MNCL: దండేపల్లి మండలంలోని తాళ్లపేట ఎఫ్ఆర్ఓ కార్యాలయంలోని ఫర్నిచర్ను లక్షెట్టిపేట కోర్టు అధికారులు, శుక్రవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. అదే రేంజ్లో పనిచేస్తున్న బియ్యాల అంజన్నను అధికారులు తొలగించడంతో, గోదావరిఖనిలోని లేబర్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. అధికారులు కోర్టు ధిక్కరణ చేయడంతో ఫర్నిచర్ను కోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అన్నమయ్య: ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
WGL: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం రేవంత్ రెడ్డి, సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి వరంగల్ ఎంపీ కడియం కావ్య కలిశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, తదితర విషయాలపై కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
KKD: సామర్లకోట మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది వారి సమస్యల పరిస్కారం కోరుతూ సమ్మెలో ఉన్న సంగతి తెలిసిందే. తాగునీటి సరఫరా విషయంలో అధికారులు నాలుగు రోజులుగా ప్రత్యామ్నాయ సిబ్బందితో ఏర్పాట్లు చెయ్యగా శుక్రవారం వారుకూడా అందుబాటులో లేకపోవడంతో కుళాయిల్లో తాగునీటి సరఫరా నిలిచి పోయింది.
జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు గత జూలైలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ రాత పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను RRB తాజాగా విడుదల చేసింది. https://www.rrbcdg.gov.in/ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 7,951 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 16,17,18 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఇటీవల ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. సినిమాల పరంగా కంటే వ్యక్తిగత సమస్యలతో టాలీవుడ్ నటులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లైంగిక వేధింపులతో జానీ మాస్టర్ అరెస్ట్, ఎన్ కన్వెన్షన్ అంశం, సమంత-చైతూ విడాకుల విషయంలో నాగ్ ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం, మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు, అల్లు అర్జున్ అరెస్ట్.. ఇలా వరుస ఘటనలు ఇండస్ట్రీ వర్గాలను కలవరపరుస్తున్నాయి.
KMM: వ్యవసాయ మార్కెట్కు అధికారులు రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటించారు. శనివారం వారంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో ఈ రెండు రోజులు మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.
SRCL: కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్లలో స్కానింగ్ సెంటర్లను పీఓఎంహెచ్ఎన్ డాక్టర్ అంజలి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫారం ఎఫ్ ఆడిట్ రిజిస్టర్లను పరిశీలించారు. గర్భస్థ పూర్వ పిండ నిర్ధారణ వ్యతిరేక చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ జరిపిన నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నారు.
TG: అల్లు అర్జున్ను నాంపల్లిలోని 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. కోర్టు హాల్లో జనం ఎక్కువగా ఉండటంతో అనంతరం జడ్జి ఛాంబర్కు తరలించారు. హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్పై తీర్పు వచ్చాకే నాంపల్లి కోర్టులో రిమాండ్పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 4 గంటలకు హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై తీర్పు ఇవ్వ...
TG: అల్లు అర్జున్ను నాంపల్లిలోని 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. కోర్టు హాల్లో జనం ఎక్కువగా ఉండటంతో అనంతరం జడ్జి ఛాంబర్కు తరలించారు. హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్పై తీర్పు వచ్చాకే నాంపల్లి కోర్టులో రిమాండ్పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 4 గంటలకు హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై తీర్పు ఇవ్వ...
ప్రకాశం: కనిగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 114 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలల వేతన బకాయిలు చెల్లించాలని ఎంఈవో డి.సుబ్బారావును మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పి.వి శేషయ్య శుక్రవారం కలిసి కోరారు. వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. జూన్ వరకు చెల్లించారని మిగిలిన బకాయలు చెల్లింపునకు ప్రభుత్వంకు నివేదిక పంపించామని ఎంఈవో తెలిపారు.
వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభమేళాలో ఏఐ, చాట్బాట్ సేవలు వినియోగించుకోబోతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. మహాకుంభమేళాను విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.
WNP: జిల్లాలో ఈనెల 15, 16 తేదీలలో నిర్వహించే గ్రూపు-2 పరీక్షలకు అభ్యర్థులు సకాలంలో పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30, మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి ఉండదన్నారు. 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలని పేర్కొన్నారు.
HYD: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన పోలీసు శాఖ వైఫల్యమే అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై ఎమ్మెల్యే రాజాసింగ్ Xలో స్పందించారు. తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గర్వాన్ని తెచ్చిపెట్టిన జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ది తప్పు కాదని పేర్కొన్నారు. ఆయనను గౌరవించాల్సింది పోయి ఓ నేరస్థుడిలా ఆయనతో ప్రవర్తించడం తగదని తేల్చిచెప్పారు.
SRPT: గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కోసం చేపడుతున్న అంతర్జాల నమోదు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే సామేలు అన్నారు. శుక్రవారం నూతనకల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీ చేసి సర్వే విధివిధానాలను వివరించి అసలైన లబ్దిదారులను గుర్తించాలని, అర్హులైన పేదలందరికీ ప్రతి ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామన్నారు.