ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’లో కామెడీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ ‘వేరే లెవెల్ ఆఫీస్’ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 50 ఎపిసోడ్స్తో రూపొందిన ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ అందుబాటులో ఉంది. మరో ఎపిసోడ్ ఇవాళ రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. కాగా ఈ సిరీస్ ఎపిసోడ్స్ ప్రతి గురువారం, శుక్రవారం రాత్రి 7 గంటలకు రిలీజ్ అవుతాయి.
AP: సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ‘పది సూత్రాలు ఒక విజన్’ పేరిట దీన్ని రూపొందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీనికి శ్రీకారం చుట్టారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితం అంటూ విజన్ డాక్యుమెంట్పై సీఎం సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కూటమి నేతలు హాజరయ్యారు.
NLG: త్రిపురారం మండలంలో కేంద్ర పశుగణాభివృద్ధి సంస్థ & పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చెన్నై పాలెం గ్రామంలో గోపాలమిత్ర పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 42 గేదెలు, 25 దూడలకు పలు రకాల వ్యాధులను గుర్తించి వాటికి సంబంధించిన మందులను ఇవ్వడం జరిగిందని మండల పశు వైద్యాధికారి CH. నాగేందర్ తెలిపారు. రాహుల్, శివారెడ్డి, అశోక్, రైతులు పాల్గొన్నారు.
KMR: మంత్రుల పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీల నాయకులను ముందస్తు అరెస్ట్లు చేయడం చూస్తుంటాం.. కానీ జుక్కల్లో అధికార పార్టీ నాయకుడినే ముందస్తు అరెస్ట్ చేసిన ఘటన జుక్కల్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. శుక్రవారం నిజాంసాగర్ నీటి విడుదల నిమిత్తం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
RR: భర్త వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన నాగలక్ష్మికి మనోజ్ అనే వ్యక్తితో ఇటీవల వివాహమైంది. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో నాగలక్ష్మి బుధవారం ఆన్లైన్లో విషం తెప్పించుకొని తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది.
HYD: ఆక్రమణలకు గురైన వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనం చేసుకోవాలని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల నష్టపోయిన ఆస్తులను కాపాడాలని జమాఅతె ఇస్లామీ హింద్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఖాలిద్ ముబషీర్ జఫర్ అన్నారు. శుక్రవారం చట్టబజార్లో కార్యదర్శి అబ్దుల్ హకీంతో కలిసి మాట్లాడారు. కులగణన ఆధారంగా జనాభా ప్రకారం ముస్లిం రిజర్వేషన్లు పెంచాలన్నారు.
ఛత్తీస్గ్ఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో రెండు 12-బోర్ తుపాకులు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన ...
SKLM: మున్సిపల్ కార్మికులకు పెంచిన మస్టర్ పాయింట్లను తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గతంలో ఉన్న మూడు మస్టర్ పాయింట్ల స్థానంలో 5 మస్టర్ పాయింట్లుగా పెంచడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
JGL: వెల్గటూర్ మండలం జగదేవ్పేట -చర్లపల్లి ప్రధాన రహదారి గుంతలు పడి నరకప్రాయంగా మారింది. రహదారిపై అడుగడుగునా పెద్ద పెద్ద గుంతలు, రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలు పెరిగి ఇబ్బందిగా మారిందని ప్రజలు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుపై గుంతలు పూడ్చి, రోడ్డుకి ఇరువైపులా పొదలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర శుద్ధ త్రయోదశి సందర్భంగా హనుమద్ వ్రతం కార్యక్రమం సామూహికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పూజలు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కడప: వేముల పోలీస్ స్టేషన్ వద్ద మీడియా ప్రతినిధులను పరామర్శించడానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం: నగరంలో శుక్రవారం జరుగుతున్న రైతు పోరాటానికి మద్దతుగా వైసీపీ శ్రేణులు పామిడి నుంచి భారీగా తరలి వెళ్లారు. పామిడితో పాటు మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలివెళ్లారు. జై జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ వాహనాల్లో బయలుదేరారు.
బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీలపై దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా పార్లమెంట్లో విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అక్కడి మైనారిటీల భద్రతకు చర్యలు తీసకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
చిత్తూరు: బి. కొత్తకోట పట్టణానికి చెందిన టీడీపీ నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కో-కన్వీనర్ కుడుము శ్రీనివాసులు సోదరుడు ఉదయ్ కుమార్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. ఉదయ్ కుమార్ మృతికి పలువురు కూటమి నాయకులు, స్థానిక ప్రజలు సంతాపం తెలియజేసారు. ఉదయ్ కుమార్ ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటన్నారు.
కాకినాడ: మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు కాకినాడలో శుక్రవారం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రైతాంగ సమస్యలకు వ్యతిరేకంగా పోరుబాట చేపట్టినట్లు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, ముద్రగడ పద్మనాభం, దవులూరి దొరబాబు, తదితరు నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ధర్నాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.