PDPL: ముత్తారం మండలం ఒడేడు గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. ఆదివారం కజ్జం రమణయ్య బంధువుల ప్రథమ వర్ధంతి కోసం ఆదిలాబాద్ వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని రూ.10వేల నగదు అపహరించారు. గతంలోనూ ఆయన ఇంట్లో చోరీ జరగడం గమనార్హం. బాధితుడి ఫిర్యాదు మేరకు ముత్తారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.