MDK: ఏడుపాయల మహాశివరాత్రి జాతర హుండీ లెక్కింపును బుధవారం గోకుల్ ఫంక్షన్ హాల్లో చేపట్టారు. 29 రోజుల హుండీ ఆదాయం రూ.39,87,178తో పాటు ఒడిబియ్యం, తలనీలాలు, ప్రత్యేక దర్శన టికెట్లు, లడ్డూ, పులిహోర విక్రయ సేవాల ద్వారా మొత్తం దేవస్థానానికి రూ.87,56,265 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వీరేశం తెలిపారు. 2025 కంటే 2026లో ఆదాయం రూ.26,06,031 ఎక్కువగా వచ్చిందన్నారు.
HNK: జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో ఇంటర్, 64 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
MDK: మనస్పర్థలతో యువకుడు ఆత్మహత్య చేసుకన్న చిలిపిచెడ్ మండలం చిట్కుల్లో జరిగింది. గ్రామానికి చెందిన అశోక్ (30) సంగారెడ్డి జిల్లా చౌటకూర్కు ఇల్లరికం వెళ్లాడు. కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా మనస్తాపం చెంది పొలానికి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. చేతికందిన కొడుకు మృతితో చిట్కుల్లోని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
MDK: మనస్పర్థలతో యువకుడు ఆత్మహత్య చేసుకన్న చిలిపిచెడ్ మండలం చిట్కుల్లో జరిగింది. గ్రామానికి చెందిన అశోక్ (30) సంగారెడ్డి జిల్లా చౌటకూర్కు ఇల్లరికం వెళ్లాడు. కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా మనస్తాపం చెంది పొలానికి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. చేతికందిన కొడుకు మృతితో చిట్కుల్లోని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
WGL: ఉమ్మడి జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు రంజాన్ నెల అత్యంత పవిత్రమైనదని మంత్రి పేర్కొన్నారు. ఈ మాసంలో ముస్లిం ప్రజలందరూ ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో, ఆరోగ్యంగా, సంతోషంగా గడపాలని మంత్రి సురేఖ కోరారు.
MBNR: గత నెల 25న ఉండవెల్లి మండలం కంచుపాడులో జరిగిన ఈడిగ కృష్ణ గౌడ్ హత్య కేసును అలంపూర్ పోలీసులు ఛేదించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు సీఐ వి.ప్రదీప్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కల్లు వ్యాపారం, స్థల వివాదంలో కృష్ణ గౌడ్ తనను ఊరిలో ఉండనివ్వడం లేదని పగతో శ్రీనివాస్ గౌడ్ తన స్నేహితుడు రాజు, నబీతో కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు తెలిపారు.
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జరుగుతున్న అరిగెల శ్రీ రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను రాత్రి అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి తిలకించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ టీమ్ క్రీడాకారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. జిల్లాలో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందేలా కృషి చేస్తానని ఎంపీ తెలిపారు.
SDPT: పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే రంజాన్ ఉపవాస దీక్ష, ఆత్మపరిశీలన, దానం, దయ, సహనానికి ప్రతీక అని ఈ పవిత్ర మాసంలో శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అల్లాహ్ కరుణాకటాక్షాలు ప్రతి ఇంటిపైనా ఉండాలని ఆయన కోరారు.
NLG: చిట్యాల మండలంలోని రైతులందరూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు వెంటనే ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ లో పేరు నమోదు చేసుకోవాలని ఏవో గిరిబాబు సూచించారు. ప్రభుత్వ సబ్సిడీలు, బీమా, మద్దతు ధర, పీఎం కిసాన్ వంటి ప్రయోజనాలు నేరుగా పొందేందుకు ఈ నమోదు తప్పనిసరి. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, ఆధార్ లింక్ ఐన మొబైల్ నంబర్తో రిజిస్ట్రీ కావాలని అన్నారు.
NZB: TU పరిధిలో ఉమ్మడి జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలలో జరిగిన మూడవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి అని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. నిన్న జరిగిన పరీక్షలకు 617 మంది విద్యార్థులకు గాను 585 మంది విద్యార్థులు హాజరు కాగా 32 మంది గైర్హాజరయ్యా రని పేర్కొన్నారు.
JGL: రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో రాయికల్ మండలం అల్లీపూర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అథ్లెటిక్స్ పోటీలలో టీ. అనూష,శేషి ప్రియ, నితీషా, బాస్కెట్ బాల్ పోటీలకు ఎన్. షర్మిల ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు పోరండ్ల కిరణ్, పీడీ క్రిష్ణ ప్రసాద్లు తెలిపారు.ఈ నెల 20-22 వరకు హనుమకొండ, నిజామాబాద్లో జరిగే అథ్లెటిక్స్ బాస్కెట్ బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు.
కోనసీమ: ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు ప్రధానంగా డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
SDPT: హైదరాబాద్ దోమలగూడలో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యంగుల క్రీడా పోటీల్లో జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 33 జిల్లాల నుంచి సుమారు 1200 మంది పాల్గొన్న ఈ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు ఏకంగా 11 బహుమతులు గెలుచుకున్నారు. అండర్-14, 17 విభాగాల్లో వినికిడి, దృష్టి లోపం, ఇతర దివ్యాంగ విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యంతో జిల్లా కీర్తిని చాటారు.
ప్రకాశం: ముస్లింలు రంజాన్ పండగను భక్తిశ్రద్ధ లతో జరుపుకోవాలని దర్శి సీఐ వై.రామారావు కోరారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో ప్రసిద్ధి చెందిన మర్కజ్ మసీద్ వద్ద బుధవారం రాత్రి ముస్లింలతో నూతన చట్టాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోలీసులు ప్రతి ముస్లిం ఇంటికి నమాజ్ పుస్తకం పంపిణీ చేశారు.
ప్రకాశం: ముస్లింలు రంజాన్ పండగను భక్తిశ్రద్ధ లతో జరుపుకోవాలని దర్శి సీఐ వై.రామారావు కోరారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో ప్రసిద్ధి చెందిన మర్కజ్ మసీద్ వద్ద బుధవారం రాత్రి ముస్లింలతో నూతన చట్టాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోలీసులు ప్రతి ముస్లిం ఇంటికి నమాజ్ పుస్తకం పంపిణీ చేశారు.