కృష్ణా: విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న రీజనల్ పాలీటెక్ ఫెస్ట్-2024ను టీడీపీ MLA పరుచూరి అశోక్ బాబు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలు తిలకించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడారు. విద్యార్థులలో ఆలోచన శక్తి, నైపుణ్యం పెంచే దిశగా పాలీటెక్ ఫెస్ట్ దోహదపడుతుందన్నారు.
నిజామాబాద్: ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో నేడు నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము గతవారం రిలే దీక్షలు చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. సమస్యలు పరిష్కారించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అన్నమయ్య: వాల్మీకి , బోయల అభివృద్ధికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లు మండెం ప్రభాకర్, నల్లబోతుల నాగరాజులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం మదనపల్లె పట్టణంలో నూతన డైరెక్టర్లను వాల్మీకి మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్త రాశి హరికృష్ణ, తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్టీ సాధన కోసం కృషి చేయాలని వారు కోరారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు నూక మల్లికార్జునరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. మల్లికార్జునరావు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు భావిస్తున్నారు. అతడిపై గతంలో విశాఖలో కేసు నమోదైనట్లు గుర...
కృష్ణా: కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిండా ముంచేసిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు అన్నారు. మంగళవారం విజయవాడలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో భాదుడు మొదలుపెట్టిందని విమర్శించారు.
NLG: శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రేపు ఒక్కరోజు అయ్యప్ప మాలధారణ భక్తులకు ఉచిత దర్శనం అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్పమాల వేసుకున్న భక్తులు రేపు ఉదయం 6గంటలకు సామూహిక గిరి ప్రదక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు, గిరి ప్రదక్షణ చేసిన భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రసాదాన్ని అందజేయనున్నట్లు ఈవో స్పష్టం చేశారు.
కామారెడ్డి: నూతనంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా చింతల లింగం, జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డిని జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారికి రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ లక్ష్మి, విజయ శ్రీ, తృప్తి శ్రీనివాస్, హరి సింగ్, నరేందర్, గోపి, శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
NLR: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా కావలి నియోజక వర్గానికి చెందిన బీద మస్తాన్ రావు మంగళవారం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో బీద మస్తాన్ రావును కోవూరు టీడీపీ నేత, నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
AP: మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడి జరుగుతుందని AISF వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని AISF జాతీయ కార్యదర్శి శివారెడ్డి ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఫీజుల దోపిడీపై మంచు మనోజ్ స్టేట్మెంట్ను సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థి నుంచి ప్రతి ఏటా రూ. 20వేలు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. ప్రశ్నించినవారిపై దాడులు చేస్తున్నారని పేర్క...
SKLM: మెడికవర్డ్ కార్డుతో మీరు ఎక్కడ ఉన్నా, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందని డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం మెడికవర్డ్ హాస్పిటల్లో ఫ్యామిలీ కార్డును ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు.
NLR: సంగం మండలం జెండాదిబ్బ గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకుడు సూరాయిపాలెం పవన్ కుమార్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి చిత్రపటాన్ని బహుకరించారు. కాకినాడకు చెందిన త్రెడ్డింగ్ ఆర్టిస్టు ద్వారా 240 శీలలు, ఏడు కిలోమీటర్ల దారం, 4500 లైన్లతో ఆనం రూపాన్ని చిత్రీకరించి మంగళవారం నెల్లూరులోని ఆయన నివాసంలో నాయకుల సమక్షంలో బహుకరించారు.
KKD: రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ కోరారు. పెద్దాపురం మండలం గోరింటలో మంగళవారం కలెక్టర్ రెవెన్యూ సదస్సులు ప్రారంభించారు. ప్రజల భూ సమస్యలను వీటి ద్వారా పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణి, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సూరిబాబు రాజు, అధికారులు పాల్గొన్నారు.
SRCL: జిల్లా కొనరావుపేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వం నమోదు కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అంగురి రంజిత్ గారు మాట్లాడుతూ.. చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
AP: అధికారం కోసం పార్టీ మారలేదని బీద మస్తాన్రావు అన్నారు. ప్రజలు తిరస్కరించిన వైసీపీకి రాజీనామా చేశానని తెలిపారు. బీసీ నేతగా గుర్తించి టీడీపీ రాజ్యసభకు పంపుతోందన్నారు. రాష్ట్ర భవిష్యత్ చంద్రబాబుతోనే ముడిపడి ఉందని చెప్పారు. 42 ఏళ్ల తన రాజకీయ చరిత్రలో 39 ఏళ్లు టీడీపీలోనే ఉన్నానని.. ఇక భవిష్యత్ టీడీపీతోనేనని స్పష్టం చేశారు.
ELR: ఈనెల 13, 14, 15వ తేదీల్లో బుట్టాయిగూడెంలో జరుగుతున్న సీపీఎం 25వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ కోరారు. మంగళవారం పెదపాడులోని నర్రా ఆంజనేయులు భవనం వద్ద సీపీఎం 25వ జిల్లా మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. 13వ తేదీన బుట్టాయిగూడెంలో సీపీఎం బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.