PLD: నూజెండ్ల మండలంలో వారం రోజులుగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం మండలంలోని వీ. అప్పాపురంలో అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో పొల్గొన్న డిప్యూటీ తహశీల్దార్ బాల వెంకటేశ్వర్లకు గ్రామ రైతులు తమకు సంబంధించిన పోలాలకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు.
SDPT: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టినటువంటి ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సిద్దిపేటలో సాయి తేజ సమైక్య పరిధిలోని మహేంద్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈవెంట్ మేనేజ్మెంట్, డెకరేషన్ వ్యాపారా సంస్థను శుక్రవారం ప్రారంభించారు.
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. గబ్బా టెస్టు నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ మాట్లాడాడు. తాము తాజాగా సిరీస్ను ప్రారంభిస్తామని తెలిపాడు. ఇక నుంచి మూడు టెస్టుల సిరీస్గా భావించి ఆడతామని పేర్కొన్నాడు. గబ్బాలో తాము మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన చరిత్ర ఉందని వెల్లడించాడు.
SDPT: విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్య అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య అన్నారు. శుక్రవారం దుబ్బాక లోని సోషల్ వెల్ఫేర్ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ విద్యార్థులపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని అన్నారు.
NLG: దేవరకొండలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో అల్పాహారానికి సంబంధించిన విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు బృందం BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ని కోరగా వెంటనే స్పందించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నాలుగు నెలల పాటు అందించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ MEO మాతృనాయక్, పాఠశాల హెడ్ మాస్టర్ రెబక, తదితరులు పాల్గొన్నారు.
HYD: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో చెత్త సేకరణకు కొత్తగా 50 రిక్షాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రిక్షాలను చెత్త సేకరణదారులకు అందజేస్తున్నారు. రాజేంద్రనగర్, మైలార్దేవపల్లి, సులేమాన్ నగర్, ఇప్పటికే ఉన్న 30 రిక్షాలతో ఆయా ప్రాంతాలలోని చెత్తను సేకరిస్తున్నారు. ప్రతిరోజు రిక్షాదారుడు ఆయా ప్రాంతాలలో ఇంటింటి చెత్తతో పాటు ఓపెన్ పాయింట్లలోని చెత్తను సేకరిస్తున్నారు.
BPT: బాపట్ల పట్టణం శ్రీనివాస నగర్ ఫస్ట్ లైన్ పబ్లిక్ స్కూల్ దగ్గరలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కర్లపాలెం వైపు నుంచి బాపట్ల వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి గ్రామంలో ఉన్నటువంటి చేపల చెరువు వేలం పాటను శుక్రవారం చక్రయపాలెం అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇంఛార్జ్ రవీంద్ర నిర్వహించారు. ఈ చాపల చెరువు వేలం పాటలో ఎవ్వరూ పాల్గొనలేదని కావున వేలం పాటను వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. త్వరలో మరల ఎప్పుడు వేలంపాట నిర్వహించే విషయాన్ని తెలియపరుస్తామన్నారు.
BDK: బూర్గంపాడు మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. సారపాకలోని పలు కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
MDK: ఈనెల 17న ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్మాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తపస్ జిల్లా ప్రధానకార్య దర్శి చల్లా లక్ష్మణ్ అన్నారు. చిన్న శంకరంపేట మండలం మడూర్ ఉన్నత పాఠశాలలో పోస్టర్ విడుదల చేశారు. ప్రభుత్వం వెంటనే డీఏలు విడుదల చేయాలని, 317 బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, శ్రీహరి, రవిందర్ రెడ్డి,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
KRNL: ఆదోనిలో నేషనల్ జూనియర్ కళాశాలలో జిల్లా అధికారుల ఉత్తర్వులు మేరకు విద్యార్థులకు పోలీసులు ట్రాఫిక్పై, రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ గంట సుబ్బారావు మాట్లాడుతూ..18 ఏళ్ల లోపు విద్యార్థులు బైకులు నడపరాదన్నారు. విద్యార్థులు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాలు, గంజాయి వంటి పనులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
KRNL: ఆదోనిలో నేషనల్ జూనియర్ కళాశాలలో జిల్లా అధికారుల ఉత్తర్వులు మేరకు విద్యార్థులకు పోలీసులు ట్రాఫిక్పై, రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ గంట సుబ్బారావు మాట్లాడుతూ..18 ఏళ్ల లోపు విద్యార్థులు బైకులు నడపరాదన్నారు. విద్యార్థులు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాలు, గంజాయి వంటి పనులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
KDP: తక్షణమే రైతులను ఆదుకోవాలని మైదుకూరు మాజీ MLA శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు కడపలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది రూ.20వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ, రైతులకు కనీసం మద్దతు కూడా ఇవ్వకుండా రైతులు నడ్డి విరిస్తుందన్నారు.
KRNL: భారత కమ్యూనిస్టు పార్టీ 100వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. నాటి నుండి నేటి వరకు ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో బలిదానాలు, ఎన్నో పోరాటాలు CPI పార్టీకే సాధ్యమైందని సీపీఐ ఎమ్మిగనూరు పట్టణ కార్యదర్శి రంగన్న తెలిపారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో కమ్యూనిజంపై ఓ సంచికను ఎమ్మిగనూరు DSP ఉపేంద్రబాబు చేతుల మీద విడుదల చేయడం జరిగిందని రంగన్న తెలిపారు.
KRNL: భారత కమ్యూనిస్టు పార్టీ 100వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. నాటి నుండి నేటి వరకు ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో బలిదానాలు, ఎన్నో పోరాటాలు CPI పార్టీకే సాధ్యమైందని సీపీఐ ఎమ్మిగనూరు పట్టణ కార్యదర్శి రంగన్న తెలిపారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో కమ్యూనిజంపై ఓ సంచికను ఎమ్మిగనూరు DSP ఉపేంద్రబాబు చేతుల మీద విడుదల చేయడం జరిగిందని రంగన్న తెలిపారు.