలన్నారు.
W.G: వేములదీవికి చెందిన లక్ష్మీ భవానీకి, కొత్తోట చెందిన కొపనాతి మణికంఠ నాగరాజుతో 2020 మే 13న వివాహం జరిగింది. లక్ష్మి భవానిని అదనపు కట్నం తేవాలని అత్త సత్యవతి, మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 23న వారంతా కలిసి లక్ష్మిపై దాడి చేసి, అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధించారు. బాధితురాలు లక్ష్మి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కృష్ణా: కొడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉల్లిపాలెంలో పోలీసులు ఆదివారం మెరుపు దాడులు నిర్వహించారు. జూదం జరుగుతున్నదన్న సమాచారంతో SI కె. చాణక్య ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,070ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
KMM: చింతకాని మండలం చిన్నమండవ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ పర్చ రామచంద్రరావు ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్ను కోరారు. ఏపీ వత్సవాయి మండలం పోలంపల్లి ప్రాంతం నుంచి ఖమ్మంకు బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోతాయని, ముఖ్యంగా ఇంటర్మీడియట్, పదవ తరగతి విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు.
AKP: జిల్లాలో 34 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఐఈఓ ఎం.వినోద్ బాబు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సోమవారం జరిగే మొదటి సంవత్సరం పరీక్షలకు 13,153 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో గల అన్ని రూమ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామన్నారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభం కానున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి యధావిధిగా పంటల కొనుగోలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. రైతులు నాణ్యమైన సరుకు తీసుకువచ్చి మద్దతు ధర ఉండాలని అధికారులు సూచించారు.
VSP: సిటీ పోలీస్ కమిషనరేట్లో ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్కు విన్నవించుకోవచ్చు. అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారం చూపిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల సమస్యలకు తక్షణ స్పందనకోసమే అని చెప్పారు.
ADB: కడెం మండలం దోస్త్ నగర్ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు ఆదిలాబాద్ బొక్కలగూడకు చెందిన సయ్యద్ నసీరుద్దీన్గా గుర్తించారు. అతను మంచిర్యాలలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నిర్మల్లో నివాసం ఉంటున్నారు.
KRNL: కోడుమూరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుడు షేక్ షాకీర్, అతని భార్య షేక్ సలీమాకు ఆదివారం కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి రూ. 4,95,699/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. పసుపుల ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు CM చంద్రబాబు , KDCC ఛైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు.
HYD: అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్ నగర్లోని ఆర్టీసీ హైదరాబాద్-2 డిపో నుంచి ప్రత్యేక బస్సు నడపనున్నట్లు మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. మార్చి 1వ తేదీన రాత్రి 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. తిరిగి నాలుగవ తేదీన బస్సు హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. భక్తులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ కోరారు.
SKLM: ఇవాళ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో సీసీ కెమెరాల నిఘా నడుమ పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఐవో సురేష్ కుమార్ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కాగా, 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు.
AKP: మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు. ఆదివారం అనకాపల్లి పూడిమడక రోడ్డులో ఎన్టీఆర్ అభిమానులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ధృవతారగా వెలిగిన ఎన్టీఆర్ కారణజన్ములని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలన్నారు.
MDK: టేక్మాల్ మండలం బోడగట్టు సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కమ్మరికత్త, సూరంపల్లి, వేల్పూగొండ తదితర గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ ఉదయ్ భాస్కర్, ఏడీఈ వెంకటేశ్వరరావు తెలిపారు వినియోగదారులు గమనించి సహాకరించాలని కోరారు.