KMR: రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారీక్ అన్సారీ ఈనెల 24న జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం కలెక్టరేట్లో కలెక్టర్తో కలిసి మైనార్టీ సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్రతో భేటీ అవుతారని జిల్లా ఉన్నత అధికారులు తెలిపారు. మైనార్టీల సమస్యలు, వారి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష జరుపుతారు.