MNCL: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి రక్షణలో విధిగా భాగస్వామి కావాలని సేఫ్టీ కమిటీ కన్వీనర్ హబీబ్ హుస్సేన్, మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ అన్నారు. మందమర్రి ఏరియాలోని శాంతిఖని గని పై రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా రక్షణ కమిటీ పర్యటించింది. గనిలో చేపడుతున్న రక్షణ చర్యలను కమిటీ సభ్యులు తనిఖీ చేశారు.
ATP: కూడేరు మండల కేంద్రంలో ఈనెల 13న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి నూతన విగ్రహ కలశ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఆలయ అర్చకుడు రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 7 గంటలకు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని కావున మండల ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు.
KMR: ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎల్లారెడ్డి పాఠశాల మైదానంలో ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో RDO, ఉపాధ్యాయులు, స్థానిక మండల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన 70 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. వారికి జనసేన కండువాలు వేసి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తిమ్మయ్య, నారాయణ స్వామి, సూర్యనారాయణ, మణికంఠ పాల్గొన్నారు.
BHPL: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంగళవారం తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సాధారణ తనిఖీలో భాగంగా గోడౌన్లోని సీసీ కెమెరాలు, భద్రతా పరిస్థితులను సమీక్షించినట్లు తెలిపారు. గోదాం భద్రతకు ఎల్లప్పుడు పటిష్ఠ, సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, భద్రత మరింత పెంచాలని అధికారులను సిబ్బందిని సూచించారు.
KNR: కథలాపూర్ మండలకేంద్రంలోని జడ్పీ హైస్కూల్ను జిల్లా విద్యాధికారి రాము మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా తయారు చేస్తున్నారని నిర్వాహకులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణ నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలను పరిశీలించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
E.G: ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభ, ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మంగళవారం సానా సతీష్ను కలిశారు. ఆయనను రాజ్యసభ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేయడంతో వారు సతీష్కు అభినందనలు తెలియజేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశారని, తగిన గుర్తింపు లభించిందని అన్నారు. ఆయన మరింత ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఎమ్మెల్యే అన్నారు.
MNCL: మావోయిస్టుల రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వేమనపల్లి మండలం ఎస్సై శ్యామ్ పటేల్ తనిఖీలు చేపట్టారు. వేమనపల్లి సరిహద్దు ప్రాణహిత పుష్కర ఘాట్ వద్ద అవతలి వైపు మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పడవలు నడిపే వారితో మాట్లాడుతూ.. అనుమానాస్పద వ్యక్తులు పడవెక్కితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
KMM: చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టి ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించాలని సీఐటీయూ మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ కోరారు. అశా వర్కర్ల ఆక్రమ అరెస్టులను ఖండిస్తూ నెహ్రూ సెంటర్లో అందోళన నిర్వహించారు. ఆశాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ATP: గుంతకల్లు మండలం నెలగొండ గ్రామంలో మంగళవారం తహశీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేలకొండ గ్రామంలో హిందూ స్మశాన వాటికకు స్థలము కేటాయించాలని గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీపీ మాధవి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
HYD: రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వర్లపల్లి రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎం.శివానంద్ ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మంగళవారం జరిగిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఫీజు బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు.
KNR: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏసీ బస్సు సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ, కరీంనగర్ ఆర్ఎం బి. రాజు తెలిపారు. ఈనెల 31 వరకు ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్, రాజధాని బస్సు సర్వీసుల్లో ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. కావున, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
HYD: తెలంగాణపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని థియేటర్లో పుష్ప 2 చూస్తూ ముద్దానప్ప అనే అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షో ముగిశాక కూడా అతను సీటులో అలానే కూర్చొని ఉండగా.. మిగతా ప్రేక్షకులకు అనుమానం వచ్చి థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి కుటుంబీకులు.. ముద్దానప్ప తొక్కిసలాట వల్లే చనిపోయాడని ఆందోళనకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున...
AP: మూడు రాజ్యసభ స్థానాలకు బీద మస్తాన్రావు, సానా సతీశ్, ఆర్. కృష్ణయ్య నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. బీసీలకు టీడీపీ ఎప్పుడూ పెద్ద పీట వేస్తుందన్నారు. ఇప్పుడు కూడా ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఆర్.కృష్ణయ్య జాతీయ బీసీ నాయకుడు.. ఆయనపై కామెంట్ చేసేవాళ్లకు బుద్ధి, జ్ఞానం లేదని మండిపడ...