ADB: దొంగ వస్తువులు కొనుగోలు చేసిన ముజాహిద్ అనే స్క్రాప్ దుకాణ యజమానిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బోథ్ CI గురుస్వామి నిన్న తెలిపారు. దిగ్నూర్ గ్రామానికి చెందిన కొరెల్లి రామకృష్ణ అనే వ్యక్తి బోర్వెల్ పైపులను దొంగలించి ముజాహిద్కు అమ్మినట్లు వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
GNTR: నంబూరు-ఎర్రుపాలెం నూతన రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం యార్డ్ ఆధునీకరణ, పెద్దాపురం వరకు 3.52 కిలోమీటర్ల మేర కొత్త పట్టాల ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకోసం రూ. 36.2 కోట్ల వ్యయంతో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. ఈ అడుగుతో కొత్త రైల్వే లైన్ కల సాకారం దిశగా పనులు మరింత వేగవంతం కానున్నాయి.
BPT: వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శనివారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు.
విజయనగరంలో నేటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి.స్థానిక మార్కెట్లో చికెన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. వ్యాపారుల సమాచారం ప్రకారం కేజీ బ్రాయిలర్ చికెన్ సుమారు ₹285కు, స్కిన్లెస్ ₹275కు, బోనెలెస్ ₹295 వరకు విక్రయించబడుతోంది. నాటు కోడి ధరలు మాత్రం ₹300 పైగా ఉన్నాయి. షాపుల ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని పేర్కొన్నారు.
W.G: భీమవరంలో భవన, ఇతర నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో అమలవుతున్న పథకాలపై అవగాహన కార్యక్రమం ఎఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. భవననిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పెండింగులో ఉన్న 46 వేల క్లెయిములను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన కార్మికశాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్కు యూనియన్ తరఫున వినతిపత్రం అందజేశారు.
SRCL: జిల్లాలోని 1-10 తరగతి దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనంతరం దరఖాస్తు పత్రాలను కలెక్టరేట్లో సమర్పించాలన్నారు.
ATP: జిల్లాలో ఈనెల 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఆర్ఐవో వెంకట రమణనాయక్ తెలిపారు. మొత్తం 64 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఉదయం 8.15 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 24,568 మంది, ద్వితీయ సంవత్సరంలో 23,578 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
MNCL: మందమర్రి పట్టణం పులిమడుగు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ర లోడుతో రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందన్నారు.
WGL: రాయపర్తి మండలం మైలారం సబ్స్టేషన్ పరిధిలోని వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి సహకరించాలని సబ్ ఇంజనీర్ సయ్యద్ ముజాఫర్ అహ్మద్ కోరారు. ఆదివారం మైలారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక బిల్లుల సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
RR: మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధిలో గల బడంగ్పేట్ డివిజన్లో ది మాస్టర్ మైండ్ స్కూల్ 5వ వార్షికోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. మాజీ మేయర్ మాట్లాడుతూ.. ఈ విద్యాసంస్థలు అంచలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు.
SKLM: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ రోడ్డులో శనివారం సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ద్విచక్రవాహనం పై 6 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న గంజాయిని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గంజాయి రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు ఉంటాయని సీఐ అన్నారు
ASR: జీ.మాడుగుల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు శనివారం ఫేర్ వెల్ పార్టీ నిర్వహించారు. ఇందులో బాగంగా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జీ.మాడుగుల ఏటీడబ్ల్యూవో నాగ శిరీష విద్యార్థులకు సూచించారు. సమయం వృథా చేయకుండా అన్ని సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
SRPT: నూతనకల్ మండలం పెద్దనేమిల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2లోని సదరు టీచర్ 19న సెలవులో ఉండి కూడా హాజరు పట్టీలో సంతకం చేశారని, 21న ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారని గ్రామస్థులు ఆరోపించారు. పిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని, బాధ్యత రహితంగా వ్యవహారిస్తున్న టీచర్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
SRCL: జిల్లాలో ఈరోజు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన వాయిదా పడింది. గంభీరావుపేట మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన హాజరుకావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం రద్దయినట్లు డిప్యూటీ సీఎం ప్రైవేట్ సెక్రటరీ ప్రకటించారు. పర్యటనకు సంబంధించిన తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
KDP: వైసీపీ రాష్ట్ర అనుబంధ వింగ్ కమిటీ సభ్యులను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఇందులో భాగంగా కడప జిల్లా బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా మైలవరం మండలం తొర్రి వేముల సుబ్బయ్యను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన YS జగన్కు జిల్లా వైసీపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.