• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన

SKLM: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పనే లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. గార మండలం సతివాడ పంచాయతీ యాలపేట గ్రామంలో ఉన్న పాఠశాలలో రూ 3.8 లక్షలతో మరుగుదొడ్లు, రూ 9.8 లక్షలతో పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల భద్రత పరిరక్షణ అవసరం అన్నారు.

February 22, 2026 / 04:47 PM IST

ఘనంగా ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు

PLD: వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం బొగ్గరంలో ఆదివారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

February 22, 2026 / 04:46 PM IST

T20 WC: స్వల్ప స్కోరుకే ఇంగ్లండ్ పరిమితం

సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై శ్రీలంక బౌలర్లు విజృంభించారు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఫిలిప్ సాల్ట్ (62) అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేయగా, మిగిలిన బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే 3, మహేష్ తీక్షణ, మధుశంక తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

February 22, 2026 / 04:46 PM IST

‘భూమిని కౌలు తీసుకొని మొక్కజొన్న పంట సాగు’

MHBD: తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన రైతు 3 ఎకరాల భూమిని కౌలు తీసుకోని మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. పంట సాగులో వచ్చే దిగుబడి కూలీలకు, ఎరువుల ఖర్చులకు సరిపోతుందని రైతు HIT TV కి తెలిపారు. కోతులు పంటను నాశనం చేస్తున్నాయని, ఈ పంటకు సరైన నీటి సౌకర్యం లేదని వాపోయారు. పంట మంచిగా పండితే ఎకరానికి 40 క్వింటాల దిగుబడి వస్తుందని తెలిపారు.

February 22, 2026 / 04:46 PM IST

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష.. 15 మంది గైర్హాజరు

వనపర్తి నాగవరం తండాలోని గురుకుల కేంద్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి జరిగిన ప్రవేశ పరీక్షలు ముగిశాయి. మొత్తం 669 మంది విద్యార్థులకు గాను 654 మంది హాజరుకాగా, 15 మంది గైర్హాజరైనట్లు ఇంఛార్జ్ ప్రిన్సిపల్ అర్చన తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

February 22, 2026 / 04:46 PM IST

షాపింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PLD: చిలకలూరిపేట టిడ్కో గృహాల వద్ద రూ. 3.60 కోట్లతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్‌కు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. 5,520 కుటుంబాలకు సౌకర్యంగా ఉండేలా 30 దుకాణాలతో దీన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడ నివాసముంటూ ఉపాధి లేని వారికే ఈ షాపులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఆరు నెలల్లోగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.

February 22, 2026 / 04:46 PM IST

కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

RR: నందిగామ(మం) మామిడిపల్లిలో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి తరించారు. స్వామి కరుణ ఎల్లప్పుడూ తమపై ఉండాలని భక్తులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

February 22, 2026 / 04:45 PM IST

అత్యంత భక్తిశ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

KRNL: పెద్దకడబూరు మండలంలోని రంగాపురం గ్రామంలో కొండపై వెలసిన శివాలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ ప్రజలను చల్లగా చూడాలని ఆకాంక్షించారు.

February 22, 2026 / 04:43 PM IST

గాలి కిరీటీతో బోయపాటి శ్రీను మూవీ?

దర్శకుడు బోయపాటి శ్రీను, యంగ్ హీరో గాలి కిరీటీ కాంబోలో ఒక భారీ యాక్షన్ మూవీ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తనదైన మాస్ ఎలివేషన్లతో హీరోలను పవర్‌ఫుల్‌గా చూపించే బోయపాటి, కిరీటిని ఎలా ప్రెజెంట్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, కిరీటీ ‘జూనియర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

February 22, 2026 / 04:42 PM IST

రాజగోపాలరావు వర్ధంతి వేడుకలు

SKLM: కోటబొమ్మాలి ఎంపీడీవో కార్యాలయం ఎదుట దివంగత నేత, కలింగుల ఆరాధ్య దైవం స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు 34వ వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఉమామల్లయ్య, గోవిందరావు, సత్యరాజు, సతీష్, తదితరులు ఉన్నారు.

February 22, 2026 / 04:41 PM IST

రాష్ట్రంలో గంటపాటు కురిసిన వర్షం

TG: ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీలోని పలు మండలాల్లో దాదాపు గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. పత్తి పంట తడిసి ముద్దవగా.. రబీ పంట వేసిన రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ వేడి ఉండగా ఒకేసారి భారీ వర్షం కురవడంతో.. ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.

February 22, 2026 / 04:41 PM IST

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

KNR: తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

February 22, 2026 / 04:41 PM IST

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: వార్డు కౌన్సిలర్

KMM: మధిర మున్సిపాలిటీ లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్,వైస్ ఛైర్పర్సన్,కౌన్సిలర్ల సన్మాన సభ ఆదివారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 21 వ వార్డు కౌన్సిలర్ రంగా రూప మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కౌన్సిలర్ బాధితులు అప్పగించిన ప్రజలకు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

February 22, 2026 / 04:40 PM IST

‘బీఆర్ఎస్ హయంలో ఆలయ అభివృద్ధి’

SDPT: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధి జరిగిందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆలయం వద్ద సరైన రోడ్లు, త్రాగునీరు, వసతి సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు.

February 22, 2026 / 04:40 PM IST

శ్రీ వేంకటేశ్వర స్వామి జాతరలో ఎమ్మెల్యే

NZB: వేల్పూర్ మండలంలోని కుకునూర్ గ్రామం లో ఆదివారం నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర స్వామి జాతరలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

February 22, 2026 / 04:39 PM IST