NZB: ఈనెల 14న కౌలాస్ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో కామారెడ్డి జిల్లా బాయ్స్ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీల ఎంపికలు జరుగుతాయని పీడీ సతీష్ రెడ్డి తెలిపారు. 01.01.2010 తర్వాత జన్మించిన వారి ఉండాలి. జనన ధ్రువీకరణ పత్రంతో పోటీలో ఎంపికకు క్రీడాకారుల హాజరుకావాలని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
WGL: వరంగల్ 20వ డివిజన్ పరిధిలోని పద్మనగర్ స్మశానవాటిక వద్ద చెత్త విపరీతంగా పేరుకుపోయి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని డివిజన్ కార్పొరేటర్ నరేంద్రకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కార్పొరేటర్ ఈరోజు మున్సిపల్ సిబ్బందితో చెత్త తొలగించే కార్యక్రమం చేపట్టారు.
TG: సంగారెడ్డిలోని మల్కాపూర్ చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో యుద్ధట్యాంకర్లను రూపొందించారు. ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించిన అనంతరం యుద్ధ ట్యాంకర్లను సైన్యానికి అప్పగిస్తారు. కాగా.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏటా సైన్యానికి యుద్ధ ట్యాంకర్లను అందేజేస్తాను.
ASF: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ తిర్యాని మండల అధ్యక్షులు చిత్తూరు సాగర్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన కళ్యాణ అరుణకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 50వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన అందజేశారు. నిరుపేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు.
అల్లూరి: అరకులోయ మండలంలో ఉన్న నాలుగు నీటి వినియోగదారుల సంఘాలకు ఈ నెల 14న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎమ్ఐ జెఈ నాగరాణి తెలిపారు. మండలంలో సిమిలిగూడ, హాట్టగూడ, చినలబుడు, గరడగూడ నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు జరుగుతాయన్నార జరుగుతాయన్నారు. శనివారం ఆయా ఆయకట్టు కింద ఉన్న ఓటర్లు స్ధానిక సచివాలయాల వద్ద నిర్వహించే ఎన్నికలో పాల్గొనాలని ఆమె తెలిపారు.
AP: ఇవాళ స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తొలి ప్రసంగం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు డాక్యుమెంట్ను సీఎం ఆవిష్కరించిన తర్వాత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:45 నుంచి 1:30 వరకు సీఎం చంద్రబాబు ప్రసంగం తర్వాత ఉపముఖ్యమంత్రి పవన్ మాట్లాడనున్నారు.
KNL: కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎంపీపీ బుగ్గన నాగభూషణ్ రెడ్డి నగర్ పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి వైసీపీ నాయకులు బాబుల్ రెడ్డి, ముర్తు జావలి, నాగరాజు, రామచంద్రుడు అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు అన్నదాతకు వైసీపీ అండగా జిల్లా కేంద్రమైన నంద్యాలలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి బేతంచర్ల నుంచి భారీగా వెళ్లారు.
HYD: దూల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది నెలలుగా గంజాయి విక్రయ కేసులో ప్రమేయం ఉన్న అంగూరి బాయిని విశ్వసనీయ సమాచారం మేరకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితురాలిపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైనట్లు చెప్పారు.
TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగుకు నీటిని మంత్రి విడుదల చేయనున్నారు. అనంతరం ఆయన శ్రీరామ్సాగర్ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆ తర్వాత శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుపై అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించనున్నారు.
RR: చంపాపేట డివిజన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి సూచించారు. డివిజన్ పరిధిలోని బైరామల్ గూడా ఓల్డ్ బస్తీలో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తుండాలని కోరారు.
హీరో గోపీచంద్తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో ‘గోలీమార్’ మూవీ వచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నారట. ‘గోలీమార్’ చుట్టూ కొత్త కథను నడపొచ్చని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి.
హీరో గోపీచంద్తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో ‘గోలీమార్’ మూవీ వచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నారట. ‘గోలీమార్’ చుట్టూ కొత్త కథను నడపొచ్చని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి.
TG: భూదాన్ భూముల కుంభకోణం కేసులో ఈడీ అధికారులు నలుగురుకి నోటీసులిచ్చారు. నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశారు. వారితో పాటు మరో ఇద్దరికి నోటీసులు పంపారు. ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే IAS అమోయ్ను ఈడీ పలుమార్లు విచారించింది.
ఇస్తాంబుల్ విమానాశ్రయంలో 400 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. తుర్కీయే నుంచి ఢిల్లీ, ముంబైకి రావాల్సిన రెండు ఇండిగో విమానాలు ముందస్తు సమాచారం లేకుండా రద్దవడంతో ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆహారం, వసతులు లేక ఇబ్బందిపడినట్లు ప్రయాణికులు ఎక్స్లో పోస్ట్లు చేస్తున్నారు.
NLG: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53.93 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644.48 అడుగులుగా ఉంది. మూసీ ప్రాజెక్టు పూర్తి నీటిమట్ట సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.33 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారి మధు తెలిపారు.