అన్నమయ్య: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం పట్టణంలోని దొంతి వీధి సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో ముగ్గురు సచివాలయ సిబ్బంది గైర్హాజరు కావడం.. రిజిస్టర్లో సంతకాలు లేకపోవడంపై తోటి సిబ్బందిని ఎమ్మెల్యే ఆరా తీశారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే వారిపై శాఖపరమైన చర్యలకు సిఫారసు చేస్తున్నట్లు వెల్లడించారు.
VZM: స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమం విజయవాడలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.
ప్రకాశం: రైతులు పండించిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన నిరసన ర్యాలీ అనంతరం కలెక్టర్ ఆఫీస్లో DRO ఓబులేష్కు వినతి పత్రం అందజేశారు.
AP: శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సరిహద్దు ప్రాంతం పట్టుపురం వద్ద నకిలీ కరెన్సీ నోట్లు మార్పు చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.57.25 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిలో ఒకరు వైసీపీ ఎంపీటీసీ కరజాడ గ్రామానికి చెందిన దాసర రవికుమార్ అని తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NZB: విద్యార్థిని కొట్టిన ఘటనలో టీచర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థిని తప్పు చేస్తే మందలించాల్సింది పోయి తీవ్రంగా దండించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు దేవిక, మనోజ్, రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
TG: అల్లు అర్జున్పై నమోదైన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో మృతిచెందిన రేవతి భర్త భాస్కర్ ఈ కేసును విత్ డ్రా చేసుకున్నట్లు వెల్లడించాడు. తొక్కిసలాట ఘటనతో బన్నీకి ఎటువంటి సంబంధం లేదని.. అతడిని విడుదల చేయాలని కోరాడు.
MNCL: దండేపల్లి మండలంలోని తాళ్లపేట ఎఫ్ఆర్ఓ కార్యాలయంలోని ఫర్నిచర్ను లక్షెట్టిపేట కోర్టు అధికారులు, శుక్రవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. అదే రేంజ్లో పనిచేస్తున్న బియ్యాల అంజన్నను అధికారులు తొలగించడంతో, గోదావరిఖనిలోని లేబర్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. అధికారులు కోర్టు ధిక్కరణ చేయడంతో ఫర్నిచర్ను కోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అన్నమయ్య: ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
WGL: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం రేవంత్ రెడ్డి, సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి వరంగల్ ఎంపీ కడియం కావ్య కలిశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, తదితర విషయాలపై కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
KKD: సామర్లకోట మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది వారి సమస్యల పరిస్కారం కోరుతూ సమ్మెలో ఉన్న సంగతి తెలిసిందే. తాగునీటి సరఫరా విషయంలో అధికారులు నాలుగు రోజులుగా ప్రత్యామ్నాయ సిబ్బందితో ఏర్పాట్లు చెయ్యగా శుక్రవారం వారుకూడా అందుబాటులో లేకపోవడంతో కుళాయిల్లో తాగునీటి సరఫరా నిలిచి పోయింది.
జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు గత జూలైలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ రాత పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను RRB తాజాగా విడుదల చేసింది. https://www.rrbcdg.gov.in/ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 7,951 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 16,17,18 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఇటీవల ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. సినిమాల పరంగా కంటే వ్యక్తిగత సమస్యలతో టాలీవుడ్ నటులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లైంగిక వేధింపులతో జానీ మాస్టర్ అరెస్ట్, ఎన్ కన్వెన్షన్ అంశం, సమంత-చైతూ విడాకుల విషయంలో నాగ్ ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం, మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు, అల్లు అర్జున్ అరెస్ట్.. ఇలా వరుస ఘటనలు ఇండస్ట్రీ వర్గాలను కలవరపరుస్తున్నాయి.
KMM: వ్యవసాయ మార్కెట్కు అధికారులు రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటించారు. శనివారం వారంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో ఈ రెండు రోజులు మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.
SRCL: కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్లలో స్కానింగ్ సెంటర్లను పీఓఎంహెచ్ఎన్ డాక్టర్ అంజలి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫారం ఎఫ్ ఆడిట్ రిజిస్టర్లను పరిశీలించారు. గర్భస్థ పూర్వ పిండ నిర్ధారణ వ్యతిరేక చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ జరిపిన నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నారు.
TG: అల్లు అర్జున్ను నాంపల్లిలోని 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. కోర్టు హాల్లో జనం ఎక్కువగా ఉండటంతో అనంతరం జడ్జి ఛాంబర్కు తరలించారు. హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్పై తీర్పు వచ్చాకే నాంపల్లి కోర్టులో రిమాండ్పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 4 గంటలకు హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై తీర్పు ఇవ్వ...