AP: గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్రంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఏబీపీ అమలుకు రూ.2,432 కోట్ల విడుదలకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఏబీపీ కోసం ఏపీబీఐఎల్ పేరుతో ఎస్పీవీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిజిటల్ భారత్ నిధి-ఏపీ అంగీకారంతో నిధులిచ్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు చేపట్టనుంది.