• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రొద్దుటూరు వీధుల్లో స్థానికుల ఇబ్బందులు

KDP: ప్రొద్దుటూరు వీధుల్లో ఆవులు తిండి కోసం చెత్త కుప్పల్లో తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలు, చిన్నపాటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆవులను గోశాలలకు తరలించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఆవులకు యజమానులు ఉన్నా ఆవులను పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు.

October 12, 2025 / 10:35 AM IST

గంజాయి అమ్ముతూ ఇద్దరు అరెస్ట్

MDCL: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్ ఆదర్శ నగర్‌లో గంజాయి సప్లై చేస్తున్న దిలీప్ కాలే(28), తేజాస్ మంజునాధ్(20)ను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పోలీసులు 7.60 కేజీల పొడి గంజాయి, 3 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

October 12, 2025 / 10:34 AM IST

ఈ నెల 28న మఠాధిపతి నియామకంపై సమావేశం

KDP: బ్రహ్మంగారిమఠం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతి నియామక విషయమై ఈ నెల 28వ తేదీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం తెలిపారు. మఠం శిష్యులతో సమావేశం ఉంటుందని, భక్తులు హాజరై సలహాలు, సూచనలు లిఖిత పూర్వకంగా తెలపవచ్చన్నారు. పోస్ట్ ద్వారా కూడా అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చన్నారు.

October 12, 2025 / 10:34 AM IST

శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్.. ఈనెల 29 నుంచి టెండర్లు!

HYD: సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి ఈనెల 29న టెండర్ల నోటిఫికేషన్ జారీకి హెచ్ఎండీఏ సిద్ధమైంది. ఈప్రాజెక్టుకు కీలకమైన రక్షణ శాఖ భూముల అప్పగింత కొలిక్కి రావడంతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే డైయిరీఫాం కారిడార్ పనులు మొదలయ్యాయి.

October 12, 2025 / 10:33 AM IST

కూతురి వెంట పడొద్దన్నందుకు దాడి

NRPT: తన కూతురి వెంటపడొద్దని చెప్పిన తండ్రిపై ఓ యువకుడు దాడి చేసిన ఘటన NRPT(D) ఉట్కూరు (M) మద్దుమ్పూర్‌లో జరిగింది. స్థానికులు వివరాల ప్రకాం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూతురి వెంట అదే గ్రామానికి చెందిన బీరేందర్ పడేవాడు. యువకుడిని యువతి తండ్రి మందలించాడు. శనివారం కోపంతో బీరేందర్ కత్తితో దాడికి చేయగా యువతి తండ్రి ఎడమచేయి మణికట్టుకు గాయమైంది.

October 12, 2025 / 10:33 AM IST

రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం

SKLM: బారువ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు మీద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు GRP హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు ఇవాళ తెలిపారు. మృతుడు గుర్తులు తెలియని రైలు నుంచి జారిపడి ఉండవచ్చునన్నారు. అతని గుండెపై స్వాతి అనే పచ్చబొట్టు, ఓం నమశ్శివాయ అని రాసి ఉందని పేర్కొన్నారు. మృతుడు వయసు సుమారు 35-45 సంవత్సరాలు మధ్యలో ఉంటుందన్నారు.

October 12, 2025 / 10:31 AM IST

పండించిన ప్రతి గింజను కొంటాం: ఎమ్మెల్యే

NLG: రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, భాగ్యనగర్, చీకటిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, నకిరేకల్ మార్కెట్ ఛైర్ పర్సన్ గుత్తా మంజుల, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

October 12, 2025 / 10:29 AM IST

నగరంలో మాల్స్‌పై అధికారుల స్పెషల్ డ్రైవ్

HYD: గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్లలోని షాపింగ్ మాల్స్‌లో శనివారం జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఏఎంసీ శ్రావణ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఈ ప్రాంతాలను పరిశీలించారు. మాల్స్‌లో చెల్లుబాటు అయ్యే ట్రేడ్ లైసెన్సులు, ఆస్తిపన్ను బకాయిల కోసం దుకాణాలను తనిఖీ చేశారు.

October 12, 2025 / 10:29 AM IST

బీసీ బంద్ పిలుపు.. ఓయూ మద్దతు

HYD: ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్‌కు పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్యకు ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు పూర్తి మద్దతు తెలిపాయి. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఐక్య విద్యార్థి సంఘాల నాయకుడు బొల్లేపల్లె స్వామి ఈ వివరాలు వెల్లడించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసిఎన్నికలు నిర్వహించాలి.

October 12, 2025 / 10:27 AM IST

విశాఖ చేరుకున్న మంత్రి నారా లోకేష్

విశాఖ: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆదివారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకోగానే పలువురు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లోకేష్ పలు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

October 12, 2025 / 10:26 AM IST

ఈ నెల 14వ తేదిన “తెప్పోత్సవం”

VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అనంతరం వచ్చే మంగళవారం14వ తేదిన పెద్దచెరువులో తెప్పోత్సవం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే స్టేషను గాఢీఖానా సమీపంలో ఇప్పటికే చదును పనులు చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు వనం గుడిలో వేదసభ, అమ్మవారికి పంచామృతాభిషేకాల అనంతరం ఊరేగింపుగా ఉత్సవ విగ్రహాన్ని తరలిస్తారు. 5 గంటలకు తెప్పోత్సవం జరుగుతుందని ఈఓ శిరీష పేర్కొన్నారు.

October 12, 2025 / 10:24 AM IST

వామ్మో మటన్.. గ్రాము రూ.1

HYD: నగరంలోనే కాదు, శివారులో కూడా మటన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు ఆదివారపు విందుగా మిగిలిన మటన్ ఇప్పుడు విలాస వంటకంగా మారింది. నెల రోజులుగా కిలో మటన్ ధర రూ.1000గా కొనసాగుతోంది. మేకల, గొర్రెల కొరత, రవాణా ఖర్చులు పెరగడంతో ధరలు ఎగబాకినట్లు దుకాణదారులు చెబుతున్నారు. ఇంత ఖరీదైనా, కొనుగోలుదారులు వెనుకడుగు వేయకుండా, దుకాణాల వద్ద భారీ క్యూ కనిపిస్తోంది.

October 12, 2025 / 10:22 AM IST

గచ్చిబౌలి AIG హాస్పిటల్లో దారుణం

HYD: గచ్చిబౌలి AIG హాస్పిటల్లో లివర్ వ్యాధితో చేరిన కత్బుల్లాపూర్ గాంధీనగర్‌కు చెందిన మురళీధర్(40) చికిత్స పొందుతూ మృతి చెందాడు. జీవన్‌దాన్‌లో అప్లికేషన్ పెట్టగా.. హాస్పిటల్ సిబ్బంది అతని వయస్సు 60 సంవత్సరాలుగా చూపడంవల్లే డోనర్స్ రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.85 లక్షలు చెల్లించినా.. మిగిలిన రూ.14లక్షలు కడితేనే మృతదేహం ఇస్తామంటున్నారు.

October 12, 2025 / 10:22 AM IST

డీప్ ఫేక్ వీడియోలతో మోసం: దేవినేని

NTR: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోషల్ మీడియాలో ఏఐ వీడియో ద్వారా జరుగుతున్న మోసాలపై X వేదికగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది సైబర్ నేరగాళ్లు పార్టీ నాయకులు,కార్యకర్తలకు ఫేక్ ఆడియో వీడియో కాల్స్ చేస్తున్నారన్నారు. ఏఐ సహాయంతో డీప్ ఫేక్ వీడియోలతో మోసం చేస్తున్నారని చెప్పారు. పోలీస్ కమిషనర్‌కు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

October 12, 2025 / 10:21 AM IST

పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలి: MLA

RR: సమాజంలో పోలియోను నిర్మూలించడం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. అనంతరం మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.

October 12, 2025 / 10:21 AM IST