• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మెగాస్టార్‌తో నాగ్ అశ్విన్ మూవీ..?

‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక భారీ కథను సిద్ధం చేశాడట. ఇది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి సీక్వెల్ లేదా పక్కా మైథలాజికల్ డ్రామా అని టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, తెలుగు సినిమాలో మరో అద్భుత దృశ్యకావ్యం ఖాయమని సినీ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

February 20, 2026 / 01:56 PM IST

ఆలోచనలే మన జీవితాన్ని మార్చేస్తాయి: రేవంత్

TG: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో CM రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోని టెక్నాలజీ దిగ్గజాలన్నీ ఈ సదస్సుకు వచ్చాయి. ఆలోచనలే మన జీవితాన్ని మార్చేస్తాయి. వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయి. మనిషికి ఎన్నో పరిమితులు ఉండొచ్చు. ఇప్పుడు మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన AI ఫలితాలు మనం చూస్తున్నాం’ అని అన్నారు.

February 20, 2026 / 01:55 PM IST

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న కమిషనర్

కృష్ణా: గుడివాడ లోని కార్మికానగర్, సాయినగర్, చెంచుపేట ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ మనోహర్ శుక్రవారం పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం తాగునీటి సరఫరా వ్యవస్థను సమీక్షించి, ఎక్కడైనా లీకేజీలు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించి సరిదిద్దాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

February 20, 2026 / 01:51 PM IST

పట్టణ అభివృద్ధికి కట్టుబడాలి: ఎమ్మెల్యే జారే

BDK: అశ్వారావుపేట మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన బాధ్యత ఎంతో ఉన్నత మైందని ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం పట్టణ అభివృద్ధికి కట్టుబడి పని చేయడం ప్రతి ఒక్కరికీ బాధ్యత అని గుర్తు చేశారు.

February 20, 2026 / 01:49 PM IST

‘అలాంటి పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలి’

ATP: గుంతకల్‌లోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థ ఎదుట శుక్రవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం పూర్తవకముందే ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలని, ఫీజుల దోపిడిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.

February 20, 2026 / 01:49 PM IST

రాజీ కుదిరేనా? రాజకీయ వర్గాల్లో ఆసక్తి

అన్నమయ్య: సుగవాసి ప్రసాద్ బాబు – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మధ్య విభేదాలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. మార్చి 2న అన్నమయ్య పార్లమెంట్ అధ్యక్షుడిగా సుగవాసి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, కార్యక్రమానికి మంత్రి హాజరవుతారా? అనే అంశం కార్యకర్తల్లో ఆసక్తి రేపుతోంది. నాయకుల మధ్య విభేదాలు పార్టీపై ప్రభావం చూపుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

February 20, 2026 / 01:47 PM IST

‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభం..!

‘కల్కి 2’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ‘కల్కి 2’ షూటింగ్ హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇప్పటికే సెట్స్‌లో అడుగుపెట్టగా.. ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభాస్, సాయి పల్లవి కూడా ఈ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు టాక్.

February 20, 2026 / 01:47 PM IST

ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు తప్పనిసరి: AEO

MBNR: గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ గడువు సమీపిస్తుండటంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందేందుకు రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని AEO వరలక్ష్మి సూచించారు. ఆధార్ భూ యాజమాన్య పాస్‌బుక్, బ్యాంక్ వివరాలతో సమీప మీసేవ కేంద్రాల్లో నమోదు చేయాలని తెలిపారు. ఫిబ్రవరి 28 చివరి తేదీగా ఉండటంతో గడువులోపు నమోదు పూర్తి చేయాలని కోరారు.

February 20, 2026 / 01:45 PM IST

‘ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి’

W.G: మొగల్తూరు డీసీసీబీ బ్రాంచ్ వద్ద సహకార సంఘ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం ఐదవ రోజుకు చేరుకుంది. ఉద్యోగుల జీతాల పెంపు వల్ల ప్రభుత్వానికి పైసా భారం ఉండదని, సహకార సంఘాల లాభాల నుంచే చెల్లింపులు జరుగుతాయని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.

February 20, 2026 / 01:45 PM IST

గోదావరి మోక్షధామం స్మశాన వాటికకు శంకుస్థాపన

W.G: పెనుగొండ మండలం సిద్ధాంతంలో వశిష్ఠ గోదావరి నది ఒడ్డున రూ. 3 కోట్లతో గోదావరి మోక్షధామం స్మశాన వాటిక నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజమండ్రి తర్వాత గోదావరి జిల్లాల్లో ఈ తరహా స్మశాన వాటిక నిర్మాణం ఈ ప్రాంతంలోనే జరుగుతుందని, అత్యాధునిక హంగులతో స్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

February 20, 2026 / 01:43 PM IST

స్మశాన వాటిక అభివృద్ధి పనుల పరిశీలన

ELR: కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ ఎంపీ నిధుల నుంచి స్మశాన వాటిక అభివృద్ధికి ఇటీవల రూ. 20 లక్షలు కేటాయించారు. స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిన అనంతరం శుక్రవారం స్మశాన వాటిక అభివృద్ధి పనులను కూటమి నాయకులు పరిశీలించారు. అలాగే పనులు చాలా నాణ్యతగా జరగాలని త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.

February 20, 2026 / 01:42 PM IST

సమస్య పరిష్కారానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

BDK: ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అనుసరించాలని ప్రజలకు సత్వర న్యాయం అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఇల్లందు డిఎస్పీగా నూతనంగా నియమితులైన వెంకన్న బాబు శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన డీఎస్పీనీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లందు ప్రాంతంలో శాంతిభద్రతలపై ఇరువురు చర్చించారు.

February 20, 2026 / 01:42 PM IST

‘వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి’

KMM: నవసకం ఆధ్వర్యంలో మధిర మండలం సిరిపురం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. వారితోపాటు గ్రామీణ వైద్యులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 01:42 PM IST

‘ది హండ్రెడ్’లో పాక్ ప్లేయర్లకు ‘నో’!

2008 ముంబై దాడుల తర్వాత 2009 నుంచి IPLలో పాక్ ప్లేయర్లను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్-‘ది హండ్రెడ్’లో కూడా పాక్ ప్లేయర్లను తీసుకునేందుకు 8 ఫ్రాంచైజీలలో 4 నిరాకరిస్తున్నాయట. ఈ MSG, MI లండన్, సథరన్ బ్రేవ్(క్యాపిటల్స్), సన్‌రైజర్స్ లీడ్స్‌లకు ఓనర్స్ IPL ఫ్రాంచైజీలే కావడం ఇందుకు కారణం. అందుకే SA20లోనూ నసీం షా, మహ్మద్ నవాజ్ మినహా ఎవరూ ఆడలేదు.

February 20, 2026 / 01:42 PM IST

అమరవాయి గ్రామంలో పింఛన్ల పంపిణీ సౌకర్యం

GDWL: అమరవాయి గ్రామ వృద్ధులు, దివ్యాంగుల పింఛన్ల అందుబాటును సులభతరం చేయడానికి సర్పంచ్ పి. హుస్సేన్ పంచాయతీలోనే పంపిణీ చేపట్టాలని సూచించారు. శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ని కలసి వినతిపత్రం అందజేశారు. అధికారి సానుకూల స్పందన తెలిపినట్లు సర్పంచ్ తెలిపారు.

February 20, 2026 / 01:42 PM IST