• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పేకాట ఆడేవారిని పట్టించిన వ్యక్తికి రూ.67వేల రివార్డ్.!

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర 2 రోజుల జైలు శిక్ష విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.1,35,000 స్వాధీనం చేసుకున్నారు. అందులోని రూ.67,500 నగదు పేకాట ఆడుతున్నవారిని పట్టించిన వ్యక్తికి రివార్డుగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలని పేర్కొన్నారు.

November 25, 2025 / 07:32 AM IST

GD నెల్లూరులో గణనీయంగా తగ్గిన ఫిర్యాదులు

CTR: GDనెల్లూరులో రెవెన్యూ ఫిర్యాదులు గణనీయంగా తగ్గినట్లు తహశీల్దారు శ్రీనివాసులు పేర్కొన్నారు. 5 నెలల క్రితం ప్రతి సోమవారం దాదాపు 25కు పైగా ఫిర్యాదులు అందేవని, ఇప్పుడు ఆ సంఖ్య 5కు తగ్గిందన్నారు. మండల స్థాయి రెవెన్యూ సమస్యలను అక్కడే పరిష్కరించాలన్న కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలతో ఈ ఫలితాలు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

November 25, 2025 / 07:31 AM IST

వాలంటీర్లపై మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

NLR: వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని జగన్‌కు సలహా ఇస్తానని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కొడవలూరు(M) తాటాకులదిన్నెలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో వాలంటీర్లు 50 శాతం మంది మాత్రమే తమకు పని చేశారని, మిగతావాళ్లు రూ. 20 వేలకు అమ్ముడుపోయారని ఆరోపించారు. వాలంటీర్లను నమ్ముకుని కార్యకర్తలను దూరం చేసుకుని నష్టపోయామన్నారు.

November 25, 2025 / 07:30 AM IST

‘దేశ ఐక్యతకు సర్దార్ పటేల్ కృషి ఎనలేనిది’

NRPT: దేశ ఐక్యతకు అందరం కృషి చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతోత్సవాల్లో భాగంగా పట్టణంలో నిర్వహించిన 4కేరన్‌లో ఆమె పాల్గొన్నారు. దేశంలోని గొప్ప నాయకుల్లో పటేల్ ఒకరని, దేశాన్ని ఏకం చేయడంలో ఆయన కృషి ఎనలేనిదని కలెక్టర్ కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా జయంతి ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు.

November 25, 2025 / 07:30 AM IST

సమాచార నిరాకరణ.. అవినీతి ఆరోపణలు

MDK: చిన్నశంకరంపేట మండలం చందంపేట పీఏసీఎస్ కార్యాలయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై వివాదం చెలరేగింది. ఐదేళ్ల లెక్కలు కోరుతూ మాజీ వార్డు సభ్యులు కుమ్మరి ప్రవీణ్ కుమార్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సీఈఓ పాషాకు దరఖాస్తు చేశారు. అయితే, “ఆర్టీఐ చట్టం సొసైటీలకు వర్తించదు” అంటూ సీఈఓ ఆ దరఖాస్తుపై రాసివ్వడం విమర్శలకు తావిచ్చింది.

November 25, 2025 / 07:28 AM IST

దళారులను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవు: సీపీ

HYD: పైరవీలతో సంబంధం లేకుండా బాధితులకు నేరుగా సేవ చేయాలని HYD సీపీ సజ్జనార్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా కేసు విషయంలో ముందు నిర్లక్ష్యంగా వ్యవహరించి దళారుల ఎంట్రీ తర్వాత చర్యలు ఉన్నట్లు తెలిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న దళారుల కదలికలపై కన్నేసి ఉంచేలా మార్గదర్శకాలు జారీ చేశారు. దళారులను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవన్నారు.

November 25, 2025 / 07:27 AM IST

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: మంత్రి

BHPL: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయ మాడవీధుల ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయని, ఐనవోలు, కొమురవెల్లి సహా అన్ని ఆలయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టామన్నారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

November 25, 2025 / 07:26 AM IST

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయని జనరేటర్లు

SRPT: విద్యుత్ కోతల సమయంలో పనులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం మోతే తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు అందించిన జనరేటర్లు నిరుపయోగంగా మారాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అప్పగించిన తర్వాత, అధికార యంత్రాంగం వీటిని ఉపయోగించకపోవడంతో కొన్ని యంత్రాలకు తుప్పు పట్టింది. ఉన్నతాధికారులు స్పందించి వాటిని వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

November 25, 2025 / 07:25 AM IST

తిరుపతి కమిషనర్ మౌర్యకు 31 ఫిర్యాదులు

TPT: నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 31 వినతులు అందాయని కమిషనర్ మౌర్య తెలిపారు. 23 మంది ప్రత్యక్షంగా, 8 మంది ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారన్నారు. చెత్త సమస్యలు, విద్యుత్ స్తంభాల మార్పిడి, డ్రైనేజ్ లీకేజీలు, అక్రమ నిర్మాణాల నియంత్రణ, టిడ్కో ఇళ్ల కేటాయింపు, టీడీఆర్ బాండ్ల మంజూరుపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.

November 25, 2025 / 07:24 AM IST

లింగ సమానత్వానికి కృషి చేయాలి: కలెక్టర్

KRNL: సమాజంలో లింగ సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “జెండర్ సమానత్వం” జాతీయ ప్రచార పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా “నయీ చేతన 4.0 – మార్పు కోసం ముందడుగు” పేరుతో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు.

November 25, 2025 / 07:23 AM IST

రైతన్న మీకోసం కరపత్రాలు విడుదల

PPM: రైతన్నా మీకోసం, రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కరపత్రాలను జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది కలెక్టర్ కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ ఉద్యానవనపై అందిస్తున్న సాయాన్ని అర్థమయ్యేలా రైతులకు తెలియజేయాలన్నారు.

November 25, 2025 / 07:22 AM IST

నిడదవోలు రానున్న Dy.CM పవన్ కళ్యాణ్

E.G: నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకలకు Dy. CM పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ సోమవారం ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన నిడదవోలు మున్సిపాలిటీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గణపతి సెంటర్‌లో జరిగే ఈ వేడుకకు పవన్ వస్తారని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

November 25, 2025 / 07:21 AM IST

కార్మికులు బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

MDK: జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక భీమా పెంపు పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికుల బీమా పెంపు సదస్సులు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 8 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు సహజ మరణం సంభవిస్తే ఒక లక్ష నుంచి రూ.2లక్షల వరకు పెంచినట్లు తెలిపారు.

November 25, 2025 / 07:21 AM IST

పాఠశాలలో ఉచిత బోట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

JGL: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అభ్యర్థన మేరకు, చెస్ నెట్వర్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోరుట్ల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఉచిత చెస్ బోర్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామీణ విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగ ఉండి, చెస్ ద్వారా మానసిక అభివృద్ధి, ఏకాగ్రత పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

November 25, 2025 / 07:20 AM IST

కరపలో డ్రోన్లతో నిఘా

KKD: కరప మండల పరిధిలోని గురజనాపల్లి, కరప మెయిన్ రోడ్డులలో సోమవారం రాత్రి SIT సునీత ఆధ్వర్యంలో పోలీసులు డ్రోన్లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా గంజాయి బ్యాచ్ తిరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిఘా నిర్వహించారు. నేర కదలికలను గుర్తించేందుకు డ్రోన్లను ఎగరవేసి పరిశీలించారు.

November 25, 2025 / 07:20 AM IST