• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ వచ్చేస్తోంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్, రెట్రో స్టైల్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ బ్రాండ్. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి ఈవీ సబ్ బ్రాండ్ Flying Flea. మొదటి మోడల్ Flying Flea C6.. 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. రూ.2 లక్షల నుంచి రూ.2.5-3 లక్షల మధ్య ధర ఉండొచ్చని అంచనా.

February 22, 2026 / 01:59 PM IST

రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం

AKP: ఎస్ రాయవరం మండలం సోమిదేవిపల్లికి చెందిన నేషనల్ పారా వాలీబాల్ క్రీడాకారుడు అన్నెం గణేష్‌కు జాతీయ పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఈనెల 25 నుంచి 28 వరకు మీరట్‌లో జరిగే టోర్నమెంట్‌కు ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు గణేష్ ఆదివారం తెలిపారు. టోర్నమెంట్లో సత్తా చాటి ఏపీకి మంచి పేరు తీసుకువస్తానన్నారు.

February 22, 2026 / 01:58 PM IST

ఔన్నత్యాన్ని చాటుకున్న క్లాస్‌మేట్స్

SDPT: అక్కన్నపేట మండలం జనగామ గ్రామానికి చెందిన మోటే అజయ్ గత 15 రోజుల క్రితం ఆగి ఉన్న ట్రాక్టర్‌ని ఢీకొట్టడంతో ప్రాణాలను కోల్పోయాడు. తనతో కలిసి పదవ తరగతి చదువుకున్న జడ్.పి.హెచ్.ఎస్ అంతక పేట 2009 బ్యాచికి చెందిన తన తోటి స్నేహితులు అందరూ కలిసి దాదాపుగా లక్ష 40 వేల రూపాయలని తన కూతురి పేరుపై ఎల్ఐసిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.

February 22, 2026 / 01:56 PM IST

‘ది కేరళ స్టోరీ 2’పై దర్శకుడి విమర్శలు

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాపై తీవ్ర విమర్శలు చేశాడు. దీన్ని కేవలం డబ్బు కోసం తీసిన ‘చెత్త ప్రాపగండా’ చిత్రంగా ఆయన అభివర్ణించాడు. ప్రజల మధ్య విభజన తెచ్చి లాభపడాలని చూస్తున్నారని మండిపడ్డాడు. ట్రైలర్‌లోని కొన్ని సీన్లపై స్పందిస్తూ.. ఇవన్నీ పచ్చి అబద్ధాలని, మేకర్స్ అత్యాశతోనే ఇలాంటి కథలు తీస్తున్నారని ఘాటుగా విమర్శించాడు.

February 22, 2026 / 01:56 PM IST

‘నిందితులను అరెస్ట్ చేయాలి’

సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గతో పాటు నిందితులతో కుమ్మక్కైన పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలని విదసం రాష్ట్ర కన్వీనర్ డా. బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సిట్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

February 22, 2026 / 01:55 PM IST

‘పెండింగ్‌లో ఉన్న డిఏలు వెంటనే విడుదల చేయాలి’

SRD: ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. జిల్లాలోని సంఘ భవనంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మెరుగైన పీఆర్‌సీని ప్రకటించాలని కోరారు. ప్రతి తరగతికి ఓ ఉపాధ్యాయున్ని నియమించాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

February 22, 2026 / 01:52 PM IST

పోలీస్ వ్యవస్థను రాజకీయాలకు వాడుతున్నారు: అంబటి

AP: లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేశారు. 5 నుంచి 12 గంటల వరకు దాడి జరుగుతూనే ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు

February 22, 2026 / 01:51 PM IST

‘విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి’

MNCL: వచ్చే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.

February 22, 2026 / 01:47 PM IST

BRS నేతలు విషం చిమ్ముతున్నారు: MLC వెంకట్

TG: మూసీ ప్రాజెక్టుపై BRS నేతలు విషం చిమ్ముతున్నారని, మూసీ ప్రక్షాళన BRSకు ఇష్టం లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. రెచ్చగొట్టి లబ్ధి పొందాలని మాజీ మంత్రి హరీష్ రావు యత్నిస్తున్నారని ఆరోపించారు. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, నిర్వాసితులు ప్రతిపక్షా వలలో పడొద్దని సూచించారు.

February 22, 2026 / 01:46 PM IST

ఐపీఎస్‌ సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్‌ పొడిగింపు

AP: ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1969లోని రూల్3(3) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ కేసు పూర్తి లేదా పదవీ విరమణలో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. సునీల్ కుమార్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.

February 22, 2026 / 01:45 PM IST

అక్రమ వ్యాపారాలకు అండగా ఉన్న పోలీసులపైచర్యలు: ఎస్పీ

VKB: అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా SP స్నేహ మెహ్ర తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల సమావేశంలో వెల్లడించారు. అక్రమ ఇసుక వ్యాపారం కొనసాగుతుందని ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. అక్రమ వ్యాపారాలకు అండగా ఉన్న పోలీస్ సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

February 22, 2026 / 01:41 PM IST

కాలువలో శవమై తేలిన బీజేపీ నేత

TG: జగిత్యాల జిల్లా సుద్ధపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బీజేపీ నేత రమణ అనుమానాస్పద స్థితిలో కాలువలో శవమై తేలారు. గతంలో BRS పార్టీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన.. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయనపై మూడు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే, ప్రమాదమా లేక హత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 01:41 PM IST

వేదనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం

TPT: నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. వేలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆధికారులు, స్థానిక సంఘాల వారు భక్తుల కోసం అన్ని సౌకర్యాలను అందించారు. కుంభాభిషేకం ద్వారా ఆలయంలో పవిత్రత, ఆధ్యాత్మిక ఉత్సాహం మరింత పెరిగినట్లు భక్తులు తెలిపారు.

February 22, 2026 / 01:40 PM IST

మోడల్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు మొదలు

KDP: నర్సాపురంలోని ఏపీ మోడల్ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ సౌజన్య పేర్కొ న్నారు. ఈనెల 23 నుంచి మార్చి 31వ తేదీ వరకు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొత్తం 100 సీట్లు ఉంటాయని దరఖాస్తుచేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 12వ తేదీ ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుందన్నారు.

February 22, 2026 / 01:40 PM IST

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఆదివారం కొంతం కిష్టమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. పేద కుటుంబానికి చెందిన కిష్టమ్మ కుటుంబ సభ్యులకు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తమ వంతు సహాయంగా రూ. 5000 ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు.

February 22, 2026 / 01:38 PM IST