MNCL: జన్నారం మండలంలోని రైతులు వ్యవసాయ అధికారుల సలహాలను పాటించాలని మండలంలోని క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలో రెండు రోజులుగా మబ్బు పట్టిన వాతావరణం ఉందన్నారు. రైతులు వేసిన పంటలు ఎదుగుదశలో ఉన్నాయని, మబ్బు పట్టడంతో చల్లటి వాతావరణం ఉంటుందన్నారు. ఈ సమయంలో పంటలకు వివిధ తెగులు సోకే ప్రమాదం ఉందని, వాతావరణ మార్పులను గమనించాలన్నారు.