NDL: డోన్ పట్టణ పరిధిలో కోట్ల వారి పల్లెలో శ్రీ గంగ గంగమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన నేడు పాల్గొన్నారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అన్నమయ్య: రాయలసీమలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి సందర్భంగా కలికిరిలో రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులి సత్యనారాయణరెడ్డి పాల్గొని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దుష్ట పాలనకు ఎదిరించి పోరాడిన వీరుడని తెలిపారు.
✦ ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తినాలి✦ ఒకేసారి ఎక్కువగా కాకుండా ఎక్కువసార్లు తిన్నా సరే కొంచెం కొంచెం తినాలి✦ మజ్జిగ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను తయారు చేస్తాయి✦ చికెన్, మటన్ బదులు చేపలు ఎక్కువగా తినాలి.✦ చక్కెర, ఉప్పు తగ్గించాలి. ఫలితంగా షుగర్, బీపీలకు దూరంగా ఉంటారు✦ రోజూ కనీసం 30 ని. పాటు వ్యాయామం చేయాలి
NLG: కనగల్ మండలంలోని ధర్వేశిపురం, ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో వీధి కుక్కలు తీవ్రమైన చర్మవ్యాధితో కనిపిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వ్యర్థాల వల్ల సోకిన ఈ వ్యాధి మనుషులకు ప్రబలకుండా పశువైద్య అధికారులు తక్షణమే స్పందించి కుక్కలకు చికిత్స అందించాలని, గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
BHPL: రేగొండ మండల కేంద్రానికి చెందిన మైస వీరస్వామి ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న రావణ్ సిద్దార్థ్ యూత్ ఇవాళ మృతుడి నివాసానికి వెళ్లి.. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి..రూ.5000 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
VZM: బ్రిటిష్ నిరంకుశ పాలనపై గర్జించిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ కొనియాడారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి ఆదివారం జరిపారు. అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా రైతులను ఏకం చేసి, ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన గొప్ప వీరుడు నరసింహారెడ్డి అని అన్నారు.
ADB: కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీజేపీ నాయకులు చలో కామారెడ్డి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యక్రమానికి బయలుదేరకుండా పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు, ప్రతి దాడులు సరైనవి కాదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.
ASR: గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన అడ్డపిక్కల కొనుగోలుకు ప్రజలు అధికంగా మక్కువ చూపిస్తున్నారు. వీటిని గిరిజనులు, మైదాన ప్రాంతాల వారు కొనుగోలు చేస్తుంటారు. అల్లూరి జిల్లాలో జరిగే వారపు సంతలో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మూడు, నాలుగు కేజీలుండే ప్యాకెట్ ధర రూ.500 పలుకుతుంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు: పొన్నూరులో పరదాల మాటున మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జీబీసీ రోడ్డులో బాపట్ల బస్టాండ్, ఆటో స్టాండ్ సమీప వైన్స్ షాపుల్లో తెల్లవారుజామునే అమ్మకాలు సాగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులు, మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ మూవీతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన ఈ సినిమా వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలతో అలరించనుంది. ఇక ఈ సినిమాలో ఆరి అర్జున్, అమ్ము అభిరామి, కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
NLR: చేపల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి తూకాలలో లోపాలు ఉన్న 15 కాంటాలను సీజ్ చేశామని తూనికుల అధికారి శాఖ ఇన్స్పెక్టర్ రియాజ్ అహ్మద్ తెలిపారు. తూనికలలో తేడాలు వస్తున్నాయని వినియోగదారుల ఫిర్యాదు మేరకు బుచ్చిరెడ్డిపాలెం చాపల దుకాణాలపై దాడులు చేశారు. చేతి కర్ర కాంటాలు వాడొద్దని వ్యాపారస్తులకు సూచించారు. కాంటాలు కొనుగోలు చేసేటప్పుడు సీలు వేయించుకుని లైసెన్సులు తీసుకోవాలన్నారు.
BDK: అశ్వాపురం మండలంలోని శ్రీ సాయి బాబా ఆలయం భక్తుల సందడితో ఆదివారం ముస్తాబవుతోంది. శ్రీ శిర్డీ సాయి బాబా ఆరాధనలో భాగంగా 32 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 23న జరగనున్న ఈ ఉత్సవాలకు ఆ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.
నాగర్ కర్నూల్: కుమ్మెర జాతరలో కాంగ్రెస్ నాయకుల దాడిలో రెండు నెలల చిన్నారి మృతి చెందడం అమానుషమైన ఘటన అని బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షులు గడ్డం భరత్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. చిలుకేశ్వరం చాకలి చంద్రకళ దైవదర్శనం కోసం వెళ్తే కాంగ్రెస్ నాయకులు దాడి చేసి, పసికందు మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
VSP: గాజువాకలోని పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. వేగంగా వచ్చిన భారీ వాహనం ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో, సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
SKLM: మందసలో వెలసిన శ్రీ వాసుదేవ పెరుమాళ్లు స్వామి వారిని పలాస టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి, స్థానిక నాయకులుతో కలిసి స్వామి వారిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు నాగ రాజు తదితరులు ఉన్నారు.