ప్రకాశం: అమరావతిలో సెక్రటేరియట్ నందు శుక్రవారం విదేశీ పెట్టుబడిదారులతో అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్వాకం వలన విదేశీ పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇన్వెస్టర్స్కు కేరాఫ్ అడ్రస్గా ఏపీని నిలుపుతామని మంత్రి చెప్పారు.
NLR: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ముగింపు ప్రసంగంలో 10 సూత్రాలను అమలు చేయడంలో ప్రతి ఒక్క కలెక్టర్ ప్రణాళిక చేసుకోవాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు కలెక్టర్ ఓ ఆనంద్, ఎస్పీ జి కృష్ణ కాంత్ హాజరయ్యారు. అనంతరం అడ్మినిస్ట్రేషన్ లా అండ్ ఆర్డర్పై ముఖ్యమంత్రి సమీక్షించారు. స్పీడ్ అఫ్ డూయింగ్ పెరగాలని, మార్పు అనేది కచ్చితంగా కనపడాలన్నారు.
నిజామాబాద్: బోధన్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలుపరచాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్: బోధన్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలుపరచాలని డిమాండ్ చేశారు.
KKD: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈనెల 15 వ తేదీన ఆదివారం మెట్లోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం గ్రామ సేవ అనంతరం 9:30 గంటలకు కొండ దిగువ తొలి పావంచల వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు పూజ నిర్వహించి మెట్లోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.
నిజామాబాద్: బైపాస్ రోడ్డులోని ఆర్కేఆర్ అపార్ట్మెంట్ దారి వివాదంలో పరస్పర కేసులు నమోదయ్యాయి. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఆరీఫ్ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత మామ రాంకిషన్రావుపై కేసు నమోదు చేశామని.. అలాగే అపార్ట్మెంట్ వాసులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్: బైపాస్ రోడ్డులోని ఆర్కేఆర్ అపార్ట్మెంట్ దారి వివాదంలో పరస్పర కేసులు నమోదయ్యాయి. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఆరీఫ్ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత మామ రాంకిషన్రావుపై కేసు నమోదు చేశామని.. అలాగే అపార్ట్మెంట్ వాసులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
MNCL: నెన్నెల మండలం నందులపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి పాకాల భీమేష్(47) అనే వ్యక్తి మృతి చెందాడు. భీమేష్కి మతిస్థిమితం సరిగా ఉండదని, 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లాడని, శుక్రవారం బహిర్భూమికి వెళ్లిన ఒక గ్రామస్థుడు మృతదేహాన్ని గమనించి సమాచారం అందించాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.
KNR: టీయూజేడబ్ల్యూ జిల్లా ఈసీ తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (టీయూజెడబ్ల్యూ) జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన తిమ్మాపూర్ మండలానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ సిరిసిల్ల అనిల్ కుమార్ను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సన్మానించి అభినందించారు.
TG: హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ దుమారం రేపుతోంది. అయితే తాము ప్రీమియర్ షో గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని సంధ్య థియేటర్ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. కానీ హీరో థియేటర్కు వెళ్లడంలో అభ్యంతరం లేదని.. కానీ ర్యాలీ విషయం తమకు తెలియదని.. ఈ కారణంగానే తొక్కిసలాట జరిగిందని పోలీసులు వివరణ ఇస్తున్నారు. దీంతో బన్నీని అరెస్ట్ చేశారని సమాచారం.
BHNR: యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా ఎండి అవేష్ ఉర్ రెహమాన్ చిస్తీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తన చాంబర్లో నూతన ఛైర్మన్గా రిజిస్టర్లో రాష్ట్ర గ్రంధాలయ ఛైర్మన్ రియాజ్ సంతకం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి: విజయ డైరీ జిల్లా ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి రైతులకు పెండింగ్ పాల బిల్లుల ఇవ్వాలని కోరుతూ డిడిసిఎఫ్ రాష్ట్ర ఛైర్మన్ అమిత్ రెడ్డికి శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. రైతులకు పాల బిల్లులు రాక నిత్యం అవస్థలు పడుతున్నారని తెలిపారు. తక్షణమే బిల్లులు వచ్చే విధంగా చూడాలని కోరారు. తక్షణమే బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
కామారెడ్డి: విజయ డైరీ జిల్లా ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి రైతులకు పెండింగ్ పాల బిల్లుల ఇవ్వాలని కోరుతూ డిడిసిఎఫ్ రాష్ట్ర ఛైర్మన్ అమిత్ రెడ్డికి శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. రైతులకు పాల బిల్లులు రాక నిత్యం అవస్థలు పడుతున్నారని తెలిపారు. తక్షణమే బిల్లులు వచ్చే విధంగా చూడాలని కోరారు. తక్షణమే బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
VZM: బొబ్బిలి సంస్థానం ఉన్నత పాఠశాలలో 1982లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశాన్ని ఈ నెల 15న ఏర్పాటు చేశామని కమిటీ అధ్యక్షుడు విజయ మోహన్ రావు తెలిపారు. బొబ్బిలిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. 43 ఏళ్ల తర్వాత జరిగే అపూర్వ సమావేశానికి పూర్వ విద్యార్థుల హాజరు కావాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని చెప్పారు.
TG: హీరో అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండిస్తూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్వీట్ చేశారు. కాగా KTRకు TPCC అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చదువుకున్న వాడివి, పదేళ్లు మంత్రిగా చేసినవాడివి చట్టం గురించి తెలియదా? అని నిలదీశారు. నేషనల్ అవార్డు విన్నరైనా, చివరకు KTR అయినా సరే తప్పు చేస్తే బొక్కలో ఉండాల్సిందేనన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఎవరైనా చట్టం ముందు సమ...