NLR: భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో చిట్టమూరు మండలం గుణపాడు వద్ద ఉన్న స్వర్ణముఖి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బ్రిడ్జిపై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోలను నిలిపివేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు.
NLR: పొదలకూరు మండలంలో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల నుంచి తేలికపాటి వర్షం పడుతుంది. మండలంలోని పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షం రాకతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. పనులకు వెళ్లే కూలీలు అవస్థలు పడుతున్నారు.
BDK: చర్ల ప్రభుత్వం మంజూరు చేసిన 108 వాహనాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు అన్నారు. సత్యనారాయణపురం పీహెచ్సీలో 108ను ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ వాహనాన్ని మంజూరు చేసిందన్నారు.
KMM: వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ కింద విధంగా ఉన్నట్లు మార్కెట్ కమిటీ సభ్యులు ప్రకటించారు. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.16,700లు, కొత్త మిర్చి ధర రూ.15,849లు పలికింది. క్వింటా పత్తి ధర రూ.7,200లు జెండా పాట పలకగా.. నిన్నటితో పోల్చితే కొత్త మిర్చి ధర రూ.252లు తగ్గగా అటు ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
KMM: వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ కింద విధంగా ఉన్నట్లు మార్కెట్ కమిటీ సభ్యులు ప్రకటించారు. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.16,700లు, కొత్త మిర్చి ధర రూ.15,849లు పలికింది. క్వింటా పత్తి ధర రూ.7,200లు జెండా పాట పలకగా.. నిన్నటితో పోల్చితే కొత్త మిర్చి ధర రూ.252లు తగ్గగా అటు ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
NZB: ఈనెల 14న కౌలాస్ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో కామారెడ్డి జిల్లా బాయ్స్ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీల ఎంపికలు జరుగుతాయని పీడీ సతీష్ రెడ్డి తెలిపారు. 01.01.2010 తర్వాత జన్మించిన వారి ఉండాలి. జనన ధ్రువీకరణ పత్రంతో పోటీలో ఎంపికకు క్రీడాకారుల హాజరుకావాలని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
WGL: వరంగల్ 20వ డివిజన్ పరిధిలోని పద్మనగర్ స్మశానవాటిక వద్ద చెత్త విపరీతంగా పేరుకుపోయి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని డివిజన్ కార్పొరేటర్ నరేంద్రకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కార్పొరేటర్ ఈరోజు మున్సిపల్ సిబ్బందితో చెత్త తొలగించే కార్యక్రమం చేపట్టారు.
TG: సంగారెడ్డిలోని మల్కాపూర్ చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో యుద్ధట్యాంకర్లను రూపొందించారు. ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించిన అనంతరం యుద్ధ ట్యాంకర్లను సైన్యానికి అప్పగిస్తారు. కాగా.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏటా సైన్యానికి యుద్ధ ట్యాంకర్లను అందేజేస్తాను.
ASF: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ తిర్యాని మండల అధ్యక్షులు చిత్తూరు సాగర్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన కళ్యాణ అరుణకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 50వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన అందజేశారు. నిరుపేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు.
అల్లూరి: అరకులోయ మండలంలో ఉన్న నాలుగు నీటి వినియోగదారుల సంఘాలకు ఈ నెల 14న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎమ్ఐ జెఈ నాగరాణి తెలిపారు. మండలంలో సిమిలిగూడ, హాట్టగూడ, చినలబుడు, గరడగూడ నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు జరుగుతాయన్నార జరుగుతాయన్నారు. శనివారం ఆయా ఆయకట్టు కింద ఉన్న ఓటర్లు స్ధానిక సచివాలయాల వద్ద నిర్వహించే ఎన్నికలో పాల్గొనాలని ఆమె తెలిపారు.
AP: ఇవాళ స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తొలి ప్రసంగం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు డాక్యుమెంట్ను సీఎం ఆవిష్కరించిన తర్వాత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:45 నుంచి 1:30 వరకు సీఎం చంద్రబాబు ప్రసంగం తర్వాత ఉపముఖ్యమంత్రి పవన్ మాట్లాడనున్నారు.
KNL: కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎంపీపీ బుగ్గన నాగభూషణ్ రెడ్డి నగర్ పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి వైసీపీ నాయకులు బాబుల్ రెడ్డి, ముర్తు జావలి, నాగరాజు, రామచంద్రుడు అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు అన్నదాతకు వైసీపీ అండగా జిల్లా కేంద్రమైన నంద్యాలలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి బేతంచర్ల నుంచి భారీగా వెళ్లారు.
HYD: దూల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది నెలలుగా గంజాయి విక్రయ కేసులో ప్రమేయం ఉన్న అంగూరి బాయిని విశ్వసనీయ సమాచారం మేరకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితురాలిపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైనట్లు చెప్పారు.
TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగుకు నీటిని మంత్రి విడుదల చేయనున్నారు. అనంతరం ఆయన శ్రీరామ్సాగర్ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆ తర్వాత శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుపై అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించనున్నారు.
RR: చంపాపేట డివిజన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి సూచించారు. డివిజన్ పరిధిలోని బైరామల్ గూడా ఓల్డ్ బస్తీలో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తుండాలని కోరారు.