ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి స్టేషన్కు తరలించారు. బన్నీపై 105, BNS 118(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో 5-10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడనుంది. కాగా, తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైన విషయం [&he...
తూ.గో: అల్లవరం మండలం మొగళ్లమూరులో కొలువై వున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శుక్రవారం శ్రీ హనుమంత్ వ్రత మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ పాల్గొని స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆమె వెంట స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
గూగుల్లో అత్యధికంగా వెతికిన నటీనటుల జాబితాలో టాప్ 10లో నటి హీనా ఖాన్ ఉన్నారు. దీనిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇది సంతోష పడాల్సిన విషయం కాదన్నారు. ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నారు. హీనా క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె ఈ ఏడాది ఆరంభంలో వెల్లడించారు. దీంతో హీనా గురించి చాలా మంది గూగుల్లో వెతకడం స్టార్ట్ చేశారు.
ASF: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాజీ సీఎం కేసీఆర్ని గురువారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై వారిరువురు చర్చించారు. అనంతరం ఈ నెల 22న హైదరాబాదులో ఎమ్మెల్యే కుమారుడు కోవ సాయినాథ్ వివాహా పత్రికను ఇచ్చి కేసీఆర్ను అహ్వానించారు.
BDK: బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ కారాగారంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు శుక్రవారం యూనియన్ నాయకులు పిచ్చిరెడ్డి, రామారావు సమక్షంలో INTUCలో చేరారు. కార్మికులకు యూనియన్ నాయకులు జెండాను కప్పి ఆహ్వానించారు. ఐటీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి INTUC యూనియన్ కృషి చేస్తోందని రామారావు అన్నారు.
వరంగల్: నిషేధిత గుట్కా కేంద్రంపై శుక్రవారం దాడి చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం హసన్పర్తి మండలం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన అప్పని శ్రీధర్ ఇతర ప్రాంతాల నుంచి గుట్కాతెచ్చి నిల్వచేసి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో హసన్ పర్తి, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులుచేశారు. రూ.10 వేల గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు.
KMM: జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని PDSU నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం వినతి పత్రం అందించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని జిల్లా కార్యదర్శి మస్తాన్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఫుడ్ పాయిజన్ నుంచి విద్యార్థులను కాపాడాలని కోరారు.
KMM: మధిర మండల పరిధిలో కృష్ణాపురం గ్రామానికి చెందిన హోటల్ వ్యాపారి మనోహర్ జిల్లా కోర్టులో 47,97,983 రూపాయలకు శుక్రవారం దివాలా పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణాపురంలో మినరల్ వాటర్ ప్లాంట్ హోటల్ వ్యాపారం చేస్తూ వ్యాపార అభివృద్ధికి అధిక వడ్డీలకు అప్పుల చేసి బాధితుల ఒత్తిడి మేరకు తట్టుకోలేక ఐపి దాఖలు చేసినట్లు వారు తరపు న్యాయవాది ప్రకటనలో తెలిపారు.
NRML: బైంసా పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి వారు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు స్వామివారి ప్రసాదాన్ని అందజేసి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. వీరి వెంట స్థానిక బీజెేపీ నాయకులు ఉన్నారు.
SRD: పటాన్ చెరు నియోజకవర్గంలో తిమ్మక్క, మేళ్ల, ఉసికే బావి, ఇక్రిసాట్, గండిగూడెం, బచ్చుగూడెం, అమీన్పూర్ పరిధిలోని చెరువుల సమీపంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు 1100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్లాంట్ల ఏర్పాటుకు భూ కేటాయింపులు జరపాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికారులు పంపించడం జరిగిందన్నారు.
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్పై స్టార్ హీరోయిన్ నయనతార స్పందించారు. తన భర్త విఘ్నేశ్తో దిగిన ఫొటోలు పెడితే వాటికి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పారు. అందుకే ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేయడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కృష్ణ: రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేయడానికి వెళ్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లబ్బిపేటలోని ఆయన నివాసంలో కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. రైతు సమస్యలపై శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమ పార్టీ నేతలు అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు.
KMM: అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ యువజన జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ రాథోడ్ అన్నారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను మండల కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికిగాను ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందాలనుకునేవారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఐజే నాయుడు కాలనీలో ఉన్న అంగన్వాడి చిన్నారులకు శుక్రవారం పాఠశాల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చిన్న కృష్ణాపురం ఎంయుపి పాఠశాలను సందర్శించారు. విద్యా బోధన, తరగతి గదులు నిర్వహణ, పాఠశాల పరిసరాల గురించి చిన్నారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది సునీత, పద్మ, తదితరులు ఉన్నారు.
BDK: జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్తో సీఈవో జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.