AP: సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది.
AP: వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని అన్నారు. దీనిలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం వచ్చిందని పార్టీ నేతలకు సూచించారు.
ASR: డుంబ్రిగుడ మండలంలో జంగిడివలస, అడ్రగూడ జాంగూడ గ్రామాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అరకు నియోజవర్గం నాయకురాలు సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పిల్లలకు పలు పోటీలను నిర్వహించి గెలుపొందిన పిల్లలకు బహుమతులను అందజేశారు.
TG: వికారాబాద్ జిల్లాలో ఆహారం కలుషితమై 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తాండూరులోని గిరిజన గురుకుల పాఠశాల హాస్టల్లో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: కాంగ్రెస్ విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతి కనిపించలేదని మాజీ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. ఇది కాంగ్రెస్ నాయకత్వం దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. గతంలో ఇదే రకంగా తెలంగాణ భాషను అవమానించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి పుట్టుకొచ్చిందని తెలిపారు. తెలంగాణ తల్లి అంటే దేవతామూర్తితో సమానమని పేర్కొన్నారు.
EG: రాజమండ్రిలో సినీ నటి నిధి అగర్వాల్ మంగళవారం సందడి చేశారు. ఓ సిల్వర్ జ్యువలరీ షోరూమ్ కార్యక్రమానికి ఆమె హజరయ్యారు. కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ తలారి వెంకట్రావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. నిధి అగర్వాల్తో పాటు MLA ఆదిరెడ్డి వాసు, వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. హీరోయిన్ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు
CTR: నగరి నియోజకవర్గం నిండ్ర మండలం కూనమరాజుపాలెం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం మండల ఎమ్మార్వో శేషగిరి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. సదస్సులో రైతులు ఇచ్చిన వినతులను పరిశీలించి రైతులకు పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ELR: కుక్కునూరు మండలం వేలేరు గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. గ్రామంలోని పామిలేరు నది గట్టున సారా తయారీకి సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కే.శ్రీనుబాబు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై, సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకాశం: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో సన్నబియ్యం అమలు చేయాలని రాష్ట్ర మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ఒంగోలుకు చెందిన రాయపాటి జగదీష్ కోరారు. మంగళవారం తాడేపల్లిలోని మంత్రి చాంబర్లో కలిశారు. కేంద్రం విటమిన్లతో కూడిన బియ్యాన్ని హాస్టల్స్కు అందిస్తుందని, సంక్షేమ హాస్టల్ అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
NGKL: వెల్దండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ BRS పార్టీ ఆధ్వర్యంలో.. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు BRS పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు పుట్ట రాంరెడ్డి, యాదగిరి, శేఖర్, అశోక్, జోగయ్య తదితరులు పాల్గొన్నారు.
SRD: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహరూపు రేఖలు మార్చడం సరికాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందుల వరలక్ష్మి, డాక్టర్ శ్రీహరి పాల్గొన్నారు.
NLR: కొడవలూరు మండలంలోని మానే గుంటపాడులో మంగళవారం రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతుల దగ్గర నుంచి మండల రెవెన్యూ అధికారి స్ఫూర్తి అర్జీలను స్వీకరించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న రెవిన్యూ సమస్యలపై ఆరా తీశారు. రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
నిజామాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఇవాళ ఏపీ మంత్రి నారా లోకేశ్తో భేటీ అయ్యారు. ఇవాళ మంత్రి నారా లోకేశ్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మంత్రి లోకేశ్ను శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రితో కలిసి ఫోటో దిగారు. మంత్రి లోకేశ్ను కలవడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని ఎమ్మెల్యే అన్నారు.
AP: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం వ్యాఖ్యలు మరోసారి ఏపీ ప్రజలను అవమానించనట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అసలు ప్లాంట్ ప్రతిపాదనే తమ దగ్గర లేదని చెప్పాడం సరికాదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్పై ఏపీ ఎంపీలు మౌనంగా ఉండటం వారి చేతకాని తనమని ధ్వజమెత్తారు. కడప ఉక్కు రాయలసీమ ప్రజల హక్కు.. విభజన చట్టంలోనే ఉందని స్పష్టం చేశారు. బీజేపీ సర్కార్ విభజన హామీలను కాల రాసిందని ధ్వజమెత్తారు.
NLG: దేవరకొండలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రూ. 4500 కోట్లను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్డీఓకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.