• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రూ. 18 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం

KNR: చొప్పదండి పట్టణంలోని రెండవ వార్డులో గౌరవ ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యమన్న, కౌన్సిలర్ కొట్టె అశోక్ చొరవతో రూ. 18 లక్షల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. తుమ్మ రాములు ఇంటి నుంచి వెంకట్ రెడ్డి ఇంటివరకు అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, చెట్పెల్లి రాజ్ కొమురెళ్లి ఇంటి నుంచి వెంకట్ రెడ్డి ఇంటివరకు సీసీ రోడ్డు పనులు మొదలయ్యాయి.

February 23, 2026 / 05:08 PM IST

‘మరణాల నివారణకు సకాలంలో వైద్యం అందించాలి’

AKP: మాతా, శిశు మరణాల నివారణకు సకాలంలో సేవలు అందించాలని జిల్లా టాస్క్ ఫోర్స్ ప్రధాన అధికారి డాక్టర్ జె.ప్రశాంతి సూచించారు. సోమవారం టాస్క్ ఫోర్స్ బృందం హరిపాలెం పీహెచ్‌సీ పరిధిలోని ఎం.జగన్నాధపురం విలేజ్ హెల్త్ క్లినిక్‌ను సందర్శించారు. గర్భిణీలు, పిల్లల నమోదు, హైరిస్క్ కేసుల గుర్తింపు, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు.

February 23, 2026 / 05:07 PM IST

బాలీవుడ్‌లో నన్ను తొక్కేశారు: ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడం, కావాలని తనను పక్కన పెట్టడంతోనే తాను హాలీవుడ్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఆ సమయంలో తాను తీవ్ర ఒత్తిడికి గురైనట్లు పేర్కొంది. హాలీవుడ్‌లో ఎన్ని విజయాలు వచ్చినప్పటికీ, భారతీయ చిత్రాల్లో నటించేందుకే తాను ఎప్పుడూ మొగ్గు చూపుతానని వెల్లడించింది.

February 23, 2026 / 05:07 PM IST

అసెంబ్లీలో కార్మికుల సమస్యలపై పార్థసారథి

KRNL: అసంఘటిత కార్మికుల సమస్యలను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. విపత్తు వేళల్లో కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ‘ఈ-శ్రామ్’ పథకాన్ని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కార్మిక నిధులను మళ్లించిందని ఎమ్మెల ఆరోపించారు. పేదలు ఎక్కడైనా రేషన్ పొందే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

February 23, 2026 / 05:06 PM IST

పోలీసులకు దొరికితే హెల్మెట్ ఫ్రీ

HYD: హెల్మెట్ లేకుండా పట్టుబడితే FINEతో పాటు పోలీసులు FREEగా హెల్మెట్ ఇస్తున్నారు. మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగం ‘హెల్మెట్ బ్యాంక్’ పేరుతో పోలీసులు సంగీత్ చౌరస్తాలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. బైకర్ వివరాలు నమోదు చేసి హెల్మెట్ తీసుకోవచ్చు. 24 గంటల్లోపు సొంతంగా హెల్మెట్ కొనుక్కుని పోలీసుల వద్ద తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి.

February 23, 2026 / 05:05 PM IST

గోవర్ధన గిరిధారిగా లక్ష్మీనరసింహుడు

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. నేడు స్వామివారు గోవర్ధన గిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రాల సాక్షిగా, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది. ఆలయ అర్చకులు, అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు.

February 23, 2026 / 05:05 PM IST

‘పనితీరు మారకుంటే ఇంటికి వెళ్లండి’

VSP: జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదుల (PGRS) పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న పదిమంది అధికారులను హెచ్చరిస్తూ, “పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోండి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

February 23, 2026 / 05:05 PM IST

సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే భూమి పూజ

ASF: చింతలమానేపల్లి మండలంలో 23 గ్రామాల ప్రజలు లో-ఓల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని MLA హరీష్ బాబు చొరవ తీసుకుని 33/11KV సబ్ స్టేషన్‌ను ఇటీవల మంజూరు చేయించారు. ఈ మేరకు సోమవారం 33/11KV సబ్ స్టేషన్‌కు MLA భూమి పూజ నిర్వహించారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

February 23, 2026 / 05:04 PM IST

మున్సిపల్ ఛైర్మన్‌ను సన్మానించిన అధ్యాపకులు

నిర్మల్ నూతన మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన అప్పల కావ్య గణేష్ చక్రవర్తిలను ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల అభివృద్ధి కొరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.

February 23, 2026 / 05:02 PM IST

గురుకుల డిగ్రీ ప్రవేశాల కరపత్రాల ఆవిష్కరణ

ADB: ఉట్నూరు ప్రభుత్వ గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశాల కరపత్రాలను ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్ సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. గురుకులాల్లో ఉచిత వసతితో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన గిరిజన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీవాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 05:02 PM IST

పదో తరగతి పరీక్షలకు 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు: డీఈవో

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 7228 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో హాజరుకానున్నారని వనపర్తి డీఈవో అబ్దుల్ ఘనీ తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 37 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 37 మంది సూపర్డెంట్లు, 37 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.

February 23, 2026 / 05:02 PM IST

అన్నమయ్య: పాత రాయచోటిలో పిచ్చి కుక్క సైరవిహారం

అన్నమయ్య: పాత రాయచోటిలో పిచ్చి కుక్క హల్‌చల్. సోమవారం కుక్క దాడిలో ఇద్దరికీ గాయాలు కాగా, స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు.గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.వీధి కుక్కల బెడదపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 05:01 PM IST

రాయదుర్గంలో రెండు రోజులు నీటి సరఫరా బ్రేక్

అనంతపురం: రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజులపాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. టి వీరాపురం వద్ద పైప్ లైన్ లీకేజీ కారణంగా మరమ్మత్తులో భాగంగా 24, 25వ తేదీలలో నీటి సరఫరా ఉండదని తెలిపారు. కావున రెండు రోజులపాటు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని కోరారు.

February 23, 2026 / 05:01 PM IST

కామారెడ్డి ఎమ్మెల్యేతో ఎంపీ డీకే అరుణ భేటీ

KMR: జిల్లా కేంద్రంలో 5 రోజుల నుంచి నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మహబూబ్ నగర్ MP డీకే అరుణ కామారెడ్డికి చేరుకున్నారు. MLA క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించిన తీరుపై, ఉద్రిక్త పరిస్థితుల గల కారణాలను MLA రమణారెడ్డిని అడిగి తెలుసుకోనున్నారు. ఆయనతో భేటీ అనంతరం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 05:00 PM IST

నగరిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం

CTR: పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశాయి. మొదటి విడతగా నగరి మున్సిపాలిటీకి 454 ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తమ కల నెరవేరుతోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

February 23, 2026 / 05:00 PM IST