VZM: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్బంగా విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి టివి రాజేష్ కుమార్, 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.అప్పలస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
TG: నటుడు మోహన్ బాబుకు చెందిన హైదరాబాద్లోని ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. మనోజ్ సామగ్రిని తరలించేందుకు వాహనాలు సిద్ధంగా ఉంచారు. మూడు వాహనాల్లో సామగ్రిని తరలించనున్నారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మనోజ్ తన ఇంటికి రావద్దని మోహన్ బాబు అన్నట్లు తెలుస్తుంది.
SRPT: తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిరుమలగిరి, నాగారం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం మండలాలకు 108 నూతన వాహనాలను మంగళవారం ఎమ్మెల్యే సామేలు జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల డాక్టర్లు, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి: ఉద్యోగులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని IDOCలో ట్రెజరీ కార్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా ఉద్యోగులు రక్తదానం చేయాలని సూచించారు. అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, టీజీవో కార్యదర్శి సాయి రెడ్డి పాల్గొన్నారు.
TG: హైదరాబాద్లో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి 600 గ్రాముల డ్రగ్స్ను మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడికి డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NRPT: పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులు వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బెన్ శాలం తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో జిల్లాలోని తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైతే క్షేత్ర స్థాయికి వెళ్లి విచారణ జరపాలని సూచించారు.
కర్నూలు: అభివృద్ధి కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డీ.గౌస్ దేశాయ్ అన్నారు. సీపీఎం కర్నూల్ మండలం మూడో మహాసభలు గొందిపర్లలోని వసంత నగర్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలు రైల్వే వ్యాగన్ పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నిర్మాణ పనులు ప్రారంభించి 10 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదన్నారు.
నంద్యాల-నందిపల్లె రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వివరాలు తెలియ రాలేదన్నారు. మృతుడు పసుపు, తెల్లని రంగు ఫుల్ హాండ్స్ టీ షర్టు, ఎరుపు, పసుపు కలర్ షార్ట్ ధరించినట్లు చెప్పారు.
NDL: ఓర్వకల్లు ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ పిల్లల పాఠశాలకు మంగళవారం తానా ఫౌండేషన్ సహకారంతో రూ. 10 లక్షల సహకారాన్ని నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గౌరు వెంకట్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయ భారతి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర రెడ్డి, తానా సభ్యులు రవి, తదితరులు పాల్గొన్నారు.
HYD: తెలంగాణపై సోషిల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని ప్రధాన సర్కిల్లో ఈనెల 12న జరిగే హనుమత్ వ్రత్ ఉత్సవాల సందర్భంగా దీక్షాపరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపాలిటీ అధికారులు ఈనెల 8న తొలగించారు. దీంతో దీక్షాపరులు మున్సిపాలిటీ అధికారులతో వాగ్వివాదానికి దిగి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అధికారులు తొలగించిన ఫ్లెక్సీల స్థానంలో మంగళవారం నూతన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
KDP: విద్యాసంస్థల మాటునా భూ దోపిడి చేస్తూ, చెరువులను స్వాహా చేస్తున్న రాజంపేట అన్నమాచార్య విద్యాసంస్థలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, TNSF జిల్లా అధ్యక్షుడు పోలి శివకుమార్ తెలిపారు. మంగళవారం రాజంపేటలో వారు మాట్లాడుతూ.. చెరువు తొట్టిలను కబ్జా చేసి భవనాలు నిర్మించారని ఆరోపించారు.
ప్రకాశం: ఈ పంట నమోదు తప్పని సరిగా చేయించుకోవాలని అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజ్ అన్నారు. మనికేశ్వరం మరియు కొంగపాడు గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15 లోపు అందరూ పంటల భీమా చేయించుకోవాలని అన్నారు.
సిరియాలో ఇజ్రాయెల్ పెద్దఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది. అదేవిధంగా.. సిరియాలోకి ఇజ్రాయెల్ సైనికులు చొచ్చుకుని వెళ్తున్నట్లు సమాచారం. సిరియా రాజధాని డమాస్కస్కు 25 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ వెల్లడించింది. ఈ ఘటనలో క్షిపణి లాంచర్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు పేర్కొంది.
VZM: అంగన్వాడి కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను మరింత పటిష్టంగా నిర్వహించాలని మంగళవారం మధ్యాహ్నం గంట్యాడలో ఐసీడీఎస్ పీవో ఉమాభారతి ఆదేశించారు. గంట్యాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల వివిధ మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం జరిగింది. బాల్య వివాహాలు జరగకుండా నిరోధించడం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.