• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ABVP వర్ని అధ్యక్షునిగా పైసా వినోద్ కుమార్

నిజామాబాద్ జిల్లా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వర్ని శాఖ అధ్యక్షుడిగా వర్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పైసా వినోద్ కుమార్‌ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఇందూరు నగర కమిటీ బైటక్‌లో వినోద్ కుమార్‌ని ఎన్నుకున్నట్లు ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ తెలిపారు.

December 13, 2024 / 03:50 PM IST

రికార్డు స్థాయిలో వెస్టిండీస్ ఛేజింగ్

వరుసగా 11 వన్డేల్లో ఓటముల తర్వాత వెస్టిండీస్ ఓ సిరీస్ గెలిచింది. సెయింట్ కిట్స్ వేదికగా బంగ్లాదేశ్‌‌తో జరిగిన ఆఖరి వన్డేలో WI 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 3 వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ విధించిన 321 పరుగుల లక్ష్యాన్ని కేవలం 45.5 ఓవర్లలోనే విండీస్ ఛేదించింది. అరంగేట్ర ప్లేయర్లు అమీర్ జాంగూ (104 నాటౌట్), కార్టీ (95) రాణించారు. కాగా సెయింట్ కిట్స్ వేదికల...

December 13, 2024 / 03:48 PM IST

సోమల మండలం MEO -1గా కేశవరెడ్డి బాధ్యతలు స్వీకరణ

CTR: సోమల మండలం MEO -1గా K. కేశవరెడ్డి శుక్రవారం పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు. మండలంలోని పాఠశాలలను పర్యవేక్షణ చేస్తూ విద్యాభివృద్ధికి తన వంతు కృషిని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 శివ రత్నమ్మ, STU సంఘాల నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

December 13, 2024 / 03:45 PM IST

జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ విజేతలను అభినందించిన ఎమ్మెల్యే

BDK: భద్రాచలంకి చెందిన రామ్మోహన్ రావు, ఉత్తేజ్, సిద్దు జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజయం సాధించి గోల్డ్ మెడల్ సాధించారు. వారిని ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ప్రత్యేకంగా అభినందించారు. జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పథకం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

December 13, 2024 / 03:44 PM IST

హౌస్ అరెస్టుపై స్పందించిన MP అవినాశ్ రెడ్డి

KDP: మండల కేంద్రమైన వేముల పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించాల్సిన ప్రభుత్వం అధికారులను అడ్డుపెట్టుకుని ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన ఘాటుగా విమర్శించారు.

December 13, 2024 / 03:44 PM IST

నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLG: మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామంలో నూతనంగా 3.25 కోట్లతో మంజూరు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి MLA బత్తుల లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద మధ్యతరగతి బాలికలకు మెరుగైన ఉన్నత విద్యను అందించాలని లక్ష్యంతో ఇంటర్మీడియట్ కళాశాల భవన నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు.

December 13, 2024 / 03:44 PM IST

సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల

NLG: మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుతో, విద్యార్థులతో కలసి మాట్లాడి వారితో కబడ్డీ, వాలి బాల్ ఆటలను ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

December 13, 2024 / 03:44 PM IST

బన్నీ అరెస్టు తీరు సరికాదు: బండి సంజయ్

TG: అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. బన్నీ అరెస్టు తీరు సరికాదని అన్నారు. నేరుగా బెడ్ రూంకి వచ్చి అరెస్టు చేస్తారా?.. దుస్తులు కూడా మార్చుకోనివ్వకుండా అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. అల్లు అర్జున్‌కు గౌరవం ఇవ్వాలి.. నేరస్థుడిగా చూ...

December 13, 2024 / 03:42 PM IST

డిప్యూటీ స్పీకర్‌‌కు అభినందనలు

W.G: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఉండి నియోజకవర్గ కూటమి నాయకులు అభినందనలు తెలియజేశారు. శుక్రవారం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా కూటమి కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ జరిపి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి జనసేన ఇంఛార్జ్ నాగరాజు పాల్గొన్నారు.

December 13, 2024 / 03:42 PM IST

‘ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లపై పడివేయద్దు’

కోనసీమ: ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడవేయవద్దు అని తాటిపాక గ్రామ పంచాయతీ కార్యదర్శి తాడి ఏసు బాబు సూచించారు. రాజోలు మండలం తాటిపాకలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వరప్రసాద్ ఆదేశాలతో సర్పంచ్ కోటిపల్లి రత్నమాల సూచనలతో గ్రామంలో పారిశుధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరిస్తూన్నారని తెలిపారు.

December 13, 2024 / 03:41 PM IST

రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలి: ఎమ్మెల్యే

BDK: మణుగూరు మండలం చిక్కుడు కుంట గ్రామంలో DCMS వారి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని క్వింటా సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోరస్ ప్రకటించిందని వారు తెలిపారు.

December 13, 2024 / 03:40 PM IST

‘ముమ్మరంగా సాగుతున్న రోడ్ల పనులు’

ప్రకాశం: తర్లుపాడు గ్రామంలో గల కోట బజార్‌లో మీర్జపేట గ్రామంలో పంచాయితీ రాజ్ ఏఈ మహంకాలయ్య పర్యవేక్షణలో కాంట్రాక్టర్ కాలంగి శ్రీనివాసులు, రోశప్ప నాయుడు, నరసింహ ఆధ్వర్యంలో సీసీ రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ దుర్గా భవాని, కాశీరెడ్డి, పిన్నిక శంకర్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

December 13, 2024 / 03:39 PM IST

కేరళ తరహా విద్యా విధానాన్ని అమలు చేస్తాం: ఎమ్మెల్యే

BDK: కేరళ తరహా విద్యావిధానాన్ని అమలు చేస్తామని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతంగా చూడాలనే ఆలోచన అందరికీ ఉంటుందని అందుకు తగ్గట్టుగా విద్యా విధానం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

December 13, 2024 / 03:38 PM IST

అందరికీ వైద్య సేవలు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

PLD: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.19,46,096 చెక్కులను వారికి అందజేసారు.

December 13, 2024 / 03:35 PM IST

బాసర త్రిబుల్ ఐటీని సందర్శించిన మంత్రి సీతక్క

NRML: బాసర త్రిబుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి మంత్రి త్రిబుల్ ఐటీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రిబుల్ ఐటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

December 13, 2024 / 03:33 PM IST