చిత్తూరు: అప్పుల బాధ తాళలేక రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ములకలచెరువు మండలంలో జరిగింది. ఎస్సై నరసింహుడు కథనం మేరకు.. ములకలచెరువు మండలం చీకిచెట్టుపల్లికి చెందిన బైరెడ్డి టమాట పంట సాగులో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో చేసిన రూ. 6 లక్షల అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి లోనై పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మర్దానీ 3’. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఈ సినిమాను అభిరాజ్ మినావాలా తెరకెక్కిస్తున్నారు. ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
AP: విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలని సీఎం సూచించారు. పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులతో సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడారు. కాగా, ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రంలో...
ADB: మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆదివాసి తుడుందెబ్బ రాష్ట్ర కన్వీనర్ గోడం గణేష్ అన్నారు. పట్టణంలోని కొమరం భీం కాలనీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు మోహన్ బాబు వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ఆయనే ఖర్చులు భరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
VZM: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు విజయనగరంలో వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ జరిగింది. జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు స్థానిక మున్సిపల్ కంటోన్మెంట్ నుంచి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లారు.
ATP: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ పుట్టపర్తిలోని కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా పోలీసులు కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. శ్రీ సత్యసాయి జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.
AP: సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్కు పోలీసు కస్టడీ విధించారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన్ని కస్టడీకి తీసుకోనున్నారు. ఈ మేరకు గుంటూరు జైలులో ఉన్న అతని వద్దకు ఒంగోలు పోలీసులు వెళ్లారు. జీజీహెచ్లో విజయ్ పాల్కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం విజయ్ పాల్ను ఒంగోలుకు తీసుకెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన్ని విచారించనున్నారు.
AKP: నాతవరం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎల్ఎస్ డీజీఎస్ కార్యాచరణ ప్రణాళికలపై సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు రెండో రోజు శుక్రవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో మెరుగైన వైద్యం, పారిశుద్యం, సురక్షిత మంచినీరు, గ్రామాల్లో అభివృద్ధి పనుల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
JGL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. పెద్దూరి రాజయ్య(55) లాండ్రీ షాప్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. శుక్రవారం ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
MNCL: జన్నారం పట్టణంలోని అటవీశాఖ ఎఫ్డిఓ కార్యాలయం ఫర్నిచర్ను కోర్టు ఆదేశాల మేరకు సిబ్బంది జప్తు చేశారు. బియ్యాల లింగన్న అనే కాంటాక్ట్ కార్మికున్ని అధికారులు గతంలో తొలగించారు. ఆయన కోర్టును ఆశ్రయించడంతో విధులలోకి తీసుకుని వేతనం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారులు పట్టించుకోకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు కార్యాలయ ఫర్నిచర్ను సిబ్బంది జప్తు చేశారు.
TG: తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజిట్ ఇవ్వడం దారుణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ‘దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకుంటాం. జీవో ఇస్తేనే ప్రాణత్యాగాలు చేసిన వారి విగ్రహాలు పెడతామా’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది తెలంగాణ వాదం కాదు.. కాంగ్రెస్ వాదమని విమర్శించారు. వారికి కాంగ్రెస్ ప్రయోజనాలే తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవని మండ...
SKLM: సరుబుజ్జిలి మండలంలో రేపు శనివారం 10 నీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నట్లు తహసీల్దార్ మధుసూదన తెలిపారు. వీటిలో యరగాం, పురుషోత్తపురం, రోట్టవలస, సుభద్రాపురం, డకరవలస, కొత్తకోట, సరుబుజ్జిలి, తేలికిపెంట మేజర్ నీటి సంఘాలకు, వెన్నెలవలస, తాటికొండ మైనర్ నీటి సంఘాలకు 108 టీసీలకుగాను ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
NGKL: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల, బాలికల జట్టు ఎంపిక జరుగుతుందని జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ నెల 15న కల్వకుర్తి CBM కళాశాల క్రీడా మైదానంలో ఉదయం 8 గంటలకు నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి గల క్రీడాకారులు ఎంపికలో పాల్గొనాలని ఆయన కోరారు.
WGL: కప్ పోటీల్లో భాగంగా గూడూరు మండలంలో మస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. పురుషుల కబడ్డీలో దామరవంచ టీంకి ప్రథమ స్థానం రాగా, గూడూరు టీం ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే మహిళల విభాగంలో గూడూరు ప్రథమ స్థానంలో నిలవగా, అయోధ్యపురం టీం ద్వితీయ స్థానంలో నిలిచింది. యువతలో ఉన్న టాలెంట్ని వెలికితీసేందుకు ఇటువంటి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.
KMM: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన అమరవీరులకు శుక్రవారం నివాళులర్పించారు. పాకిస్థాన్ ఏఎస్సై ప్రేరేపిత తీవ్రవాదులు 2001లో సరిగ్గా నేటి రోజున డిసెంబర్ 13వతేదీ పార్లమెంటుపై దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ముష్కరుల దాడిలో ప్రాణాలర్పించిన పార్లమెంట్ ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటించారు.