NZB: మోపాల్ మండలం కులాస్పూర్ సర్పంచ్ గుడి జనార్దన్రెడ్డి నిజామాబాద్ రూరల్ MLA రేకులపల్లి డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగా రెడ్డి, తాడేం సర్పంచ్ జలేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
PDPL: మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్డ్యాం గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలతో పూర్తిగా కప్పుకుపోయింది. ఇరువైపులా భారీగా పెరగడంతో నిల్వ నీరు తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. గుర్రపుడెక్క అధికంగా నీటిని పీల్చుకోవడంతో సాగునీటి సరఫరా దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం మొక్కలను తొలగించి చెక్డ్యాం పరిసరాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు.
VSP: అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ క్రికెటర్ శేఖర్కి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మంజూరైన రూ.3 లక్షల చెక్కును గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అందజేశారు. ఈ దందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
BHPL: మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి రమేష్ ఆధ్వర్యంలో GP సిబ్బంది డ్రైనేజ్ కాలువలోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలో మంచినీటి సరఫరాకు ఆటంకం కలగకుండా పైప్లైన్ లీకేజీ మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు.
అన్నమయ్య: వీరబల్లి మండలం దిగువరాచపల్లెలో ఆదివారం టీడీపీ పార్టీ గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. CM చంద్రబాబు నాయకత్వంతోనే పేదల ఆర్థిక ఉన్నతి,రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
JGL: రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన కట్ట గంగన్న ఇటీవల సౌదీ దేశంలో మరణించాడు. విషయం తెలుసుకున్న సౌదీ అల్లీపూర్ సంఘం సభ్యులు ఆదివారం అందరు కలిసి గంగన్న భార్యకు రూ. 1,36,830 ఆర్థిక సహాయం అందించారు. గంగన్న కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటామని వారు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వారిని గ్రామస్థులు అభినందించారు.
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం, సాలూరు పట్టణ కేంద్రాలలోడాగ్ స్క్వాడ్, బి.డి టీం సిబ్బందితో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పద వస్తువులను నిశితంగా పరిశీలించారు. ప్రజలను అప్రమత్తంతో పాటు, ఎలాంటి సంఘ విద్రోహ ఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలలో భాగంగా విస్తృత తనిఖీలు చేపట్టారు.
BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎన్నికలలో మున్నూరు కాపు కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ ఆదివారం పాల్గొన్నారు. రానున్న కాలంలో అన్ని కులాలు, మతాలు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వారితోపాటు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ జూపల్లి రమేష్ పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా పెద్ద మునగాళ్ చేడ్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు ఆదివారం వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఆయన తెలిపారు. ఐదేళ్ల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే చెప్పారు.
NDL: నంది కొట్కూరు మండలo, వడ్డెమానులో మారేమ్మ నూతన గుడిప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎమ్మెల్య జయసూర్య, మాండ్ర శివానంద రెడ్డి హాజరయ్యారు. ముందు తల్లి మారేమ్మ ను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ సర్పంచి దామోదర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
HNK: జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ డివిజన్ అధ్యక్షులు కుమ్మరి రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బూత్ కమిటీల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్య నాయకులు పాలు అడుగుల శివకుమార్ పాల్గొన్నారు.
శ్రీకాకుళంలోని జి.టి.రోడ్డులోని జామియా మసీదులో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడిపు నాయుడు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సీఐ తెలిపారు. అలాగే, ముస్లిం భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రశంసనీయమని కొనియాడారు.
KDP: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆయన నివాసంలో బద్వేల్కు చెందిన డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి శాలువా, పూల బొకే అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్లు ఆయన తెలిపారు.
BHNG: భువనగిరి 12వ వార్డు పగిడిపల్లిలో గత 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సర్వీస్ రోడ్డు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. కడమంచి రాములు ఇంటి వద్ద ఆగిపోయిన రోడ్డు పనుల గురించి ఆదివారం కౌన్సిలర్ తోటకూర విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించారు. గ్రామ పెద్దలు, యువత సహకారంతో అడ్డంకులను తొలగించి సర్వీస్ రోడ్డును క్లియర్ చేశారు.
కర్నూలు: ఎనిమిదో వేతన సంఘంనేపథ్యంలో జీతాల పెరుగుదల పై చర్చలు జరుగుతున్న వేళ, సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుని 8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్ పేరుతో వాట్సాప్ సందేశాలు పంపుతూ మోసగాళ్లు అమాయక ప్రజలను వలలో వేస్తున్నారన్నారు.