• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రజలకు అండగా నిలవండి: రోజా

CTR: వైసీపీ శ్రేణులంతా ప్రజలకు అండగా నిలవాలని మాజీ మంత్రి రోజా సూచించారు. నగరి పట్టణంలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. వైసీపీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సమస్యలు వస్తే పరిష్కరించేలా పనిచేయాలని కోరారు. నగరి మున్సిపల్ ఛైర్మన్ నీలమేఘం, ఇతర నాయకులు బాలకృష్ణన్, తిరుమల రెడ్డి, బాలకృష్ణన్, వేణుబాబు పాల్గొన్నారు.

December 10, 2024 / 06:08 PM IST

కొవిడ్‌.. కనీవినీ ఎరుగని విపత్తు: కేంద్రం

కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులై పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీవీ వరాలేలతో కూడిన ‘సుప్రీం’ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, దీనిపై స్పందించిన కేంద్రం.. కొవిడ్-19 మహమ్మారి అనేది గతంలో ఎన్నడూ ఎరుగని విపత్తు అని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రజల ప్రాణాలను కాపాడిందని ధర్మాసనం దృష్ట...

December 10, 2024 / 06:06 PM IST

గ్రంథాలయ పాఠకులకు మెడిటేషన్ క్లాస్

BHNG: యాదాద్రి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు శ్రీ రామచంద్ర మిషన్ ట్రైనర్ చేపూరి నరసింహ చారి ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న గ్రంథాలయ పాఠకులకు మెడిటేషన్ క్లాస్ నిర్వహించారు. ఉద్యోగ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాటూరి బాలేశ్వర్ చేపూరి రామకృష్ణ గ్రంథాలయ సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు.

December 10, 2024 / 06:06 PM IST

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

GNTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మంగళవారం ఆమె క్యాంప్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మీతోనే నేను – మీ వెంటే నేను’ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి, పనుల నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాల నిర్వహణపై నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.

December 10, 2024 / 06:05 PM IST

‘కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నెంబర్ 22 అమలు చేయాలి’

BDK: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నెంబర్ 22 అమలు చేసి, వేతనాలు పెంచాలని కోరుతూ.. సీఐటీయు ఆధ్వర్యంలో సింగరేణి జాయింట్ కమిషనర్ దేవరాజుకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ప్రతినెల 7వ తేదీలోపు వేతనాలు ఇచ్చే విధంగా కృషి చేయాలి అన్నారు. అదేవిధంగా ప్రొఫెషనల్ టాక్స్ మినహాయింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.

December 10, 2024 / 06:05 PM IST

ఈనెల 17న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

ప్రకాశం: ఈనెల 17న ఉదయం 11 గంటలకు కనిగిరి మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ కార్యాలయ పరిపాలన అధికారి జి ఫ్రాన్సిస్ బాబు మంగళవారం తెలిపారు. కనిగిరి మండలంలోని మండల స్థాయి అధికారులు అందరూ సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని తెలిపారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు సమావేశానికి హాజరుకావాలని పేర్కొన్నారు.

December 10, 2024 / 06:05 PM IST

వెల్దుర్తిలో క్రీడా పోటీలు ప్రారంభించిన నాయకులు

MDK: గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత స్థాయి వరకు క్రీడల్లో ఎదగాలని ఒక మంచి సంకల్పంతో సీఎం చీఫ్ మినిస్టర్ కప్ లాంటి పోటీలను పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చీఫ్ మినిస్టర్ కప్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 

December 10, 2024 / 06:04 PM IST

అక్రమంగా తరలిస్తున్న గోవులను అడ్డుకున్న గ్రామస్తులు

E.G: సఖినేటిపల్లిలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా కొంతమందిని హిందూ పరిరక్షణ సమితి సభ్యులు పోలిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామస్తుల అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందజేసి గోవులను వారికి అప్పగించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై దుర్గా శ్రీనివాస్ తెలిపారు. ఆవులను అంతర్వేది గోశాలకు తరలించారు.

December 10, 2024 / 06:01 PM IST

సంతమాగులూరులో శిక్షణా తరగతులు

ప్రకాశం: LSDG ట్రైనింగ్‌లో భాగంగా సంతమాగులూరు మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, మండల స్థాయి అధికారులకు మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శివప్రసాద్‌తో పాటు పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొని స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ గురించి వివరించారు.

December 10, 2024 / 06:01 PM IST

ఎంపీడీవో కార్యాలయంలో ట్రైనింగ్ ప్రాగ్రాం నిర్వహణ

PPM: పార్వతీపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ మజ్జి శోభారాణి అధ్యక్షతన ఎంపీడీవో రూపేష్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులకు, సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని అయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్ఎస్ డిజి ఈ కార్యక్రమం 10 నుండి 13వ తేదీ వరకు జరుగుతుందని అన్నారు.

December 10, 2024 / 06:01 PM IST

నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

కృష్ణా: తిరువూరు మండలంలోని కాకర్లలో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో 35 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్సై వి. కృష్ణవేణి తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా విస్సన్నపేట మండలం, వేమిరెడ్డిపల్లి తండాకి చెందిన బాణావత్ వినోద్ కుమార్ బైక్ పై అక్రమంగా సారా తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.

December 10, 2024 / 06:01 PM IST

తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

కడప: విధుల్లో చేరకుండా ఉద్యోగ నిబంధనలను ఉల్లంఘించి, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేసిన తహశీల్దార్ దస్తగిరయ్యను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా నుండి జమ్మలమడుగు కెఆర్‌ఆర్‌సి తాహశీీల్దారుగా బదిలీ అయి, ఇంతవరకు విధుల్లో చేరకపోవడంతో సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

December 10, 2024 / 06:00 PM IST

పీయూలో ABVP రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

MBNR: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాలమూరు యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఈ నెల 23, 24, 25 తేదీలలో జరగనున్న 43వ రాష్ట్ర మహాసభల పోస్టర్ జాతీయ కార్యవర్గ సభ్యులు కాయం నవేంద్ర ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మహాసభల్లో రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థి నాయకులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు.

December 10, 2024 / 06:00 PM IST

కానిస్టేబుల్ కుటుంబాలకు అండగా నిలుస్తాం: అదనపు ఎస్పీ

PLD: మరణించిన కానిస్టేబుల్ కుటుంబాలకు పోలీస్ శాఖ తరపున మంగళవారం పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ జెవి సంతోష్ ఆర్థిక సహాయం అందించారు. విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, శ్యాం ప్రసాద్, కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు. వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయాన్ని భవిష్యత్తులోనూ చేస్తామని అదనపు ఎస్పీ తెలిపారు.

December 10, 2024 / 06:00 PM IST

ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

BHNG: భువనగిరి పట్టణంలోని సంతోష్ నగర్ వార్డు 5లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ హనుమంత రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్‌లో నమోదు చేస్తున్న తీరును గమనించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కాగా లబ్ధిదారుల వివరాలను సేకరిస్తూ చేయాలన్నారు.

December 10, 2024 / 05:59 PM IST