కోనసీమ: రామచంద్రపురం రూరల్ మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట రాము సోదరుడు తోట సత్యనారాయణ కుటుంబాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఆయన మరణం కుటుంబానికి మాత్రమే కాకుండా ఈ ప్రాంతానికి కూడా తీరని లోటు అని అన్నారు.