• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తాగునీటి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

ASR: హుకుంపేట మండలంలోని కొంతిలి గ్రామంలో తాగునీటి పథకం నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి తాగునీటి బోరు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.1.50 లక్షల జిల్లా పరిషత్ నిధులతో బోరు నిర్మాణాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు.

December 13, 2024 / 03:32 PM IST

ఇందిరా మహిళా సర్వే ప్రక్రియను పరిశీలించిన జనగామ కలెక్టర్

JN: జిల్లా కేంద్రంలోని 2, 20వ వార్డుల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష శుక్రవారం పరిశీలించారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి సమాచారం తెలుసుకుంటున్నారు. వివరాల నమోదును యాప్‌లో పక్కాగా నమోదు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

December 13, 2024 / 03:31 PM IST

ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్

ADB: బోథ్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను జిల్లా పాలనాధికారి రాజర్షి షా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు స్టోరేజ్ రూమ్, ఆర్ ఓ ప్లాంట్‌లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులను అభ్యాస సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

December 13, 2024 / 03:30 PM IST

బాపట్ల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

BPT: బాపట్ల కలెక్టరేట్ వద్ద వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న ‘రైతుకు అండగా’ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలకు, పోలీసులు మద్య వాగ్వాదం జరిగింది. బారికేడ్లను నెట్టుకొని వైసీపీ కార్యకర్తలు, రైతులు కలెక్టర్ కార్యాలయం లోపలికి వెల్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల వారిని అడ్డుకుని పరిస్థితి అదుపు చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

December 13, 2024 / 03:30 PM IST

నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరలింపు

TG: అల్లు అర్జున్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. నాంపల్లి కోర్టులో చిక్కడపల్లి పోలీసులు హాజరుపరిచారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటపై విచారణ చేపట్టనున్నారు.

December 13, 2024 / 03:29 PM IST

రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన

VZM: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన సాగుతుందని ఎమ్మెల్యే లోకం మాధవి వెల్లడించారు. డెంకాడ మండలం గంట్లాం గ్రామంలో శుక్రవారం పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పశువుల సోకే వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండి తగిన చికిత్స చేయాలని సూచించారు. ఇందులో ఏపీ మార్కెఫెడ్ ఛైర్మన్ బంగార్రాజు పాల్గొన్నారు.

December 13, 2024 / 03:29 PM IST

మహా పడిపూజను ప్రారంభించిన సీపీ

WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాజీపేట పట్టణంలో నేడు అయ్యప్ప స్వామి మహా పడిపూజను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ప్రారంభించారు. తేజావత్ నవీన్ ఆధ్వర్యంలో జరిగిన మహాపడి పూజలో సీపీ పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు అర్చనలు జరిపించారు.

December 13, 2024 / 03:28 PM IST

63వ నేషనల్ ఫార్మసీ వీక్ ముగింపు వేడుకలు

MDK: అన్నారం గ్రామంలోని పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఘనంగా 63వ, నేషనల్ ఫార్మసీ వీక్ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా 5వ, రోజు శుక్రవారం ట్రెడిషనల్ డే, ర్యాంపు వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అదరగొట్టారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

December 13, 2024 / 03:28 PM IST

కాట్రేనికోనలో రెవెన్యూ సదస్సు

కోనసీమ: కాట్రేనికోనలో సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ అధ్యక్షతన గ్రామ రెవెన్యూ సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సదస్సులో గ్రామ రెవెన్యూ సదస్సులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సునీల్ కుమార్.. అటవీ శాఖ, దేవాదాయ శాఖ  అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ప్రజల నుంచి రెవెన్యూ పరమైన సమస్యలపై అర్జీలను స్వీకరించారు.

December 13, 2024 / 03:28 PM IST

గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు చీరలు పంపిణీ

ATP: గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటుతోపాటు గర్భిణీ స్త్రీలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గుత్తి టీడీపీ మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రి సూపరిండెంట్ ఎల్లప్పతో కలిసి భోజనాలను అందజేశారు.

December 13, 2024 / 03:26 PM IST

డ్రైవింగ్ వచ్చి, లైసెన్స్ లేని యువతకు ఉచిత లైసెన్స్ మేళ

SRCL: జిల్లాలో డ్రైవింగ్ వచ్చి, లైసెన్స్ లేని యువతీ యువకుల కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్దేశిత ఆన్‌లైన్ రుసుముతో ద్విచక్ర వాహన లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. శుక్రవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేసే వాహనదారు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటుగా ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమన్నారు.

December 13, 2024 / 03:25 PM IST

బన్నీ అరెస్ట్‌ను ఖండించిన కేఏ పాల్

TG: హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. కాగా దీనిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినప్పుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారని గుర్తు చేశారు. మరి చంద్రబాబును అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? అని కేఏ పాల...

December 13, 2024 / 03:23 PM IST

బన్నీ అరెస్ట్‌ను ఖండించిన కేఏ పాల్

TG: హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. కాగా దీనిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినప్పుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారని గుర్తు చేశారు. మరి చంద్రబాబును అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? అని కేఏ పాల...

December 13, 2024 / 03:23 PM IST

పరామర్శలో పాల్గొన్న బీజేపీ నాయకులు

JN: రఘునాథపల్లి మండలం జాఫర్ గూడెం గ్రామంలో బీజేపీ సీనియర్ జిల్లా నాయకులు కోడెల యాదగిరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు శుక్రవారం యాదగిరి నివాసంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంద వెంకన్న, గుర్రం జంపి తదితరులు పాల్గొన్నారు.

December 13, 2024 / 03:22 PM IST

రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

ప్రకాశం: కనిగిరి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ రెవిన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యల పై వినతి పత్రాలను స్వీకరించడం జరిగింది. సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇందులో ఎస్సై శ్రీరామ్, మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

December 13, 2024 / 03:22 PM IST