TG: సంగారెడ్డిలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ ప్రారంభమైంది. మల్కాపూర్ చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ తిలకించటానికి ODF అధికారులు, స్థానికులు తరలివచ్చారు. ట్రయల్ రన్ తర్వాత యుద్ధ ట్యాంకర్లు సైన్యానికి అప్పగిస్తారు. ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ యుద్ధ ట్యాంకర్ల తయారీ జరుగుతుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏటా సైన్యానికి యుద్ధ ట్యాంకర్లను అందిస్తోంది.
చిత్తూరు: వరదయ్యపాలెం మండలంలో బుధవారం, గురువారం భారీ వర్షం కురిసింది. వర్షాల కారణంగా మరదవాడ గ్రామం సమీపంలోని దిగువ హరిజనవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. కాలువ పొంగిపొర్లి తెగడంతో గ్రామం చుట్టూ నీరు చేరిందని తెలిసింది. దీంతో ఎటు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
HNK: హనుమకొండ జిల్లాలోని గణపతి దేవాలయంలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కడప: జిల్లాలో జరుగుతున్న సాగునీటి ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలే అధికారులు చూడాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వం చేయకూడదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం దారుణం అన్నారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. రూ.5,500 కోట్లు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ప్రయాగ్రాజ్ సంగమ్ లో పనులను, మహాకుంభ్ ఎగ్జిబిషన్ సైట్ను ప్రధాని పరిశీలించారు. కాగా.. 2025 జనవరి 13 నుంచి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరగనుంది.
BDK: మణుగూరు మండలం చిక్కుడు కుంట గ్రామం నుంచి పినపాక మండలం రాయిగూడెం గ్రామ వరకు రూ.90లక్షల ఖర్చుతో నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే స్థానికలతో మాట్లాడి పలు సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
W.G: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నరసాపురం నూతన డీఎస్పీ డాక్టర్ జి.శ్రీవేద శుక్రవారం మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్కను అందజేశారు. గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపాలని డీఎస్పీకి మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
MDK: జిల్లా తూప్రాన్ పట్టణంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తూప్రాన్లో జరిగిన జన్మదిన వేడుకలకు శివంపేటకు చెందిన ఈసుగారి అరుణ్ అలియాస్ బబ్లు(18), మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన శ్రీనివాస్ గౌడ్, పాలాట గ్రామానికి చెందిన మహేందర్ హాజరయ్యారు. వీరు వెళ్తున్న బైక్ను మరో వాహనం ఢీకొనడంతో అరుణ్ చనిపోయాడు.
కడప: కడప-చెన్నై ప్రధాన రహదారిపై ఒంటిమిట్ట బస్టాండ్ వద్ద విచ్చలవిడిగా ఆవులు రహదారిపై అడ్డంగా ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ఆలయానికి, ఇటు కార్యాలయాలకు ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారని, ప్రమాదాల సంభవించే అవకాశం ఉందని అన్నారు. ఆవుల యజమానులపై అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం: ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ బూచిపెల్లి వెంకాయమ్మలతో మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకట్రెడ్డి, అన్నా రాంబాబు, కేపీ నాగార్జున రెడ్డి, మాజీ మంత్రి సురేష్ సమావేశమయ్యారు. నగరంలోనిప్రకాశం భవన్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా జరగనుంది.
WGL: వరంగల్లో తప్పిపోయిన బాలుడు నెల్లూరులో దొరికాడు. శివనగర్లోని ఓ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కుడ్ల యశ్వంత్ నిన్న మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నానని చెప్పి స్కూల్ నుంచి బయటికి వెళ్లాడు. రాత్రివరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు పరిశీలించి బాలుడిని నెల్లూరు RPF పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
తూ.గో: కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఇంగ్లీష్ ఉపాధ్యాయుని బూసి సువర్ణవేణికి గద్దర్ జాతీయ సేవా పురస్కారం లభించింది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మమత స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో పి.గన్నవరం సాయి తేజ జూనియర్ కళాశాలలో గురువారం పురస్కారాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి ఛైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్ పురస్కారాన్ని అందించారు.
MDK: అమృత్ 2.0 పథకంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 7 చెరువుల పరిధిలో రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో 7 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జలమండలి ఎస్టీపీ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
BHNR: యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా శుక్రవారం రోజు పదవి బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఎండీ అవేస్ ఉర్ రెహమాన్ చిస్తీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరుకానున్న పేర్కొన్నారు.
MNCL: జన్నారం పట్టణంలోని రాంనగర్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించి సిబ్బందికి ఎంపీడీఓ శశికళ సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల యాపులో వచ్చిన పేర్లు ఆధారంగా మండలంలోని పోన్కల్ గ్రామ ఈవో రాహుల్ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టణంలోని రామ్ నగర్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఎంపీడీఓ అక్కడికి వెళ్లి సర్వేను పరిశీలించారు.