వనపర్తి జిల్లా వ్యాప్తంగా 7228 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో హాజరుకానున్నారని వనపర్తి డీఈవో అబ్దుల్ ఘనీ తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 37 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 37 మంది సూపర్డెంట్లు, 37 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.