SDPT: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గంకు చెందిన 116 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. మెరుగైన వైద్యం కోసం డబ్బులను వినియోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేతో పాటు ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ ఉన్నారు.
NLR: కొడవలూరు మండలంలోని దామేయ గుంట, వెంకన్నపురం గ్రామాల్లో శుక్రవారం అధికారులు రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ పరంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. రెవిన్యూ సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి స్ఫూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్: చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామ పంచాయితీ ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుసుమ రాజు వీరమ్మ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకొని శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. తమ గ్రామానికి రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
TG: సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే అని పేర్కొన్నారు.
KNR: నగరంలోని కిసాన్ నగర్లో ఈ నెల 15న ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలు ఈ ఉచిత క్యాంపును ఉపయోగించుకోవాలన్నారు.
SRD: జహీరాబాద్ నియోజకవర్గంలో గల తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం పరిధి ప్రత్యేక అధికారుల బృందం భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం బోడికొండ చుట్టూ బీటీ రహదారి నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చొరవతో ఈ రహదారి నిర్మాణానికి రూ.2 కోట్లు నిధులు మంజూరయ్యాయి. జనసేన మండల నాయకులు కరిమజ్జి గోవిందరావు పర్యవేక్షణలో రహదారి పనులు వేగవంతమవుతున్నాయి. ఈ రహదారి వైకుంఠ ఏకాదశికి పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుని పనులు సాగిస్తున్నారు.
కృష్ణా: స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ ఉంగుటూరు మండలం ఆత్మకూరులో వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. యువతరమే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్ అన్నారు. యువత వివిధ రంగాల్లో శిక్షణ పొంది వారి కాళ్లపై వారు నిలబడి దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఎన్టీఆర్: అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయినా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అన్నారు. నందిగామలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసి పెట్టుబడి సాయం ఇవ్వలేదన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి వినతి పత్రం అందజేశారు.
KDP: కూటమి ప్రభుత్వం రైతాంగాన్నికి తీవ్రంగా నష్టం చేకూర్చిందని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం కడపలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్కి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పెన్షన్ తప్ప మరొక పథకాన్ని అమలు చేయలేదన్నారు. ఆర్బికే కేంద్రాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
WGL: మంత్రి కొండా సురేఖ సారథ్యంలో ‘సరస్వతీ నది పుష్కరాల’పై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పుష్కరాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాశ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనతో పాటు పవిత్రగౌడ తదితరులకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ను జూన్లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడాతో జరిగిన మ్యాచ్లో ముంబై గెలిచింది. దీంతో ముంబై ఫైనల్కు దూసుకెళ్లింది. బరోడా 20 ఓవర్లులో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 17.2 ఓవర్లలో 4 వికెల్లు కోల్పోయి 164 రన్స్ చేసి విజయం సాధించింది.
JGL: బాల్కొండ నియోజకవర్గం పోచంపాడ్ శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ (SRSP) తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రివ్యూ మీటింగ్లో కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే కోరినట్లు తెలిపారు.
SDPT: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టినటువంటి ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సిద్దిపేటలో సాయి తేజ సమైక్య పరిధిలోని మహేంద్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈవెంట్ మేనేజ్మెంట్, డెకరేషన్ వ్యాపార సంస్థను శుక్రవారం ప్రారంభించారు.